శ్రీలంక, పాక్లకు చైనా అండ.. ఐఎంఎఫ్ రుణాల విషయంలో సహకారం
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి రుణం సేకరించడానికి పాకిస్థాన్, శ్రీలంకలకు చైనా తోడ్పడుతోంది. ఐఎంఎఫ్ నుంచి రుణం కోరే సంస్థలు మొదట తమ ఆర్థిక పరిస్థితిని ఒక దారికి తెచ్చుకోవాలి.
కొలంబో/ఇస్లామాబాద్: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి రుణం సేకరించడానికి పాకిస్థాన్, శ్రీలంకలకు చైనా తోడ్పడుతోంది. ఐఎంఎఫ్ నుంచి రుణం కోరే సంస్థలు మొదట తమ ఆర్థిక పరిస్థితిని ఒక దారికి తెచ్చుకోవాలి. ఇతర దేశాలకు, సంస్థలకు తాము చెల్లించాల్సిన అప్పులను వాయిదా వేసి, స్వదేశంలో ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచుకోవాలి. దీన్ని ఆర్థిక పునర్వ్యవస్థీకరణ అంటారు. ఐఎంఎఫ్ నుంచి 290 కోట్ల డాలర్ల రుణం కోసం శ్రీలంక, 110 కోట్ల తక్షణ రుణం కోసం పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నాయి. శ్రీలంక చెల్లించాల్సిన రుణాన్ని రెండేళ్లపాటు వాయిదా వేయడానికి చైనా ఇటీవల సుముఖత వ్యక్తం చేసినా, ఐఎంఎఫ్ తృప్తిపడలేదు. దీంతో చైనా తాజాగా మరింత గడువు ఇచ్చి ఐఎంఎఫ్ రుణం పొందడానికి శ్రీలంకకు వీలు కల్పించింది. ఇతర దేశాలు, ఆర్థిక సంస్థలకు తాను చెల్లించాల్సిన రుణాల గడువు పెంచుకుంటే శ్రీలంకకు నాలుగేళ్ల కాలానికి 290 కోట్ల డాలర్ల రుణమిస్తానని ఐఎంఎఫ్ ప్రతిపాదించింది.
చైనా రుణానికి వాయిదా కోరిన పాక్
మరోవైపు చైనాకు ఈ నెలాఖరుకల్లా తాము చెల్లించాల్సిన 200 కోట్ల డాలర్ల రుణాన్ని ఇంకో ఏడాదిపాటు వాయిదా వేయాల్సిందిగా కోరినట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ఐఎంఎఫ్కు తెలిపింది. చైనా నుంచి సేఫ్ డిపాజిట్ పథకం కింద పాక్ సేకరించిన 400 కోట్ల రుణాల్లో మిగిలిన భాగాన్ని రానున్న నెలల్లో తీర్చాల్సి ఉంది. ఐఎంఎఫ్ నుంచి 110 కోట్ల డాలర్ల రుణాన్ని సేకరించడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అడుగంటిపోయిన విదేశీమారక ద్రవ్య నిల్వలను భర్తీ చేసుకోవడానికి పాకిస్థాన్ మిత్రదేశాల నుంచి, బహుళ పక్ష సంస్థలు, వాణిజ్య బ్యాంకుల నుంచి జూన్ నెలాఖరుకల్లా 1,000 కోట్ల డాలర్ల నిధులను సేకరించాలని లక్షిస్తోంది. అందులో 700 కోట్ల డాలర్ల రుణాన్ని ఐఎంఎఫ్ నుంచి పొందడానికి ప్రయత్నిస్తున్న పాక్, తక్షణం 110 కోట్ల డాలర్లను విడుదల చేయాలని కోరుతోంది. అందుకు ఐఎంఎఫ్ పెట్టిన షరతుల మేరకు తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని ప్రయత్నిస్తోంది. దీనికోసం గత నెలలో చైనా నుంచి 70 కోట్ల డాలర్లను స్వీకరించింది. త్వరలో 130 కోట్ల డాలర్ల రుణాన్ని పొందబోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు