మాస్కో ఉగ్రదాడి ముష్కరుల నేరాంగీకారం
ఓ సంగీత కచేరీపై విరుచుకుపడి పెద్దఎత్తున ప్రజల ప్రాణాలు బలిగొన్న ముష్కరులు రష్యా న్యాయస్థానంలో తమ నేరాన్ని అంగీకరించారు.
తీవ్రగాయాలతో కోర్టుకు హాజరు
మాస్కో: ఓ సంగీత కచేరీపై విరుచుకుపడి పెద్దఎత్తున ప్రజల ప్రాణాలు బలిగొన్న ముష్కరులు రష్యా న్యాయస్థానంలో తమ నేరాన్ని అంగీకరించారు. కాల్పులు, బాంబు పేలుళ్ల తర్వాత పరారయ్యే ప్రయత్నంలో శుక్రవారం పట్టుబడిన నలుగురిని సోమవారం మాస్కోలోని బాస్మనీ జిల్లా న్యాయస్థానంలో హాజరుపరిచారు. వీరందరినీ అద్దాల గదిలో ఉంచి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారిలో ఒకరి చెవి పూర్తిగా కోసేసి ఉంది. మే 22 వరకు నలుగురినీ కస్టడీలో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. పోలీసులు మొత్తం ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిలోనే ఈ నలుగురు (దలెర్ద్జొన్ మిర్జొయెవ్, సైదక్రామి రచబలిజొద, షంసిదున్ ఫరీదుని, ముఖమ్మద్సొబిర్ ఫైజొవ్) ఉన్నారు. వీరు అఫ్గానిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఇస్లామిక్ స్టేట్-ఖొరాసాన్ ఉగ్రముఠాకు చెందినవారిగా అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాలతో కనిపించిన ముగ్గురూ నేరాన్ని అంగీకరించగా- నాలుగో వ్యక్తి అసలు మాట్లాడలేని స్థితిలో.. విచారణ జరుగుతున్నంతసేపూ చక్రాల కుర్చీలో కళ్లు మూసుకొని ఉన్నాడు. వారికి కరెంట్ షాక్ ఇవ్వడం ద్వారా విచారణాధికారులు తీవ్రంగా హింసించి ఉంటారని కథనాలు వెలువడ్డాయి.
డబ్బు కోసమే చేశామని వెల్లడి
నిందితులను రష్యా-బెలారస్ సరిహద్దులోని ఓ గ్రామంలో బంధించి విచారించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. డబ్బు కోసమే ప్రజలపై కాల్పులు జరిపానని నిందితుల్లో ఒకరు వెల్లడించినట్లు తెలిపింది. మాస్కోలో దాడులకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే కారణమని నమ్మడానికి ఆధారాలుంటే ఇవ్వాలని అమెరికాను రష్యా కోరింది.
అతివాద ఇస్లామిస్టుల పనే: పుతిన్
ఉగ్రదాడికి పాల్పడినవారు అతివాద ఇస్లామిస్టులని రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా ఆరోపించారు. ఇస్లామిక్ అతివాదులు ఏ భావజాలంతో పనిచేస్తున్నారో దానికి అనుగుణంగానే వీరూ ఘాతుకానికి తెగబడ్డారని సోమవారం ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు. కాల్పుల తర్వాత వారు ఉక్రెయిన్ వైపు పారిపోయేందుకు ఎందుకు ప్రయత్నించారో, వారి కోసం అక్కడ ఎవరు నిరీక్షిస్తున్నారో తెలుసుకోవాల్సి ఉందన్నారు.
రెండు రష్యా నౌకల్ని ధ్వంసం చేసిన ఉక్రెయిన్
కీవ్: రష్యాకు చెందిన రెండు భారీ నౌకలను నల్ల సముద్రంలో ఉక్రెయిన్ ఒకేరోజు ధ్వంసం చేసింది. దీంతో ఈ యుద్ధంలో 20 నౌకలను రష్యా నష్టపోయినట్లైంది. ఉక్రెయిన్ చర్య చరిత్రలో నిలిచిపోతుందని యూకే రక్షణ మంత్రి గ్రాంట్ షాంప్స్ పేర్కొన్నారు. ‘నల్ల సముద్రం నుంచి పుతిన్ సురక్షితంగా పోరాడే అవకాశం లేదు. 1783 నుంచి నల్ల సముద్ర దళాన్ని రష్యా నిర్వహిస్తున్నా ప్రయోజనం లేదు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ ఓటమిని ప్రపంచం తట్టుకోలేదు. రష్యా దాడులను తట్టుకొనేలా కీవ్కు మేం అండగా ఉంటాం’ అని చెప్పారు. తాజాదాడితో రష్యాకు ఇక కేవలం మూడు ల్యాండింగ్ షిప్లు మాత్రమే నల్ల సముద్రంలో మిగిలినట్లయింది. యుద్ధం మొదలైనప్పుడు మాస్కో వద్ద ఇలాంటి 13 నౌకలు ఉండేవి. ఉక్రెయిన్ దాడులను తట్టుకోలేక గతేడాది రష్యా చాలావరకు బ్లాక్ సీ నౌకాదళాన్ని ఇతర ప్రాంతాలకు తరలించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!