Putin: లైవ్లో మరో ‘పుతిన్’.. రష్యా అధినేత షాక్..!
Putin: లైవ్లో అచ్చం తనలాగే ఉన్న వ్యక్తిని చూసి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అసలేం జరిగిందంటే..!
మాస్కో: రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin)కు ఓ అనూహ్య అనుభవం ఎదురైంది. మాస్కోలో వార్షిక విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన్ను.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), దాని వల్ల వచ్చే ప్రమాదాల గురించి ప్రశ్నించారు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? ఆ ప్రశ్న అడిగింది అచ్చం పుతిన్ వలే ఉన్న మరో వ్యక్తి. లైవ్లో తన ‘డబుల్’ను చూడగానే రష్యా అధ్యక్షుడు అవాక్కయ్యారు. ఇంతకీ అదెలా సాధ్యమనుకుంటున్నారా? అదంతా కృత్రిమ మేధ మాయేనండి..!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో అచ్చం పుతిన్ పోలిన ఓ కృత్రిమ వ్యక్తిని సృష్టించారు. ఆ ‘ఏఐ పుతిన్’ విలేకరుల సమావేశంలో రష్యా అధ్యక్షుడితో మాట్లాడారు. ‘‘నేను సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్శిటీ విద్యార్థిని. మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నా. మిమ్మల్ని పోలిన వ్యక్తులు చాలా మంది ఉన్నారన్నది నిజమేనా? ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో మన జీవితాలకు ఎలాంటి ముప్పు ఉందనుకుంటున్నారు?’’ అని ఆ పుతిన్ ‘డబుల్’ ప్రశ్నించారు.
మా లక్ష్యాలు నెరవేరేవరకు శాంతి లేదు.. ఉక్రెయిన్పై తేల్చిచెప్పిన పుతిన్
ఆ ఏఐ మాయను చూసి ఒకింత ఆశ్చర్యపోయిన పుతిన్.. కాసేపు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత రష్యా అధినేత మాట్లాడుతూ.. ‘‘నన్ను పోలిన తొలి వ్యక్తివి నువ్వే. నువ్వు నాలాగే ఉండొచ్చు. నాలాగే మాట్లాడొచ్చు. కానీ, అచ్చం నాలాగే ఉండే వ్యక్తి.. నాలాగే మాట్లాడే వ్యక్తి ఒకే ఒక్కరు ఉన్నారు. అది నేనే’’ అని అన్నారు. అయితే, అప్పటికే కొన్ని గంటల పాటు విలేకరుల సమావేశంలో ఉన్న పుతిన్.. ఈ ప్రశ్నతో ఒకింత అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
అచ్చం పుతిన్ను పోలిన వ్యక్తులు రష్యాలో చాలా మంది ఉన్నారని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. రష్యా అధ్యక్షుడి అనారోగ్యాన్ని దాచిపెట్టేందుకు.. చాలా బహిరంగ కార్యక్రమాల్లో ఆ నకిలీ పుతిన్లే పాల్గొంటారనే వదంతులున్నాయి. అయితే, వీటిని క్రెమ్లిన్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. ఇదిలా ఉండగా.. గత 24 ఏళ్లుగా రష్యాను పాలిస్తూ.. మరోమారు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఆయన వార్షిక విలేకరుల సమావేశాలు నిర్వహించి.. దాదాపు నాలుగు గంటల సేపు మాట్లాడారు. ఈ సారి పాత్రికేయులతో పాటు సాధారణ పౌరులూ తమ సమస్యలపై ఫోన్ ద్వారా అధ్యక్షుడిని ప్రశ్నించే అవకాశం కల్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ శాస్త్రవేత్త ఆందోళనకు దిగొచ్చిన చైనా సర్కారు
China: కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్త ఆందోళనకు చైనా దిగొచ్చింది. అతడిని తిరిగి ల్యాబ్లోకి అనుమతించింది. -
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
డాలస్ నుంచి టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. -
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10వేల కోట్లు
క్యాన్సర్తో బాధపడుతున్న ఓ వ్యక్తి జాక్పాట్ కొట్టేశాడు. లాటరీలో ఏకంగా రూ. 10 వేల కోట్లకు పైగా గెలుచుకున్నాడు. -
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా?
Pakistan: పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేయాలని అధికారులు నిర్ణయించారు. మరి ఈ నిర్ణయం వెనుక కారణం ఏంటంటే..? -
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి
బీజింగ్: దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో బుధవారం ఓ హైవే రోడ్డులో కొంత భాగం కుప్పకూలిపోవడంతో19 మంది మృతి చెందారు. -
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
గురుపత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర కేసుపై వచ్చిన మీడియా కథనంపై వ్యాఖ్యానించేందుకు అమెరికా విదేశాంగశాఖ అధికారి నిరాకరించారు. ఈ అంశంతో తాము న్యూదిల్లీతో టచ్లోనే ఉన్నామన్నారు. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
ఉక్రెయిన్ తీరప్రాంత నగరమైన ఒడెస్సాలోని హ్యారిపోటర్ కోట(Harry Potter Castle)గా పేరున్న భవనాన్ని రష్యా క్షిపణి ధ్వంసం చేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. కస్టడీలోకి కొలంబియా వర్సిటీ నిరసనకారులు
Columbia University: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా విద్యార్థులు చేస్తున్న నిరసనలను పోలీసులు క్రమంగా అదుపులోకి తీసుకొస్తున్నారు. తాజాగా కొలంబియా వర్సిటీలో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మాటలకందని విషాదమే.. రఫాలో ఇజ్రాయెల్ దాడులపై ఐరాస ఆందోళన
Israel: రఫాపై దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న వేళ దాని పరిణామాలపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాగైనా దీన్ని ఆపేందుకు కృషి చేయాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. -
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు
చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ట్రంప్.. 9వేల డాలర్ల జరిమానా
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాగ్ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్ కోర్టు జడ్జి మంగళవారం నిర్ధారించారు. -
భార్య దారుణహత్య.. భారతీయుడికి జీవితఖైదు
భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
భారత్ సూపర్ పవర్ కలలు కంటుంటే.. మనం అడుక్కుంటున్నాం
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
లండన్లో కత్తితో దాడి
తూర్పు లండన్లో మంగళవారం ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. హైనాల్ట్ ప్రాంతంలో వాహనంలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన అనంతరం దాడికి దిగాడు. -
‘ఇజ్రాయెల్’ కేసులో జర్మనీకి ఊరట
గాజాలో పాలస్తీనియన్లపై నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న జర్మనీని నిరోధించాలని కోరుతూ నికరాగువా దేశం చేసిన విజ్ఞప్తిని మంగళవారం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తిరస్కరించింది. -
కొవిషీల్డ్తో కొన్ని దుష్పరిణామాలు నిజమే
కొవిడ్ టీకా కొవిషీల్డ్తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా అంగీకరించింది. -
కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తతలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పరిస్థితులు మంగళవారం ఉద్రిక్తంగా మారాయి. -
హమాస్ నాశనమే మా లక్ష్యం: ఇజ్రాయెల్
కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో కీలక చర్చలు ప్రారంభమవుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల మోత
కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. నార్త్ కరోలినాలోని షార్లెట్లో వారెంటు అందించేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. -
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా (China).. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) అంగీకరించింది.
తాజా వార్తలు (Latest News)
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్
-
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి