అమెరికాలో కుప్పకూలిన వంతెన
అమెరికాలోని బాల్టిమోర్లో భారీ ప్రమాదం జరిగింది. సరకు రవాణా నౌక పిల్లర్ను ఢీకొనడంతో నదిపై ఉన్న కీలక వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆ సమయంలో వంతెనపై వెళ్తున్న వాహనాలన్నీ నీటిలో పడిపోయాయి.
బాల్టిమోర్లో పిల్లర్ను నౌక ఢీకొనడంతో ప్రమాదం
నౌకా సిబ్బంది భారతీయులే
అందరూ క్షేమం
బాల్టిమోర్: అమెరికాలోని బాల్టిమోర్లో భారీ ప్రమాదం జరిగింది. సరకు రవాణా నౌక పిల్లర్ను ఢీకొనడంతో నదిపై ఉన్న కీలక వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆ సమయంలో వంతెనపై వెళ్తున్న వాహనాలన్నీ నీటిలో పడిపోయాయి. పలువురు గల్లంతయ్యారు. నదిలో పడిపోయిన వారిలో ఇద్దరిని సహాయక సిబ్బంది కాపాడారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఢీకొన్న నౌకలోనూ మంటలు చెలరేగాయి. నౌకలోని సిబ్బంది అంతా భారతీయులే. వారంతా క్షేమంగానే ఉన్నారు. తొలుత నౌకలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెంటనే ప్రమాద సంబంధ సమాచారాన్ని నౌకా సిబ్బంది అధికారులకు అందించారు. మరుక్షణం వంతెనపై వాహనాలను ఆపేయడంతో భారీ ముప్పు తప్పింది. అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.
పటాప్స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెనను నౌక ఢీకొనడంతో వంతెన మొత్తం కుప్పకూలింది. నౌక ఢీకొనగానే వంతెన పిల్లర్ బొమ్మలా విరిగిపోయింది. ఆ వెంటనే సెకన్లలోనే వంతెన కూలింది. ప్రమాదం తర్వాత అందులో పడిన వాహనాలు 50 అడుగుల లోతులో కనిపించాయి. ఇలాంటిది ఎన్నడూ చూడలేదని, ఇదంతా సినిమాలో సన్నివేశంలా అనిపించిందని బాల్టిమోర్ మేయర్ బ్రాండన్ స్కాట్ వ్యాఖ్యానించారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వంతెన పిల్లర్ను నౌక ఢీకొందని తమకు సమాచారం వచ్చిందని బాల్టిమోర్ అగ్నిమాపకశాఖ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కెవిన్ కార్ట్రైట్ తెలిపారు. ‘ఇది అతి తీవ్రమైన అత్యవసర పరిస్థితి. ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై చాలా వాహనాలున్నాయి. ప్రస్తుత మా లక్ష్యం నదిలో పడిపోయిన వారి కోసం గాలించడం. ఏడుగురు నదిలో పడిపోయారని భావిస్తున్నాం. అయితే ఎంత మంది పడిపోయారనేది అప్పుడే పూర్తి స్థాయిలో నిర్ధారణకు రాలేం’ అని కార్ట్రైట్ వివరించారు. ప్రమాదం నేపథ్యంలో ట్రాఫిక్ను మళ్లించారు. నౌకలోని సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. నౌక వంతెనను ఢీకొనడానికి దారితీసిన కారణాలు తెలియరాలేదు. ప్రమాదం నేపథ్యంలో అన్ని నౌకల ప్రయాణాన్ని రద్దు చేశారు. వంతెనకు మరమ్మతు జరిగే వరకూ అనుమతించబోమని వెల్లడించారు.
మధ్యాహ్నం జరిగి ఉంటే..
ప్రమాదం అర్ధరాత్రి జరగడంవల్ల వంతెనపై ఎక్కువగా వాహన సంచారం లేదని, అదే మధ్యాహ్నం సమయంలో జరిగి ఉంటే వందల కార్లు వంతెనపై ఉండేవని, ఊహించని ఉత్పాతం జరిగి ఉండేదని కార్ట్రైట్ పేర్కొన్నారు. నౌకా సిబ్బంది హెచ్చరిక కూడా ప్రమాదంలో ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా కాపాడిందని తెలిపారు.
అత్యవసర పరిస్థితి ప్రకటన
ప్రమాదం నేపథ్యంలో మేరీలాండ్ గవర్నర్ వెస్ మూర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఫెడరల్ ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నామని చెప్పారు. ఎఫ్బీఐ ఘటనా స్థలికి చేరుకుంది. అయితే ఉగ్రవాద కోణంలో ఆధారాలేమీ లభించలేదని వారు తెలిపారు.
1977లో నిర్మాణం
అమెరికా తూర్పు తీరంలో ఉన్న మేరీలాండ్లోని బాల్టిమోర్ సరకు రవాణాకు కీలక కేంద్రం. ఆ నగరంలోని పటాప్స్కో నదిపై 1977లో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెనను నిర్మించారు. ఒక రచయిత పేరును ఈ వంతెనకు పెట్టారు.
సిబ్బంది భారతీయులే
సింగపూర్ జెండాతో ‘డాలీ’ అనే నౌక బాల్టిమోర్ నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ నౌక 985 అడుగుల పొడవు, 157 అడుగుల వెడల్పు ఉంది. ఈ నౌకను మెర్స్క్ షిప్పింగ్ కంపెనీ అద్దెకు తీసుకుంది. ఈ ప్రమాదం జరిగిన వార్తలు రాగానే నాస్డాక్ కోపెన్హాగెన్లో షేరు ధర 2 శాతం పడిపోయింది. నౌకలోని మొత్తం 22 మంది సిబ్బంది భారతీయులేనని కంపెనీ వెల్లడించింది. వారెవరికీ గాయాలు కాలేదని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు