Ukraine Crisis: ‘బ్యాటిల్ ఆఫ్ బ్రోవరీ’.. పల్లె గెలిపించిన యుద్ధం..!
జీవన్మరణ పోరాటంలో.. మీ దగ్గర తుపాకీ ఉందా.. కత్తి ఉందా.. కర్ర ఉందా.. అనవసరం. చేతికందిన ఆయుధంతో పోరాటం చేసి ప్రాణాలు నిలుపుకోవాలి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ వాసులు అదే చేశారు. రష్యన్లతో పోలిస్తే అత్యంత బలహీనమైన
గ్రామస్థులే వేగులుగా.. టెలిగ్రామే వాహకంగా..!
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
జీవన్మరణ పోరాటంలో.. మీ దగ్గర తుపాకీ ఉందా.. కత్తి ఉందా.. కర్ర ఉందా.. అనవసరం. చేతికందిన ఆయుధంతో పోరాటం చేసి ప్రాణాలు నిలుపుకోవాలి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ వాసులు అదే చేశారు. రష్యన్లతో పోలిస్తే అత్యంత బలహీనమైన సేనలకు వీలైనంత సాయం చేశారు. యుద్ధంలో అత్యంత కీలకమైన సమాచారాన్ని వారికి ఎప్పటికప్పుడు చేరవేశారు. వేర్వేరు ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకొన్న యాప్స్ను ఇందుకోసం వాడుకొన్నారు. కీవ్ దళాల గురితప్పి ఉన్న ఆయుధాలు వృథా కాకుండా రష్యా దళాల కచ్చితమైన కదలికల సమాచారాన్ని అందించారు. ఫలితంగా కీవ్ను ఆక్రమించుకొనేందుకు వచ్చిన మాస్కో సేనలకు హైవే-7పై అత్యంత తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. దీంతో ఆ సేనలు వెనుదిరగాల్సి వచ్చింది.
మాస్కోకు అతిపెద్ద ఓటమి హైవే-7పైనే..
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలకమైన పోరు జరిగిన ప్రదేశాల్లో హైవే-7 ఒకటి. ఇది రష్యా నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్కు వెళుతుంది. ఈ మార్గంలోని గ్రామాల ప్రజలు సాధారణ యాప్లు, గూగుల్ మ్యాప్లను వాడి రష్యా దళాల కదిలకలను ఎప్పటికప్పుడు కీవ్ సేనలకు అందజేశారు. దీంతో ఉక్రెయిన్ దళాలు కచ్చితంగా గురిచూసి రష్యా దళాలను ఓడించాయి. ఒక దశలో రష్యా దళాలు మొబైల్ అంత్యక్రియల కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని గ్రామస్థులు చెప్పారు.
బైకీవ్ అనే గ్రామంలో రష్యా దళాలు ఓ ఆస్పత్రిలో మందుగుండు, సాయుధ వాహనాలను ఉంచాయి. ఈ సమాచారం తెలుసుకొన్న ఉక్రెయిన్ దళాలు ఆ ఆసుపత్రిపై దాడి చేసి సమూలంగా ధ్వంసం చేశాయి. అసుపత్రి పోయిందన్న భాధ గ్రామస్థుల్లో ఉన్నా.. రష్యన్ల ఆక్రమణ అడ్డుకొన్నామని గ్రామస్థులు భావిస్తున్నారు.
రష్యా దళాలు కీవ్ను స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన సమయంలో భారీ కాన్వాయ్లను తరలించాయి. వీటికి సంబంధించిన రేషన్,ఇంధనం వంటి వాటి సరఫరాకు హైవే-7ను ఎంచుకొంది. ఇది 230 మైళ్ల పొడవు ఉంది. ఈ మార్గంలో ఉక్రెయిన్ దళాలు జరిపిన దాడులు రష్యాను కుంగదీశాయి. రష్యా దళాల నిర్లక్ష్యంతో లాజిస్టిక్స్పై దృష్టిపెట్టలేదని సైనిక నిపుణులు చెబుతున్నారు. తక్కువ బడ్జెట్ కూడా దీనికి కారణం కావచ్చని పేర్కొన్నారు.
90వ గార్డ్స్ ట్యాంక్ డివిజన్కు మృత్యువల..
హైవే-7పై కీవ్ శివార్లలోని బ్రోవరి అనే ప్రదేశంలో రష్యాకు చెందిన 90గార్డ్స్ ట్యాంక్ డివిజన్ను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక్కడ ఉక్రెయిన్ దళాలు యాంటీ ట్యాంక్ ఆయుధాలతో ముందు, వైనుక వైపు నుంచి విరుచుకుపడి ట్యాంకుల శ్రేణి మొత్తాన్ని ధ్వంసం చేశాయి. ఈ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్గా ఉన్నాయి. ఈ యుద్ధంలో టెట్యాన చొర్నోవోల్ అనే ఉక్రెయిన్ ప్రజాప్రతినిధి కూడా పాల్గొన్నాడు. ఈ దాడికి అవసరమైన ఇంటెలిజెన్స్ సమాచారం మొత్తం గ్రామస్థుల నుంచి వచ్చిందే.
సాధారణ యాప్స్నుంచే కీలక సమాచారం..
ఈ జాతీయ రహదారి వెంట ఉన్న చాలా గ్రామాలు రష్యాసేనల చేతిలోకి వెళ్లాయి. దీంతో ఉక్రెయిన్ బలగాలకు రష్యా దళాల కదలికలకు సంబంధించి కచ్చితమైన ఇంటెలిజెన్స్ అందడం కష్టమైంది. మరోపక్క సుమీ నగరం నుంచి బ్రోవరీకి వెళుతున్న దళాలు చెట్లల్లో నక్కుతున్నాయి. దీంతో ఉక్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ ఓ టెలిగ్రామ్ ఛానల్ను ఏర్పాటు చేసి.. అందులో రష్యా దళాల కదలికలు చెప్పాలని కోరింది. దీంతోపాటు కీవ్లో పార్కింగ్ టికెట్లు జారీ, నీటి సరఫరా నిలిపివేత తెలియజేసేందుకు వాడే ఓ యాప్లో మార్పులు చేసి రష్యా దళాల కదలికలను గ్రామస్థులు వెల్లడించేలా ఏర్పాటు చేశారు. ఇలా సేకరించిన సమాచారాన్ని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్కు అందజేశారు. అక్కడ వివిధ మార్గాల్లో వారు సేకరించిన డేటాతోపోల్చి చూసి ధ్రువీకరించుకొన్నాక దాడులు చేశారు. అంతేకాదు.. ప్రజలకు గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పిన్ చేయడం నేర్పడం కూడా మాస్కో దళాల అనుపానులు చెప్పేందుకు ఉపయోగపడింది. అక్కడి ప్రజలు సమాచారం అందించాక.. సదరు డేటాను డిలీట్ చేసేవారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం