Rishi Sunak: రిషి సునాక్ కీలక నిర్ణయం.. ఉప ప్రధానిగా డొమినిక్ రాబ్.. పలువురికి ఉద్వాసన!
బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే రిషి సునాక్ తన పనిని ప్రారంభించారు. లిజ్ ట్రస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పలువురిని తమ పదవులకు రాజీనామా చేయాలని సూచించారు.
లండన్: బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే రిషి సునాక్ తన పనిని మొదలుపెట్టారు. బ్రిటన్ను ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే దిశగా కసరత్తులో భాగంగా సాయంత్రానికే తన టీమ్ని ప్రకటించే పనిని షురూ చేశారు. బ్రిటన్ ఉప ప్రధానిగా డొమినిక్ రాబ్ని నియమించిన రిషి.. ప్రస్తుత ఆర్థికమంత్రిగా ఉన్న జెరిమీ హంట్ను అదే పదవిలో కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, జేమ్స్ క్లెవర్లీని విదేశాంగ శాఖ కార్యదర్శిగా, బెన్ వాల్సేని డిఫెన్స్ సెక్రటరీగా నియమించారు. పార్లమెంటరీ సెక్రటరీ (చీఫ్ విప్)గా సైమన్ హార్ట్ని నియమించగా.. నదిమ్ జాహ్వికి మంత్రిగా అవకాశం కల్పించినప్పటికీ ఆయనకు ఏ శాఖను కేటాయించింది మాత్రం స్పష్టంచేయలేదు.
సుయెల్లా బ్రేవర్మెన్ రీ ఎంట్రీ
లిజ్ట్రస్ కేబినెట్లో హోం సెక్రటరీగా పనిచేసి ఇటీవల రాజీనామా చేసిన భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రెవర్మన్కు రిషి కేబినెట్లో చోటు దక్కింది. రిషి జట్టులో సైతం ఆమె హోం సెక్రటరీగానే బాధ్యతలు నిర్వహించనున్నారు. అలాగే, గ్రాంట్ శాప్స్ను ఎనర్జీ, ఇండస్ట్రియల్ స్ట్రాటజీ సెక్రటరీగా నియమించారు. రిషిపై పోటీ చేసి తగిన మద్దతు లేకపోవడంతో చివరికి బరిలోంచి వైదొలగిన పెనీ మార్డౌంట్ను సైతం రిషి తన జట్టులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు గిల్లియన్ కీగన్కు విద్యాశాఖ, మెల్ స్ట్రైడ్కు పనులు, పెన్షన్ల బాధ్యతలు అప్పగించారు.
మరోవైపు, లిజ్ ట్రస్ జట్టులో మంత్రులుగా ఉన్న పలువురిని తమ పదవులకు రాజీనామా చేయాలని రిషి కోరినట్టు సమాచారం. జాకబ్ రీస్- మాగ్, బ్రాండన్ లెవైస్, విక్కీ ఫోర్డ్ను తమ పదవుల నుంచి వైదొలగాలని సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. తన సొంత మంత్రివర్గాన్ని ప్రకటించడానికి వీలుగా వీరి నుంచి రాజీనామా కోరినట్టు తెలుస్తోంది. రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కాసేపటికే లిజ్ ట్రస్ ప్రభుత్వంలో ఉన్న పలువురు మంత్రులు తమ రాజీనామాలు సమర్పించడం గమనార్హం. ఈ జాబితాలో కిట్ మాల్తౌస్, రాబర్ట్ బక్ల్యాండ్, చ్లోల్ స్మిత్, రణిల్ జయవర్దనె వంటి వారు ఉన్నారు. మొదటి నుంచీ తనకు అండగా నిలిచిన వారికి రిషి తన మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434