US-Financial crisis: దివాలా అంచున అమెరికా!
అసలే మాంద్యం, ద్రవ్యోల్బణం, కొలువుల సమస్యలతో సతమతమవుతున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికాను మరో ఆర్థిక బూచి భయపెడుతోంది. అదే జో బైడెన్ ప్రభుత్వ మెడపై వేలాడుతున్న దివాలా కత్తి.
డెమోక్రాట్లు, రిపబ్లికన్ల వైరం ఫలితం
ప్రభుత్వానికి డబ్బుల కటకట
అప్పు పరిమితి పెంపునకు రిపబ్లికన్ల ససేమిరా
ప్రమాదంలో 80 లక్షల కొలువులు, డాలర్ ఆధిపత్యం
అసలే మాంద్యం, ద్రవ్యోల్బణం, కొలువుల సమస్యలతో సతమతమవుతున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికాను మరో ఆర్థిక బూచి భయపెడుతోంది. అదే జో బైడెన్ ప్రభుత్వ మెడపై వేలాడుతున్న దివాలా కత్తి. అప్పుల పరిమితిని పెంచడానికి కాంగ్రెస్ (పార్లమెంటు) ఆమోద ముద్ర వేయకపోవడంతో అమెరికా ప్రభుత్వం డబ్బులకు కటకటలాడుతోంది. ఏకంగా అధ్యక్షుడు బైడెన్ కీలక ఆస్ట్రేలియా పర్యటనను రద్దు చేసుకున్నారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఏమిటీ అప్పులు?
ఆదాయం కంటే వ్యయం పెరిగినప్పుడు ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి. ఇందుకోసం ప్రధానంగా బాండ్లు విడుదల చేస్తాయి. నిర్దిష్ట సమయంలో తిరిగి చెల్లించడమేగాకుండా.. అప్పటిదాకా వడ్డీ చెల్లిస్తామని హామీ ఇస్తాయి. అమెరికా అదే చేస్తోంది. అయితే ఏ దేశానికైనా ఇబ్బడిముబ్బడిగా అప్పులు తీసుకోకుండా నియంత్రణ ఉండటం సహజం. వందేళ్ల కిందటే అమెరికా ప్రభుత్వం తీసుకునే అప్పులను కాంగ్రెస్ నియంత్రించింది. వీటిపై పరిమితి విధించింది. అవసరాల రీత్యా ఈ పరిమితిని ఎప్పటికప్పుడు సవరిస్తూ వస్తున్నారు. 1917 నుంచి ఇప్పటిదాకా 78 సార్లు అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితిని సవరించారు. ప్రతిసారీ సాధారణంగా జరిగిపోయే ప్రక్రియే ఇది. కానీ అమెరికాలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య పెరిగిన రాజకీయ వైరం, సైద్ధాంతిక విభేదాల కారణంగా ఈసారి పీటముడి బిగుసుకుని ఆర్థిక మంత్రే చేతులెత్తేసే స్థితికి చేరుకుంది.
జీడీపీ కంటే 29% ఎక్కువగా..
2021 నాటికి ప్రభుత్వం తీసుకున్న అప్పు 28.5 ట్రిలియన్ డాలర్లు. దేశ జీడీపీ కంటే ఇది 24శాతం ఎక్కువ. ఇందులో ఎక్కువ మొత్తం దేశీయంగా వ్యక్తులు, సంస్థల నుంచి సేకరించగా సుమారు 7 ట్రిలియన్ డాలర్లను విదేశాల నుంచి సేకరించింది. జపాన్, చైనాల నుంచి బాండ్లు కొనుగోలు చేసినవారూ ఎక్కువగానే ఉన్నారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితి 31.4 ట్రిలియన్ డాలర్లు. ఇదీ దాటి అప్పులు చేయడానికి బైడెన్ ప్రభుత్వం కాంగ్రెస్ అనుమతి కోరుతోంది. కానీ ప్రతినిధుల సభలో సంఖ్యాపరంగా ఆధిక్యంలో ఉన్న రిపబ్లికన్లు అప్పు పరిమితి పెంపునకు ససేమిరా అంటున్నారు. మరింత అప్పు అంటే ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థపై నియంత్రణ లేనట్లేనని, భవిష్యత్ ఖర్చులు తగ్గించుకోవాలని వాదిస్తున్నారు. బైడెన్తో రిపబ్లికన్ల చర్చలు సాగుతున్నా కొలిక్కి రావడం లేదు.
జూన్ ఒకటిలోపు ఏ క్షణమైనా..
మరోవైపు అమెరికా ఆర్థిక మంత్రి యెలెన్ ఇప్పటికే చేతులెత్తేశారు. పరిమితి పెంచకుంటే జూన్ ఒకటోతేదీ లోపు ఏ క్షణమైనా ప్రభుత్వ చెల్లింపులు ఆగిపోతాయని ప్రకటించారు. అప్పుల పరిమితికి ప్రభుత్వం చేరుకుందంటే అదనంగా అప్పులు చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బులు, పన్నుల ద్వారా వచ్చే సొమ్మునే ప్రభుత్వం ఖర్చు చేయగలుగుతుంది. ఎప్పుడైతే ప్రభుత్వం అప్పులు, వడ్డీలు, బిల్లులు తీర్చలేని పరిస్థితి వస్తుందో అది సాంకేతికంగా దివాలా తీసినట్లుగా భావిస్తారు.
అంతర్జాతీయంగా ప్రభావం..
