Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు ఊహించని అనుభవం!
బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్కు వింత అనుభవం ఎదురైంది. ఆస్పత్రిలో ఎలా చూసుకుంటున్నారు? అని మహిళా రోగిని అడగ్గా.. అంతాబాగానే ఉంది కానీ, మీరు వాళ్లకిచ్చే జీతాలను చూస్తేనే జాలేస్తోంది అంటూ ఆమె సమాధానమిచ్చింది.
లండన్: బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్కు వింత అనుభవం ఎదురైంది. రోగులను పరామర్శించేందుకు ఆయన సౌత్ లండన్లోని క్రొయిడన్ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి సిబ్బంది బాగా చూసుకుంటున్నారా? అని అక్కడి ఓ మహిళా రోగిని అడగ్గా.. ‘‘చాలా బాగా చూసుకుంటున్నారు. కానీ, మీరు వాళ్లకిచ్చే జీతాలను చూస్తేనే జాలేస్తోంది’’ అని ఆమె సమాధానం ఇచ్చారు. నేషనల్ హెల్త్ సర్వీసును మరింత బలోపేతం చేయాలని, నర్సుల జీతాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తోందని సునాక్ చెప్పేలోపే.. ఆమె మళ్లీ మాట అందుకొని.. మీరు మామూలుగా ప్రయత్నించడం కాదు..మరింత తీవ్రంగా ప్రయత్నించాల్సిన అవసరముందని అన్నారు. దీంతో ఒకింత ఆశ్చర్యానికి గురైన రిషి సునాక్ ‘‘ మీ మాటలను కచ్చితంగా పరిణగణలోకి తీసుకుంటాను. ఇక్కడ చాలా మంచి సిబ్బంది ఉన్నారు’’ అని సమాధానమిచ్చారు.
తమ జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఇటీవల దాదాపు 3 లక్షల మంది నర్సింగ్ సిబ్బంది సమ్మెకు దిగాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఓటింగ్ కూడా నిర్వహించారు. దాదాపు 106 ఏళ్ల చరిత్రలో ఇలా ఓటింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు వేతనాల్లో పెరుగుదల లేదని, మరోవైపు, ద్రవ్యోల్బణంలో సరకుల ధరలు పెరిగిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చిందని రాయల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెల్లడించింది. ఎన్హెచ్ఎస్ కింద 1948 నుంచి బ్రిటన్లో ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రభుత్వసేవలకు కేటాయించిన మొత్తంలో మూడింట ఒకవంతు వ్యయాన్ని బ్రిటన్ ఆరోగ్యసేవల కోసమే కేటాయిస్తోంది. అయితే, కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రోగుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో రోగులకు మునుపటిలా వైద్యసేవలు అందడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