మహిళా ప్రధానుల భేటీపై జర్నలిస్టు అత్యుత్సాహం.. ఘాటుగా జవాబు..!
ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ న్యూజిలాండ్ పర్యటనకు వచ్చారు. ఇందులో భాగంగా ఆక్లాండ్లో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్, ఫిన్లాండ్ దేశాల ప్రధానమంత్రులు జెసిండా ఆర్డెన్, సనా మారిన్ తొలిసారిగా ద్వైపాక్షిక భేటీలో పాల్గొన్నారు. ఇద్దరు మహిళా ప్రధానులు ఇలా భేటీ అవడం ఆసక్తిగా మారింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ జర్నలిస్టు అత్యుత్సాహం ప్రదర్శించగా.. ఇరు దేశాధినేతలు ఘాటుగా బదులిచ్చారు. అసలేం జరిగిందంటే..
ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ న్యూజిలాండ్ పర్యటనకు వచ్చారు. ఇందులో భాగంగా ఆక్లాండ్లో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం వీరిద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ వారిని విచిత్రమైన ప్రశ్న అడిగారు. ‘‘మీ భేటీపై చాలా మంది ఆశ్చర్యంగా ఉన్నారు. దాదాపు ఒకే వయసు వారు.. ఒకే అభిరుచులు ఉన్న రాజకీయవేత్తలు అయినందున మీరు సమావేశమయ్యారా? లేదా ఈ భేటీతో ఇరు దేశాల మధ్య మరిన్ని ఒప్పందాలు జరిగాయని కివిస్ ప్రజలు అంచనా వేయొచ్చా?’’ అని ఆ విలేకరి ప్రశ్నించారు.
దీంతో జెసిండా ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. ‘‘మీరు ఇదే ప్రశ్న బరాక్ ఒబామా(అమెరికా మాజీ అధ్యక్షుడు), జాన్ కీ(న్యూజిలాండ్ మాజీ ప్రధాని)ని అడగ్గలరా? ఒకే వయసు వారు అవడం వల్లే మీరు భేటీ అయ్యారా? అని వారిని ప్రశ్నించగలరా? రాజకీయాల్లో పురుషులే ఎక్కువగా ఉన్నారన్నది వాస్తవమే. కానీ ఇద్దరు మహిళలు సమావేశం అయినప్పుడు.. అది కేవలం మహిళలైనందు వల్లే జరిగిన భేటీ కాదు’’ అని జెసిండా ఘాటుగా బదులిచ్చారు. ఆ తర్వాత సనా మారిన్ మాట్లాడుతూ.. ‘‘మేం ఇద్దరం రెండు దేశాలకు ప్రధానమంత్రులం. అందుకే సమావేశమయ్యాం’’ అని చెప్పారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. జర్నలిస్టుకు సరైన సమాధానమిచ్చారంటూ పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు న్యూజిలాండ్ మాజీ ప్రధాని జాన్ కీ ఆయనతో పలుమార్లు భేటీ అయ్యారు.
జెసిండా 2017లో న్యూజిలాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా.. సనా 2019లో ఫిన్లాండ్ పీఎంగా ఎన్నికయ్యారు. ఐరాస గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం 13 దేశాలకు మహిళలు దేశాధినేతలుగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.