Biden- Modi: మోదీని ఆటోగ్రాఫ్ అడిగిన బైడెన్..!
Biden- Modi: జీ7 సదస్సు సందర్భంగా బైడెన్, మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీకి ఉన్న పాపులారిటీ గురించి చెబుతూ.. ‘‘బహుశా నేను మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలి’’ అని బైడెన్ సరదాగా వ్యాఖ్యానించారట!
హిరోషిమా: మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi)కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. ఈ విషయం అనేక సర్వేల్లో తేటతెల్లమైంది. ఆయన ఏ దేశానికి వెళ్లినా అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చి దారి పొడవునా స్వాగతం పలికిన సందర్భాలను చూశాం. తాజాగా మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకొంది. స్వయంగా అగ్రరాజ్యాధిపతి జో బైడెన్ (Biden).. మన ప్రధానిని ఆటోగ్రాఫ్ అడిగారట!
ప్రస్తుతం జీ7 శిఖరాగ్ర (G7 Summit) సమావేశాల్లో పాల్గొనేందుకు మోదీ హిరోషిమా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడికొచ్చిన వివిధ దేశాధినేతలతో ఆయన కాసేపు వ్యక్తిగతంగా మాట్లాడారు. ఈ సందర్భంగా జో బైడెన్ (Biden) తాను ఎదుర్కొంటున్న ఓ సవాల్ను మోదీ ముందుంచారట! వచ్చే నెల బైడెన్ ఆహ్వానం మేరకు మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అయితే, మోదీతో సమావేశంతో పాటు ఆయన పాల్గొనే కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నారని బైడెన్ మన ప్రధాని దృష్టికి తీసుకొచ్చారని వారి సంభాషణను విన్న విశ్వసనీయ వర్గాలు మీడియాతో పంచుకున్నాయి. తనకు అనేక వర్గాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని మోదీ (Modi)కి బైడెన్ తెలియజేశారట. తానెప్పుడూ కలవని.. పరిచయం లేని వారు సైతం ఫోన్లు చేసి మోదీతో కలిసే అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారని సమాచారం.
ఇంతలోనే అక్కడికొచ్చిన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్ (Anthony Albanese).. తాను కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొంటున్నానని చెప్పారని తెలిసింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రధాని మోదీ ఓ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. అయితే, ఈ సమావేశంలో పాల్గొనేందుకు తమకు అవకాశం కల్పించాలని అనేక మంది తనకు వ్యక్తిగతంగా సందేశాలు పంపుతున్నారని మోదీతో ఆల్బనీస్ అన్నారట. అయితే, మోదీ (Modi) పాల్గొనబోయే వేదిక 20,000 మందికి మాత్రమే ఆతిథ్యం ఇవ్వగలదని.. ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడయ్యాయని చెప్పినట్లు సమాచారం. అయినా, ఇంకా టికెట్ల కోసం విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయని తెలిపారని వారి సంభాషణను విన్నవారు తెలిపారు.
ఇంతలోనే మళ్లీ బైడెన్ (Biden) కలగజేసుకుంటూ.. ‘‘మీరు (మోదీ) నిజంగా నాకు చాలా పెద్ద సమస్యను సృష్టించారు’’ అని సరదాగా వ్యాఖ్యానించారట! ‘‘నేను ఆటపట్టించడానికి అనడం లేదు. కావాలంటే మా అధికార బృందాన్ని అడగండి’’ అని కూడా బైడెన్ అన్నట్లు ఈ సంభాషణను విన్న వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ‘నేను మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలి’ అని నవ్వులు చిందిస్తూ మోదీతో బైడెన్ అన్నారట!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM