Donald Trump: టీవీ కెమెరాలకు నో.. రహస్యంగానే ట్రంప్ విచారణ
ఓ శృంగార తార నోటికి తాళం వేయడానికి ఆమెకు డబ్బు ముట్టజెప్పిన అభియోగాలపై మాజీ అధ్యక్షుడు ట్రంప్ (Dobald Trump) కోర్టు ఎదుట సమాధానమివ్వనున్నారు. అయితే ఈ విచారణను ప్రసారం చేసేందుకు మీడియాకు కోర్టు అనుమితినివ్వలేదు.
న్యూయార్క్: పోర్న్ స్టార్కు చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరికొద్ది గంటల్లో కోర్టు ముందు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే కోర్టులో ట్రంప్ను రహస్యంగా విచారించనున్నట్లు న్యూయార్క్ సుప్రీంకోర్టు జడ్జి జుయాన్ మెర్చన్ వెల్లడించారు. మీడియా అవుట్లెట్లు, టీవీ కెమెరాలను కోర్టు లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు.
ఓ శృంగార తార నోటికి తాళం వేయడానికి ఆమెకు డబ్బు ముట్టజెప్పిన కేసులో ట్రంప్ (Donald Trump)పై క్రిమినల్ అభియోగం (Indictment) మోపాలని గత గురువారం మన్హటన్ గ్రాండ్ జ్యూరీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణకు ట్రంప్ మంగళవారం కోర్టులో తన వాదనను వినిపించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ట్రంప్ న్యూయార్క్ చేరుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన న్యూయార్క్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మెర్చన్ ఎదుట హాజరై (Trump's arraignment ) క్రిమినల్ విచారణను ఎదుర్కోనున్నారు. ఈ విచారణను ప్రసారం చేసేందుకు అనుమతినివ్వాలంటూ పలు అమెరికా మీడియా సంస్థలు కోర్టును అభ్యర్థించగా.. న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. అయితే, విచారణ ప్రారంభం కావడానికి ముందు కోర్టు గది, ట్రంప్ ఫొటోలను తీసుకునేందుకు ఐదుగురు స్టిల్ ఫొటోగ్రాఫర్లకు మాత్రం అనుమతినిచ్చింది. విచారణ సమయంలో మాత్రం మీడియా కెమెరాలకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. (Donald Trump Indictment)
ట్రంప్ ప్రస్తుతం మన్హటన్లోని ‘ట్రంప్ టవర్’లో ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా కోర్టుకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే రిపబ్లికన్లు ఆందోళన చేపట్టే అవకాశం ఉండటంతో మన్హటన్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ట్రంప్ కోర్టుకు హాజరైన సమయంలో.. నిబంధనల ప్రకారం ఆయన ఫొటోలు, వేలిముద్రలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి విచారణల్లో నిందితులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొస్తారు. అయితే ట్రంప్ విషయంలో కొన్ని మినహాయింపులు ఇవ్వనున్నట్లు సమాచారం. విచారణ సమయంలో ఆయన వెంట సీక్రెట్ సర్వీసు ఏజెంట్లను కూడా అనుమతించనున్నట్లు తెలుస్తోంది.
2006లో ట్రంప్, తానూ ఓ కార్యక్రమంలో కలుసుకున్నామనీ, తరవాత హోటల్లో శృంగారంలో పాల్గొన్నామని స్టార్మీ డేనియల్స్ అనే శృంగార చిత్రాల నటి ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని గుట్టుగా ఉంచాలంటూ ట్రంప్ న్యాయవాది మైకేల్ కోహెన్ 2016 అధ్యక్ష ఎన్నికలకు నెలరోజుల ముందు డేనియల్స్కు డబ్బు ముట్టజెప్పారన్నది ఆరోపణ. ఇది నిజమేనని కోహెన్ ఒప్పుకున్నారు. దీంతో ఈ కేసులో ట్రంప్పై క్రిమినల్ అభియోగం మోపాలని గ్రాండ్ జ్యూరీ నిర్ణయించింది. ఆయనపై చేసిన ఆరోపణలను సీల్డు కవరులో ఉంచారు. అందులో ట్రంప్పై 30 ఆరోపణలు ఉన్నట్లు సీఎన్ఎన్ వార్తా సంస్థ కథనం పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక