Israel Hamas: హూతీల వద్ద హైపర్సోనిక్ క్షిపణులు..!
హూతీ తిరుగుబాటుదారుల వద్ద హైపర్సోనిక్ క్షిపణులూ ఉన్నాయంటూ రష్యా అధికార మీడియా పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: వాణిజ్య నౌకలే లక్ష్యంగా యెమెన్కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు (Houthi Rebels) దాడులకు తెగబడుతున్నారు. వారివద్ద అత్యాధునిక హైపర్సోనిక్ క్షిపణులూ (Hypersonic Missile) ఉన్నాయంటూ రష్యా అధికారిక మీడియా తాజాగా పేర్కొంది. శత్రువులు ఊహించని ఆయుధాలు తమవద్ద ఉన్నాయంటూ హూతీలు ప్రకటనలు చేస్తోన్న వేళ.. ఈ కథనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దాడుల తీవ్రత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
‘‘హూతీల క్షిపణి బలగాలు ఇటీవల ‘మాక్ 8’ వేగానికి చేరుకోగల మిసైల్ను విజయవంతంగా పరీక్షించాయి. ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో నౌకలతోపాటు ఇజ్రాయెల్లోని లక్ష్యాలపై దాడులకు గానూ వాటి తయారీని ప్రారంభించాలని భావిస్తున్నాయి’’ అని సదరు వర్గాలతో సంబంధం ఉన్న ఓ సైనికాధికారిని ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థ తెలిపింది.
అవి అణు బెదిరింపులు కావు.. అమెరికా వక్రీకరించింది: క్రెమ్లిన్
‘మాక్ 8’ అంటే.. ధ్వని వేగానికి ఎనిమిది రెట్లు ఎక్కువ వేగం. ‘మాక్ 5’కు మించి దూసుకెళ్లే క్షిపణులను అడ్డుకోవడం గగనతల రక్షణ వ్యవస్థలకు సవాలుగా మారుతుంది. తిరుగుబాటుదారులకు అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్.. తమవద్ద హైపర్సోనిక్ క్షిపణులు ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించింది. హూతీలు ప్రస్తుతం దాడులకు ఉపయోగిస్తోన్న ఆయుధాలు ఈ దేశమే సమకూర్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే వీటిని ఇరాన్ ఖండిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు ప్రమాదం..!
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. -
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిల ఆస్తుల విలువ కింగ్ చార్లెస్ III కంటే ఎక్కువని వెల్లడైంది. -
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
పంచన్ లామా ఆచూకీని చైనా ప్రకటించాలని అమెరికా మరోసారి డిమాండ్ చేసింది. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని కోరింది. -
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ భారీ ఉల్క కనువిందు చేసింది. ఇది నేలరాలే సమయంలో వచ్చిన వెలుగుకు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. -
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
అమెరికా అధ్యక్ష ఎన్నికలో బరిలో ఉన్న ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. -
రణరంగంగా తైవాన్ పార్లమెంటు
ఓ బిల్లుపై చర్చ సందర్భంగా తైవాన్ పార్లమెంటులో అధికార, విపక్ష ఎంపీలు పరస్పర దాడులకు దిగారు. ఒకరినొకరు ఎత్తిపడేసి.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. -
సింగపూర్లో మళ్లీ కొవిడ్ అలజడి
కొవిడ్-19 మహమ్మారి సింగపూర్లో మరోసారి కలకలం రేకెత్తిస్తోంది. ఈ నెల 5 నుంచి 11 మధ్య 25,900కుపైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆంగ్ యె కుంగ్ తెలిపారు. -
సంక్షిప్త వార్తలు (4)
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వెళుతున్న మినీ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఓ ఉమ్మడి కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు సహా 14 మంది మృతి చెందారు. -
కిర్గిజ్స్థాన్లో విదేశీ విద్యార్థులపై మూకదాడులు
కిర్గిజ్స్థాన్లోని భారత విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజధాని బిష్కెక్లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగడంతో.. ఎవరూ బయటకు రావొద్దని సూచించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన