Nobel Prize 2022: ‘పౌర హక్కుల పరిరక్షణ’కు.. నోబెల్ శాంతి పురస్కారం!
ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి.. పౌర హక్కుల కోసం కృషి చేస్తోన్న బెలారస్కు చెందిన మానవ హక్కుల న్యాయవాది అలెస్ బియాలియాత్స్కీతో పాటు రష్యా, ఉక్రెయిన్లకు చెందిన మానవ హక్కుల సంస్థలు ‘మెమోరియల్’, ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’కు దక్కింది.
ఓస్లో: ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి(Nobel Peace Prize).. పౌర హక్కుల(Human Rights) కోసం కృషి చేస్తోన్న ఓ వ్యక్తితో పాటు రెండు సంస్థలకు వరించింది. బెలారస్(Belarus)కు చెందిన మానవ హక్కుల న్యాయవాది అలెస్ బియాలియాత్స్కీ(Ales Bialiatski)తో పాటు రష్యా, ఉక్రెయిన్లకు చెందిన మానవ హక్కుల సంస్థలు ‘మెమోరియల్’, ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’కు సంయుక్తంగా ఈ పురస్కారం అందజేస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది.
‘పురస్కార గ్రహీతలు.. వారివారి దేశాల్లో పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార పక్షాన్ని విమర్శించే హక్కుతోపాటు పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఏళ్లుగా పోరాడుతున్నారు. హక్కుల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగం, యుద్ధ నేరాల నమోదులో అద్భుత పనితీరు కనబర్చారు. శాంతి, ప్రజాస్వామ్యాలతో కూడిన పౌర సమాజ ప్రాధాన్యాన్ని వారు చాటుతున్నారు’ అని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది. గతేడాది ఈ పురస్కారం.. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం కృషికి చేసిన జర్నలిస్టులు మరియా రెసా(ఫిలప్పీన్స్), దిమిత్రి మురాతోవ్(రష్యా)లకు దక్కిన విషయం తెలిసిందే.
బెలారస్కు చెందిన అలెస్ బియాలియాత్స్కీ 1980ల్లో దేశంలో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ప్రారంభించిన వారిలో ఒకరు. ప్రజాస్వామ్యం, శాంతియుత అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారు. 2021 జులై నుంచి జైల్లో ఉన్నారు. మానవ హక్కుల సంస్థ ‘మెమోరియల్’.. రష్యాలో రాజకీయ అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘనలపై సమాచారాన్ని క్రమబద్ధంగా నమోదు చేసింది. కీవ్లోని ‘సివిల్ లిబర్టీస్ సెంటర్’.. ఉక్రెయిన్లో మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తోంది. పౌర సమాజాన్ని బలోపేతం చేయడంతోపాటు, ఉక్రెయిన్ను పూర్తిస్థాయి ప్రజాస్వామ్య దేశంగా మార్చేందుకు పోరాటం చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం