క్యాన్సర్ చికిత్సకు డిస్ప్రిన్ వాడతారా..? ఐఎంఎఫ్ ఒప్పందం నేపథ్యంలో ఇమ్రాన్ ఫైర్
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో బెయిలవుట్ ప్యాకేజీలో భాగంగా ఐఎంఎఫ్(IMF) నుంచి తొలి విడత రుణసాయాన్ని విడుదల చేయించుకునే వ్యూహంతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తప్పుపట్టారు.
ఇస్లామాబాద్: విదేశీ మారక నిల్వలు క్షీణించి, దివాలా అంచున ఉంది పాకిస్థాన్(Pakistan). ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు రుణం కోసం తీవ్ర ఇక్కట్లు పడుతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీని అందుకోవడానికి చెప్పిన షరతులన్నింటికీ తలూపుతోంది. కాగా, ఈ ఐఎంఎఫ్ డీల్ను మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) తప్పుపట్టారు. ఇది క్యాన్సర్ చికిత్సకు డిస్ప్రిన్(ఆస్ప్రిన్ ) వాడినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ఒప్పందం వల్ల తాత్కాలిక ఉపశమనం ఉంటుందని, కానీ దీర్ఘకాలంలో రుణాల భారం పెరుగుతూనే ఉండటంతో దేశం పెను సంక్షోభంలోకి కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. టీవీ ప్రసంగంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
అలాగే ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తోన్న ఆర్థిక విధానాలను తప్పుపట్టారు. రాజకీయ రంగానికి ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తిని దూరం చేసేందుకు దేశాన్ని నాశనం చేయొద్దన్నారు. అలాగే తన దేశ ఆర్థిక పరిస్థితిపై గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ఫిచ్ ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ.. పాక్ పరిస్థితి మరింత దిగజారుతుందన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి సిద్ధంగా ఉందని ఫిచ్ పేర్కొంది. ఈ మేరకు పాక్(Pakistan) కరెన్సీకి ఇష్యూర్ డీఫాల్ట్ రేటింగ్ (ఐడీఆర్) CCC- ఇచ్చింది. గతంలో పాక్కు CCC+ రేటింగ్ ఉండేది.
బడ్జెట్ లోటును తగ్గించుకొని నికర పన్ను వసూళ్లను పెంచుకోవడమే లక్ష్యంగా పాకిస్థాన్ ప్రభుత్వం బుధవారం మినీ బడ్జెట్ను ఆవిష్కరించింది. దాంతో పెట్రోల్ ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో అక్కడి పెట్రోల్, గ్యాస్ ధరలు ఆల్టైమ్ గరిష్ఠానికి చేరాయి. బెయిలవుట్ ప్యాకేజీలో భాగంగా ఐఎంఎఫ్ నుంచి తొలి విడత రుణసాయాన్ని విడుదల చేయించుకునే వ్యూహంతోనే ధరల్ని అమాంతం పెంచింది. తమ రుణ సాయం పొందాలంటే పెట్రోలియం ఉత్పత్తుల ధరల్ని పెంచాలని ఐఎంఎఫ్ షరతు విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.