అమెరికా చరిత్రలో ప్రభుత్వం చెల్లింపులు జరపలేని పరిస్థితి ఇప్పటిదాకా రాలేదు. వస్తే ఇదే తొలిసారి అవుతుంది. అదే జరిగితే అమెరికాలోనే కాకుండా అంతర్జాతీయంగా తీవ్రమైన ఆర్థిక విపరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో పడతాయి. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, సైన్యానికి జీత భత్యాలు ఆగిపోతాయి. ప్రభుత్వం అందించే సంక్షేమ నిధులపై ఆధారపడే అనేక వర్గాల ప్రజలు ఇబ్బందులు పడతారు. వడ్డీ రేట్లు విపరీతంగా పెరుగుతాయి. ఫలితంగా రుణాలు, క్రెడిట్ కార్డులపై అధికంగా చెల్లించాల్సి వస్తుంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలి... చివరికది భారీ నిరుద్యోగంతో ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. ‘అమెరికా తాత్కాలికంగా స్వల్పకాలానికి బిల్లులు చెల్లించలేని పరిస్థితి తలెత్తినా 80 లక్షల ఉద్యోగాలు పోతాయి. స్టాక్ మార్కెట్ 45శాతం కుప్పకూలుతుంది’ అని శ్వేతసౌధ వర్గాలు ఆందోళన వ్యక్తంజేయడం గమనార్హం. అన్నింటికీ మించి అమెరికా ఆర్థిక వ్యవస్థపై నమ్మకం సడలుతుంది. ప్రపంచ ఆర్థిక రంగానికి ఇరుసుగా నడుస్తున్న డాలర్ ప్రాబల్యం ప్రమాదంలో పడుతుంది. చైనా కరెన్సీలాంటివి ప్రత్యామ్నాయాలుగా ఎదిగే అవకాశం ఉంది. అమెరికా ఆర్థికంగా బిల్లులు చెల్లించలేని తేదీ ఎప్పుడనేది ఇప్పుడందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఎవరూ దీనిని కచ్చితంగా చెప్పలేరు. రుణ పరిమితి పెంచకుంటే బహుశా జూన్ 1 నుంచి ఆగస్టు 1లోపు ఈ అత్యయిక పరిస్థితి తలెత్తవచ్చనుకుంటున్నారు.
రుణ పరిమితిని కాంగ్రెస్ పెంచకుంటే.. అమెరికా మాంద్యాన్ని చవిచూస్తుంది. ఆ దెబ్బకు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి. ప్రపంచంలో అమెరికా నాయకత్వం ప్ర£మాదంలో పడుతుంది. అంతర్జాతీయంగా ఆర్థిక అస్థిరతకు దారి తీస్తుంది
అమెరికా ఆర్థిక మంత్రి యెలెన్
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
మూడోసారి అంతరిక్షయానానికి సిద్ధమయ్యారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams). ఈ సందర్భంగా ఆమె తన ఇష్టాలను వెల్లడించారు. -
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
Israel Hamas Conflict: ఇజ్రాయెల్పై వస్తున్న విమర్శలను ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. తమని ఏ దేశమూ నిలువరించలేదని వ్యాఖ్యానించారు. -
టెక్సాస్ను ముంచెత్తుతున్న వరదలు
భారీ వర్షాల కారణంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని శనివారం వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా హ్యూస్టన్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. -
బ్రెజిల్లో వరద బీభత్సం.. 60 మంది మృతి
బ్రెజిల్లోని రియో గ్రాండ్ డొ సుల్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఆదివారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి వరదలు ముంచెత్తడంతో నగరంలో 60 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. -
శ్వేతసౌధం ప్రహరీ గేటును ఢీకొన్న కారు: డ్రైవర్ దుర్మరణం
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం ప్రహరీ గేటును కారు ఢీకొట్టిందని, ఈ ఘటనలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడని అధికారులు తెలిపారు. -
కీలక క్రాసింగ్పై హమాస్ దాడి
గాజాలోకి మానవతా సాయం పంపడానికి వినియోగిస్తున్న కెరోమ్ షాలోమ్ క్రాసింగ్పై ఆదివారం హమాస్ రాకెట్లతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ విడుదల చేసింది. -
మాదక ద్రవ్యాలు ఇచ్చి నాపై లైంగిక దాడి చేశారు
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ఎంపీ బ్రిటానీ లాగా(37)కు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. రాత్రి వేళ సరదాగా గడపడానికి వెళ్లిన ఆమెకు కొంతమంది దుండగులు మాదకద్రవ్యాలు అందించారు. -
చట్టబద్ధ పాలన ఉన్న దేశం మాది
కెనడా.. చట్టబద్ధ పాలన ఉన్న దేశమని ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో శనివారం పేర్కొన్నారు. తమ దేశంలో బలమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉందని, పౌరులను రక్షించడమే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని తెలిపారు. -
అల్-జజీరాపై నిషేధం
హమాస్కు అనుకూలంగా.. పక్షపాతంతో వార్తలను ప్రసారం చేస్తోందన్న అభియోగాలతో అల్-జజీరా అంతర్జాతీయ వార్తా ఛానల్పై ఆదివారం ఇజ్రాయెల్ నిషేధం విధించింది. -
హమాస్తో తాజా చర్చలు విఫలం?
ఇజ్రాయెల్తో ఈజిప్టులోని కైరోలో తాజాగా జరిపిన కీలక చర్చలు ముగిశాయని హమాస్ ఆదివారం ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్