త్వరలో భారత్కు ముయిజ్జు
మోదీ, లక్షద్వీప్పై తమ మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన మాల్దీవుల ప్రభుత్వం భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
మాలె: మోదీ, లక్షద్వీప్పై తమ మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన మాల్దీవుల ప్రభుత్వం భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు త్వరలోనే భారత పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాల్దీవుల అధికారులు.. అధ్యక్షుడి దిల్లీ పర్యటనకు షెడ్యూలు ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగానీ, ఫిబ్రవరి మొదటి వారంలోగానీ ఆయన భారత్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా విభేదాలతో దీనికి ఎలాంటి సంబంధం లేదని, అంతకంటే ముందుగానే మాల్దీవుల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతేడాది యూఏఈలో జరిగిన కాప్ 28 పర్యావరణ సదస్సులో భారత ప్రధాని మోదీతో ముయిజ్జు భేటీ అయ్యారు. ఆ సమయంలోనే ఆయన దిల్లీ పర్యటనపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
విశాల దృక్పథంతో ఆలోచించాలి: చైనా
బీజింగ్: ప్రధాని మోదీ, లక్షద్వీప్పై మాల్దీవుల మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై చైనా మరోసారి తన అక్కసును చాటుకుంది. భారత్ మరింత విశాల దృక్పథంతో ఆలోచించాలని వ్యాఖ్యానించింది. ఈ మేరకు చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ సంపాదకీయాన్ని ప్రచురించింది. ‘మాల్దీవులను మేం ఎప్పటికీ సమాన భాగస్వామిగా పరిగణిస్తాం. దాని సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం. భారత్, చైనా మధ్య ఘర్షణల కారణంగా దిల్లీకి దూరంగా ఉండాలని మాల్దీవులకు ఎన్నడూ చెప్పలేదు. ఈ ద్వీప దేశానికి భారత్ నుంచి వచ్చే సహకారాన్ని ముప్పుగా భావించలేదు. దక్షిణాసియాలో కొన్ని దేశాలతో దిల్లీ సంబంధాలు దెబ్బతిన్నాయి. దానికి చైనాను నిందించడం మాని.. భారత్ మరింత విశాల దృక్పథంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి’ అని చైనా వ్యాఖ్యానించింది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు చైనాలో పర్యటిస్తున్న వేళ ఈ స్పందన రావడం గమనార్హం.
భారత్ మనకు ‘911 కాల్’ వంటిది: మాజీ మంత్రి
భారత్ తమకు మిత్ర దేశమని, ఎల్లప్పుడూ సాయం చేస్తుందని మాల్దీవుల రక్షణశాఖ మాజీ మంత్రి మరియా అహ్మద్ పేర్కొన్నారు. అది ఆపత్కాలంలో ఆదుకునే ‘911 కాల్’ వంటిదని స్పష్టం చేశారు. ‘ప్రస్తుత ప్రభుత్వంలో దూర దృష్టి లోపించింది. అందరితో స్నేహంగా ఉండే చిన్న దేశం మనది. అదే సమయంలో భారత్ పొరుగు దేశమన్న విషయాన్ని మరవకూడదు. రెండు దేశాలకు ఒకే రకమైన సవాళ్లున్నాయి. భారత్ ఎల్లప్పుడూ మనకు సాయం చేస్తుంది. ఇతర రంగాలతోపాటు రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు సహకరిస్తోంది. ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిరక్షణ విషయంలో ఇరు దేశాలదీ ఒకే వైఖరి. ఇలాంటి చిరకాల మైత్రిని దెబ్బతీసే ఏ ప్రయత్నమూ సరికాదు’ అని వ్యాఖ్యానించారు.
మాల్దీవుల ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులు భారత్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు దిగిపోవాలనే డిమాండ్లు జోరందుకున్నాయి. ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని పార్లమెంటరీ మైనారిటీ నేత అలీ అజీం పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. ‘ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవు’!
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీ రైసీ హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించినట్లు ఐఆర్ఎన్ఏ పేర్కొంది. అక్కడి సహాయక బృందాలను పంపినట్లు వెల్లడించింది. -
రోదసిలోకి తెలుగుతేజం
తెలుగు తేజం గోపీచంద్ తోటకూర ఆదివారం దిగ్విజయంగా రోదసియాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. -
అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది! ఆయన సురక్షితంగా ఉన్నదీ లేనిదీ అంతుచిక్కకపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. -
ఆకాశంలో రాకాసి ఉల్క
స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ భారీ ఉల్క భూమిపై పడింది. భూవాతావరణాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే క్రమంలో అది రాపిడికి లోనై నీలివర్ణపు వెలుగులను వెదజల్లింది. -
గాజాపై గగనతల దాడిలో 27 మంది మృతి
ఇజ్రాయెల్ జరిపిన గగనతల దాడిలో గాజాలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. నుసీరత్లో పాలస్తీనా శరణార్థి శిబిరంపై చోటుచేసుకున్న ఈ ఘటన మృతుల్లో 10 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. -
బ్రిటన్ రాజు చార్లెస్-3 ఆస్తుల కంటే రిషి సునాక్ దంపతుల సంపదే ఎక్కువ
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతామూర్తిల ఆస్తులు ఇటీవల గణనీయంగా పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. -
కాంగోలో తిరుగుబాటుకు విఫలయత్నం
దేశంలో తిరుగుబాటుకు జరిగిన ప్రయత్నాన్ని వమ్ము చేసినట్లు కాంగో సైన్యం ఆదివారం ప్రకటించింది. దీనికి సంబంధించి పలువురిని అరెస్టు చేసినట్లు తెలిపింది. -
విషమంగానే స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో ఆరోగ్యం
స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59) ఆరోగ్యం ఆదివారమూ విషమంగానే ఉంది. దేశ రాజధాని బ్రటిస్లావాకు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలోని హాండ్లోవా పట్టణంలో ఫికోపై ఓ దుండగుడు బుధవారం కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. -
అఫ్గాన్లో కొనసాగుతున్న కుండపోత వర్షాలు
అధిక వర్షాలు అఫ్గానిస్థాన్ను అల్లకల్లోలానికి గురిచేస్తున్నాయి. కుండపోత వానలకు వరదలు తోడు కావడంతో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. -
ఆ ఘటనతోనే భారత్తో వాణిజ్య బంధానికి తెర : పాక్
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ దిగుమతులపై భారత్ అధిక సుంకాలు విధించడం ప్రారంభించిందని ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ అన్నారు. -
రష్యా, ఉక్రెయిన్ పరస్పర దాడులు
రష్యా, ఉక్రెయిన్లు పరస్పరం డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. దీనివల్ల పలుచోట్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. తమ దేశంలోకి వచ్చిన 57 డ్రోన్లు, పలు క్షిపణులను కూల్చేశామని రష్యా ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇదీ స్ట్రాంగ్రూమే!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అందనంత దూరంలో కోడి ధర.. రూ. 300లకు చేరువలో స్కిన్ లెస్
-
శ్రీశైలంలో అభిషేకం టికెట్లపై అదనపు బాదుడు.. భక్తుల జేబుకు చిల్లు
-
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. ‘ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవు’!