Earthquake: అతి తీవ్రమైన ఐదు భూకంపాలివే..!
రిక్టర్ స్కేల్పై 9 తీవ్రత దాటిన భూకంపాలు కూడా నమోదయ్యాయి. అవి సృష్టించిన రాకాసి సునామీ అలలు భారీ ప్రాణనష్టాన్ని కలిగించాయి. అత్యంత ప్రమాదకరమైన ఐదు భూకంపాల వివరాలు తెలుసుకొందాం..
ఇంటర్నెట్డెస్క్: తుర్కియే(Turkey), సిరియా(Syria)లో నిమిషాల వ్యవధిలోనే వరుస భూకంపాలు చోటు చేసుకొన్నాయి. అమెరికా జియోలాజికల్ సర్వే అంచనాల ప్రకారం మృతుల సంఖ్య 1,000-10,000 మధ్య ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత భూకంపాల తీవ్రత, అక్కడ నివసించే జనాభాను దృష్టిలో పెట్టుకొని ఈ అంచనాలను తయారు చేసింది. ఓ పక్క గడ్డకట్టుకుపోయే చలిలో సహాయక చర్యలు జరుగుతున్నాయి. చాలా భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. భూకంపం తెల్లవారుజామున చోటు చేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగానే ఉండే అవకాశమున్నట్లు అధికార వర్గాలు భయపడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 1600 మందికి పైగా మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి.
తుర్కియే భౌగోళికంగా భూకంప జోన్లో ఉంది. ఇక్కడ గతంలో కూడా భారీ భూకంపాలు సంభవించాయి. భూకంప లేఖినిపై 7.8 తీవ్రత నమోదైంది. సిస్మోగ్రాఫిక్ పరికరాలను రూపొందించాక.. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం ప్రపంచంలో చిలీ, అలాస్కా, సుమత్ర దీవులు, జపాన్ దీవులు, రష్యాలో వచ్చిన కొన్ని భూకంపాలు తొమ్మిదికి పైగా తీవ్రతతో చోటుచేసుకున్నాయి. ఇక తొమ్మిదవ అతిపెద్ద భూకంపం 1950లో అస్సాం,టిబెట్ సరిహద్దుల్లో చోటు చేసుకొంది.
రికార్డుల్లో నమోదైన అతిపెద్ద భూకంపం..
1960 మే 22న చిలీలోని బయో-బయో ప్రాంతంలో 9.5 తీవ్రతతో భూమి దాదాపు 10 నిమిషాలు కంపించింది. రికార్డుల్లో నమోదైన భూకంపాల్లో ఇదే అతిపెద్దది. సముద్రంలో 25 మీటర్ల ఎత్తున ఏర్పడ్డ రాకాసి అలలు దక్షిణ చిలీ, హవాయి, జపాన్, ఫిలిప్పీన్స్, తూర్పు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తీరాలను తాకాయి. ఈ భూకంపం, సునామీల్లో చనిపోయిన వారి సంఖ్య 1,000 నుంచి 6,000 మధ్య ఉంటుంది. దాదాపు నాలుగు బిలియన్ డాలర్ల ఆస్తినష్టం చోటు చేసుకొంది.
పండగరోజున వణికించి..
1964 అలాస్కాలో భారీ భూకంపం వచ్చింది. ఆ రోజు గుడ్ఫ్రైడే. భూకంప లేఖినిపై 9.2 తీవ్రతతో 4.38 నిమిషాలు భూమి కంపించింది. ఇప్పటి వరకు నమోదైన భూకంపాల్లో రెండో అతిపెద్దది. చాలా చోట్ల భూమి చీలిపోయింది. ఇళ్లు, ఇతర నిర్మాణాలు నేలమట్టం అయ్యాయి. భూకంపానికి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపం నుంచి పుట్టిన సునామీ అలల కారణంగా 131 మంది మరణించారు. సునామీ అలలు పెరూ, మెక్సికో, జపాన్, న్యూజిలాండ్ దేశాలను తాకాయి.
సుమత్ర భూకంపం ఓ పీడకల..
2004 డిసెంబర్ 26వ తేదీన సుమత్రా తీరంలోని సముద్ర ప్రాంతంలో 9.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూకంప లేఖనిపై నమోదైన మూడో అతిపెద్ద భూకంపం ఇదే. ఈ భూకంపం నుంచి పుట్టిన అలలు 14 దేశాల తీరాలను అతలాకుతలం చేసి మొత్తం 2,27,898 మంది ప్రాణాలను బలిగొంది. మానవ చరిత్రలో చవిచూసిన అతిపెద్ద ఉపద్రవాల్లో ఇది కూడా ఒకటి. భూకంపం వచ్చిన రెండు గంటలకు రాకాసి అల ఒకటి భారత్లో అండమాన్-నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాలను తాకింది. కేరళలో దీని ప్రభావం కనిపించింది. రెండు నుంచి ఐదు సునామీ అలలు తీరాలను తాకినట్లు రికార్డులు చెబుతున్నాయి.
2011లో జపాన్లో భూకంపం..
జపాన్ చరిత్రలో అతిపెద్ద భూకంపం 2011లో నమోదైంది. టొహోకు వద్ద 9.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో దాదాపు 40 మీటర్ల ఎత్తుతో భయంకరమైన సునామీ అలలు విరుచుకుపడ్డాయి. దాదాపు 15,500 మంది మరణించారు. 4.5లక్షల మంది నిరాశ్రయులైపోయారు. ఇక ఫుకుషిమా అణు రియాక్టర్ ధ్వంసమై ప్రజలను బెంబేలెత్తించింది. 1986 నాటి చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంటు దుర్ఘటన తరవాత ఇది రెండో అతిపెద్ద అణుప్రమాదం. ఈ ఘటన తర్వాత 12 లక్షల టన్నుల రేడియోధార్మిక జలాలను అక్కడకు దూరంగా ఉన్న ఓ ప్రదేశంలో ఉంచిన వెయ్యి ట్యాంకుల్లోకి తరలించారు. ఈ జలాల్లో పెద్ద మొత్తంలో సీజియం, ట్రీటియం, కోబాల్ట్, కార్బన్-12 లాంటి రేడియోధార్మిక ఐసోటోప్లు ఉన్నాయి.
వెంటాడి ప్రాణాలు తీసిన రాకాసి అలలు..
రష్యాకు చెందిన కమ్చట్కా ద్వీపకల్పంలో 1952లో 9 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఇది దాదాపు 18 మీటర్లున్న మూడు భారీ సునామీ అలలను పుట్టించింది. సెవెరే-కురిల్స్క్ ప్రాంతంపై ఇవి పెను ప్రభావం చూపాయి. భూకంపం వచ్చిన వెంటనే ఇక్కడి ప్రజలు ప్రాణభయంతో సమీపంలోని కొండలపైకి పారిపోయారు. దీంతో తొలి సునామీ అల నుంచి తప్పించుకొన్నారు. కానీ, వీరు తిరిగి ఇళ్లకు వచ్చాక రెండో సునామీ అల విరుచుకుపడింది. ఇక్కడ నివసించే మొత్తం 6,000 మందిలో 2,336 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత సోవియట్ ప్రభుత్వం ప్రజలను ఇక్కడి నుంచి ఖాళీ చేయించి వేరే చోట పునరావాసం ఏర్పాటు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం