కీలక పత్రాలు తీసుకుపోయిన ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది! రహస్య పత్రాల కేసులో శుక్రవారం ఆయనపై నేరాభియోగాలు నమోదయ్యాయి.
వాటిలో పెంటగాన్ ప్రణాళికలు, విదేశీ అణు సామర్థ్యం వివరాలు
రహస్య పత్రాల కేసులో ఫెడరల్ నేరాభియోగాలు
మయామీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది! రహస్య పత్రాల కేసులో శుక్రవారం ఆయనపై నేరాభియోగాలు నమోదయ్యాయి. పెంటగాన్ దాడుల ప్రణాళికలు, సైనిక చర్యకు సంబంధించిన రహస్య పటం, విదేశాల అణు సామ ర్థ్యాల సమాచారాన్ని ఆయన తన నివాసానికి తీసుకువెళ్లిపోయారని అభియోగాల్లో ఉంది. అమెరికా చరిత్రలో ఇలా ఫెడరల్ ప్రభుత్వ అభియోగాలు నమోదైన తొలి మాజీ అధ్యక్షుడు ఈయనే. నేరాభియోగాల దాఖలు విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఈ కేసులో మంగళవారం (జూన్ 13) మయామిలోని ఫెడరల్ కోర్టు హౌజ్లో హాజరు కావాల్సిందిగా తనకు సమన్లు అందినట్లు తెలిపారు. ఇందులో ట్రంప్ దోషిగా తేలితే దీర్ఘకాలంపాటు జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. గతంలో అశ్లీల చిత్రాల నటి స్టార్మీ డేనియల్స్కు డబ్బు చెల్లింపుల కేసులో ట్రంప్పై నేరాభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే.
కట్టలకొద్దీ పత్రాలు
ట్రంప్ 2021 జనవరిలో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ప్రభుత్వానికి చెందిన దాదాపు 300 రహస్య పత్రాలను ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో ఎస్టేట్కు తరలించినట్లు ఆరోపణలొచ్చాయి. శ్వేతసౌధాన్ని ఖాళీ చేసేందుకు తక్కువ సమయం ఇవ్వడంతో- హడావుడిలో ఆ పత్రాలను తమ వెంట తీసుకెళ్లి ఉండొచ్చని గతంలో ట్రంప్ కార్యాలయం తెలిపింది. అయితే, వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ప్రయత్నించగా.. ట్రంప్ అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే గతేడాది జనవరిలో ఎఫ్బీఐ అధికారులు ట్రంప్
ఎస్టేట్లో సోదాలు చేపట్టగా.. 15 పెట్టెల్లో 184 కీలక పత్రాలు లభించాయి. అనంతరం ఆగస్టులోనూ ఎఫ్బీఐ మరోసారి ఆ ఎస్టేట్పై దాడి చేసి 20 పెట్టెల నిండా పత్రాలను తరలించింది. జాతీయ రక్షణ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా అట్టిపెట్టుకోవడం, అధికారులను అడ్డుకోవడం, కుట్ర, అసత్య వాంగ్మూలాల వంటి నేరాభియోగాలను ట్రంప్పై ప్రస్తుతం మోపినట్లు తెలుస్తోంది.
నేను అమాయకుడిని: ట్రంప్
అభియోగాల నమోదు నేపథ్యంలో ట్రంప్ ఓ వీడియో ద్వారా స్పందించారు. తాను అమాయకుడినని పేర్కొన్నారు. ఎన్నికల్లో తనను అడ్డుకునేందుకు డెమోక్రాట్లు కుట్రపూరితంగా అభియోగాలు నమోదయ్యేలా చేశారని ఆరోపించారు. వచ్చేఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని దక్కించుకునే ప్రక్రియలో ట్రంప్ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. తాజా అభియోగాల నేపథ్యంలో ఆయన నామినేషన్ అవకాశాలకు గండిపడే అవకాశాలున్నాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. .
* రహస్య పత్రాలకు సంబంధించి ట్రంప్పై కేసు విచారణను ప్రాథమికంగా అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి ఎయిలీన్ క్యానన్ చేపట్టనున్నారు. ఇది మాజీ అధ్యక్షుడికి సానుకూలాంశమేనని పలువురు భావిస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే క్యానన్ను జడ్జిగా నియమించారు. మాజీ అధ్యక్షుడి ఎస్టేట్లో స్వాధీనం చేసుకున్న రహస్య పత్రాలపై స్వతంత్ర సమీక్ష జరిపించాలంటూ ఆయన లీగల్ బృందం నిరుడు చేసిన వినతిని క్యానన్ అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి