Rishi sunak: హిందూ విశ్వాసమే నన్ను నడిపిస్తోంది: రిషి సునాక్
తన హిందూ విశ్వాసమే తన జీవితంలోని అన్ని అంశాల్లో మార్గదర్శిగా ఉందని, బ్రిటన్ ప్రధానిగా అత్యుత్తమంగా పనిచేసే ధైర్యాన్ని ఆ విశ్వాసమే ఇస్తోందని రిషి సునాక్ తెలిపారు.
లండన్: తన హిందూ విశ్వాసమే తన జీవితంలోని అన్ని అంశాల్లో మార్గదర్శిగా ఉందని, బ్రిటన్ ప్రధానిగా అత్యుత్తమంగా పనిచేసే ధైర్యాన్ని ఆ విశ్వాసమే ఇస్తోందని రిషి సునాక్ తెలిపారు. కేంబ్రిడ్జి వర్సిటీలోని జీసస్ కళాశాలలో ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రామ కథ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘బాపు.. నేను ప్రధానిగా ఇక్కడికి రాలేదు. ఒక హిందువుగా వచ్చా. నా దృష్టిలో విశ్వాసం అనేది వ్యక్తిగతం. నా జీవితంలోని ప్రతి అంశంలోనూ ఆ విశ్వాసం నన్ను నడిపిస్తోంది. బ్రిటన్ ప్రధాని పదవి అనేది గొప్ప గౌరవం. కానీ అది అంత సులభమైనది కాదు. క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో మన విశ్వాసమే మనకు ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. నా కార్యాలయంలో బంగారు వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఏ పని చేసేముందైనా వాటి గురించి తెలుసుకోవాలని, ప్రభావాలను అంచనా వేయాలని ఆ విగ్రహం గుర్తు చేస్తూ ఉంటుంది. నా బాల్యం నుంచి పెద్దయ్యేవరకూ సౌథాంప్టన్లోని స్థానిక మందిరంతో నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పూజలు చేసేవారు, హారతులు ఇచ్చేవారు. ఆ సమయంలో నా సోదరులు, సోదరీమణులతో కలిసి ప్రసాదాలను అందజేసేవాడిని’ అని సునాక్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.