Biden Vs Netanyahu: మా నిర్ణయాలు మేం తీసుకుంటాం.. అమెరికాకు స్పష్టం చేసిన ఇజ్రాయెల్
అమెరికా(America), ఇజ్రాయెల్ (Israel) మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. తాజా ఆందోళనలపై అమెరికా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఇజ్రాయెల్.. తమ దేశ విషయాలకు సంబంధించి సొంత నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
జెరూసలేం: ఇజ్రాయెల్ (Israel) ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu)కు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. న్యాయవ్యవస్థ(Judicial System)లో సంస్కరణల కోసం నెతన్యాహు ప్రతిపాదించిన కొత్త చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని తిప్పికొట్టారు. తమది సార్వభౌమత్వ దేశమని.. విదేశీ ఒత్తిడి ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేమని స్పష్టం చేస్తూ మిత్రదేశంపైనే ఘాటుగా స్పందించారు. ఇలా ఈ రెండు మిత్రదేశాల దేశాల మధ్య ఇటువంటి మాటల యుద్ధం అత్యంత అరుదనే చెప్పవచ్చు.
ఇజ్రాయెల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇజ్రాయెల్ ప్రజాస్వామ్యస్థితిపై చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ‘ఇజ్రాయెల్కు మద్దతుదారుల మాదిరిగానే నేను కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నా. ఈ పరిస్థితులను చక్కదిద్దాలి. వాస్తవికత ఆధారంగా పరిస్థితులు చక్కదిద్దేందుకు ప్రధానమంత్రి రాజీకి వస్తారని ఆశిస్తున్నా. కానీ, ఏం జరుగుతుందో చూడాలి’ అని ఇజ్రాయెల్ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. అయితే, ఇజ్రాయెల్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని అమెరికా చూస్తుందా..? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. అలాంటిదేమీ లేదన్నారు. అమెరికా స్థానం ఏంటో వారికి తెలుసని అన్నారు.
అయితే, తమ దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘాటుగా స్పందించారు. ‘ఇజ్రాయెల్ సార్వభౌమ దేశం. ప్రజల అభీష్టం మేరకు నిర్ణయాలు తీసుకుంటుంది. అంతేకానీ, మిత్రులతో సహా విదేశాల ఒత్తిడితో కాదు’ అని అమెరికాను ఉద్దేశిస్తూ బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే, న్యాయమూర్తుల నియామకాలపై ప్రభుత్వ నియంత్రణకు సంబంధించి నెతన్యాహు ప్రభుత్వం నూతన చట్టాన్ని ప్రతిపాదించింది. కోర్టులు తమ పరిధి దాటి వ్యవహరించకుండా అడ్డుకునేందుకే ఈ సంస్కరణలని పేర్కొంది. కానీ, దీనిని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ప్రస్తుతం అవినీతి ఆరోపణల కేసులో విచారణ ఎదుర్కొంటున్న నెతన్యాహు, తన స్వప్రయోజనాల కోసమే కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
చైనా యుద్ధ విమానాలు మరోసారి ఆస్ట్రేలియాను బెదిరించే ప్రయత్నం చేశాయి. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య వివాదం ముదిరింది. -
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
క్రెమ్లిన్లో నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడిగా పుతిన్ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. -
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
చైనాలోని ఓ ఆసుపత్రిలో దుండగుడు కత్తులతో జరిపిన దాడిలో పలువురు చనిపోయారు. 20 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. -
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
Rafah crossing: రఫాపై దాడి కొనసాగిస్తున్న ఇజ్రాయెల్.. ఇక్కడి సరిహద్దు క్రాసింగ్ను తన ఆధీనంలోకి తీసుకుంది. -
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
India-Maldives: భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశాన్ని సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. -
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా వేగానికి చెక్ రిపబ్లిక్ కోర్టు బ్రేకులు వేసింది. -
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
Sunita Williams: సునీతా విలియమ్స్ చేపట్టాల్సిన మూడో రోదసి యాత్ర వాయిదా పడింది. రాకెట్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మిషన్ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. -
నేడు రోదసిలోకి సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. -
అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైన రష్యా
ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. -
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం
ఇజ్రాయెల్ ఒత్తిడి పనిచేసింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలగిన హమాస్.. రఫాపై దాడి ఖాయమని టెల్ అవీవ్ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది. -
ట్రంప్నకు వెయ్యి డాలర్ల జరిమానా
హష్ మనీ కేసులో అనవసర వ్యాఖ్యలు చేయకుండా జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకుగాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కోర్టు మరోసారి కొరడా ఝుళిపించింది. -
రష్యా నుంచి రాయబారిని వెనక్కు పిలిచిన జర్మనీ
రష్యాలోని తమ రాయబారి అలెగ్జాండర్ లాంబ్సడార్ఫ్ను వారం రోజలు పాటు వెనక్కు పిలిపించినట్లు జర్మనీ సోమవారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తివంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు