Rishi Sunak: బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవ ఎన్నిక
లిజ్ ట్రస్ రాజీనామాతో టోరీ సభ్యులు తదుపరి ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారోనన్న ఉత్కంఠకు తెరపడింది. కన్జర్వేటివ్ పార్టీ నేతగా, బ్రిటన్ ప్రధానిగా, భారత సంతతికి చెందిన రిషి సునాక్(Rishi Sunak) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
లండన్: లిజ్ ట్రస్ రాజీనామాతో టోరీ సభ్యులు తదుపరి ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారోనన్న ఉత్కంఠకు తెరపడింది. కన్జర్వేటివ్ పార్టీ నేతగా, బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్(Rishi Sunak) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలుత బోరిస్ జాన్సన్, ఆ తర్వాత పెనీ మోర్డౌంట్ సైతం పోటీ నుంచి వైదొలగడంతో రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికై బ్రిటన్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. ఇటీవల లిజ్ ట్రస్(Liz truss) రాజీనామాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో టోరీ సభ్యులు ఈసారి రిషి వైపే మొగ్గు చూపారు. ఆయనే తమ దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించగలరని విశ్వసించారు. దీంతో బ్రిటన్ పగ్గాలు చేపట్టే అరుదైన అవకాశం రిషి సునాక్ను వరించింది. నెలన్నర రోజుల క్రితం లిజ్ట్రస్ చేతిలో ఓటమిపాలైన అదే సునాక్.. నేడు దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. బ్రిటన్ పాలనా పగ్గాలు అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా, మొత్తం 357 మంది టోరీ ఎంపీల్లో సగం మందికి పైగా మద్దతును పొందడం ద్వారా బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడిగానూ రిషి సునాక్ (42) అరుదైన రికార్డు సొంతంచేసుకోవడం విశేషం.
బోరిస్ జాన్సన్ అనూహ్య నిర్ణయంతో..
కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా తనకు చట్టసభ సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ రిషి సునాక్ (Rishi Sunak) కంటే వెనకబడి ఉన్నానని.. ఇటువంటి సమయంలో పోటీ నుంచి వైదొలగడమే మేలని మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ భావించారు. అంతేకాకుండా బరిలోంచి వైదొలుగుతున్నట్టు ఆయన అనూహ్యంగా ప్రకటించారు. కీలక నేతగా ఉన్న బోరిస్ పోటీ నుంచి వైదొలగడం, మరో నాయకురాలు పెనీ మోర్డౌంట్కు అంతంత మాత్రమే మద్దతు ఉండటంతో బ్రిటన్ తదుపరి ప్రధానిగా రిషి సునాక్ విజయం దాదాపు ఖాయమైనట్టేనంటూ ఈ మధ్యాహ్నం నుంచే వార్తలు వెలువడ్డాయి. చివరకు ప్రధాని రేసు నుంచి పెనీ మోర్డౌంట్ సైతం వైదొలగడంతో రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు.
సామాన్యుడిగా మొదలై ప్రధాని స్థాయికి..
సామాన్యుడిగా మొదలైన రిషి సునాక్ తన కృషి, పట్టుదలతో బ్రిటన్ ప్రధాని స్థాయికి ఎదిగారు. కన్జర్వేటివ్ పార్టీలో కొత్త తరం నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన బ్రిటన్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి చరిత్ర సృష్టించారు. బ్రిటన్ సంక్షోభం వేళ ఆర్థిక మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంగ్లాండ్లోని సౌథాంప్టన్ నగరంలో రిషి జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఉష, యశ్వీర్. భారత్లోని పంజాబ్లో రిషి సునాక్ తల్లిదండ్రుల మూలాలు ఉన్నాయి. వారు టాంజానియా, కెన్యా నుంచి బ్రిటన్కు వలస వచ్చారు. సునాక్ తండ్రి యశ్వీర్ వైద్యులు కాగా.. తల్లి మెడికల్ షాప్ నిర్వహించేవారు. ఆర్థిక రంగాన్ని తన కెరియర్గా ఎంచుకున్న ఆయన.. ఆక్స్ఫర్డ్లో ఫిలాసఫీ, ఎకనామిక్స్ అభ్యసించారు.
బెంగళూరులోనే రిషి వివాహం
రిషి సునాక్ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తికి స్వయానా అల్లుడు. స్టాన్ఫర్డ్లో నారాయణమూర్తి, సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షితామూర్తితో ఆయనకు పరిచయం ఏర్పడగా.. 2009లో బెంగళూరులో రిషి, అక్షితల వివాహం జరిగింది. రిషి సునాక్, అక్షితామూర్తి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. తొలిసారి రిచ్మండ్ నుంచి 2015లో ఎంపీగా ఎన్నికైన ఆయన.. 2017, 2019లలోనూ తిరిగి ఎన్నికయ్యారు. 2020 ఫిబ్రవరిలో బోరిస్ జాన్సన్ కేబినెట్లో ఆర్థికమంత్రిగా నియమితులై.. ఈ ఏడాది జులై వరకు కొనసాగిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
చైనా యుద్ధ విమానాలు మరోసారి ఆస్ట్రేలియాను బెదిరించే ప్రయత్నం చేశాయి. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య వివాదం ముదిరింది. -
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
క్రెమ్లిన్లో నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడిగా పుతిన్ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. -
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
చైనాలోని ఓ ఆసుపత్రిలో దుండగుడు కత్తులతో జరిపిన దాడిలో పలువురు చనిపోయారు. 20 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. -
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
Rafah crossing: రఫాపై దాడి కొనసాగిస్తున్న ఇజ్రాయెల్.. ఇక్కడి సరిహద్దు క్రాసింగ్ను తన ఆధీనంలోకి తీసుకుంది. -
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
India-Maldives: భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశాన్ని సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. -
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా వేగానికి చెక్ రిపబ్లిక్ కోర్టు బ్రేకులు వేసింది. -
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
Sunita Williams: సునీతా విలియమ్స్ చేపట్టాల్సిన మూడో రోదసి యాత్ర వాయిదా పడింది. రాకెట్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మిషన్ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. -
నేడు రోదసిలోకి సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. -
అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైన రష్యా
ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. -
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం
ఇజ్రాయెల్ ఒత్తిడి పనిచేసింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలగిన హమాస్.. రఫాపై దాడి ఖాయమని టెల్ అవీవ్ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది. -
ట్రంప్నకు వెయ్యి డాలర్ల జరిమానా
హష్ మనీ కేసులో అనవసర వ్యాఖ్యలు చేయకుండా జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకుగాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కోర్టు మరోసారి కొరడా ఝుళిపించింది. -
రష్యా నుంచి రాయబారిని వెనక్కు పిలిచిన జర్మనీ
రష్యాలోని తమ రాయబారి అలెగ్జాండర్ లాంబ్సడార్ఫ్ను వారం రోజలు పాటు వెనక్కు పిలిపించినట్లు జర్మనీ సోమవారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!