Pakistan: పాక్ను ఐఎమ్ఎఫ్ వలస దేశంగా చూస్తోంది: పీఎంఎల్
ఐఎమ్ఎఫ్ (IMF)తో గత ప్రధాని ఇమ్రాన్ఖాన్ (Imran Khan) చేసుకున్న ఒప్పందాల కారణంగా ఒక బిలియన్ డాలర్ అప్పు కోసం పాక్ (Pakistan) ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తిందని పీఎంఎల్ (ఎన్) సీనియర్ నాయకురాలు మరియమ్ నవాజ్ (Marayam Nawaz) ఆరోపించారు.
లాహోర్: అంతర్జాతీ ద్రవ్య నిధి సంస్థ (IMF) చేతిలో పాకిస్థాన్ (Pakistan) బందీ అయిందని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పీఎంఎల్ (ఎన్) సీనియర్ నాయకురాలు మరియమ్ నవాజ్ (Marayam Nawaz) ఆరోపించారు. ఈ పరిస్థితికి మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ (Imran Khan) గతంలో చేసుకున్న ఒప్పందాలే కారణమని ఆమె విమర్శించారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్కు అత్యవసర సాయం కింద 1.1 బిలియన్ డాలర్లు అందించేందుకు ఐఎమ్ఎఫ్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ‘‘ఐఎమ్ఎఫ్కు పాక్పై నమ్మకం లేదు. ప్రస్తుతం పాక్ ఐఎమ్ఎఫ్ చేతిలో బందీగా ఉంది. అది మా దేశాన్ని వలస దేశంగా చూస్తోంది. పాక్ ఈ పరిస్థితి నుంచి బయటపడలేని స్థితిలో ఉంది. ఐఎమ్ఎఫ్తో గత ప్రధాని ఇమ్రాన్ఖాన్ చేసుకున్న ఒప్పందాల కారణంగా ఒక బిలియన్ డాలర్ల అప్పు కోసం పాక్ ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తింది’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ను ఈ స్థితికి దిగజార్చిన ఇమ్రాన్ఖాన్ను అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రధానిగా ఉన్నప్పుడు బహూకరించిన బహుమతులను ఇమ్రాన్ అమ్ముకోవడాన్ని కూడా ఆమె తప్పుబట్టారు. ‘‘అరెస్టుకు భయపడి ఆయన పార్టీ కార్యకర్తల వెనక దాక్కుంటున్నారు. మరోసారి ప్రధాని కావాలని ఇమ్రాన్ కలలు కంటున్నారు. ప్రజలకు ఏం చేశారని మరోసారి ఆయన్ను గెలిపిస్తారు. ఇమ్రాన్కు కొందరు ఆర్మీ జనరల్స్, న్యాయమూర్తులు అండగా ఉన్నారు. వారి సాయంతో ఆయన మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు’’ అని మరియమ్ ఆరోపించారు.
2019లో ఇమ్రాన్ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఐఎమ్ఎఫ్ నుంచి ఆరు మిలియన్ డాలర్ల సాయం పొందేందుకు ఒప్పదం చేసుకుంది. గతేడాది ఈ మొత్తాన్ని ఏడు బిలియన్ డాలర్లకు పెంచారు. మరోవైపు ఐఎమ్ఎఫ్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీని అందుకోవడానికి ఆ సంస్థ చెప్పిన షరతులన్నింటికీ పాక్ అంగీకరిస్తోంది. ఐఎంఎఫ్ను సంతృప్తి పరిచేందుకు ప్రజలపై పన్నుల భారం మోపేందుకూ సిద్ధమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.