One Word Trend: ట్విటర్లో ‘వన్ వర్డ్’ ట్రెండ్.. ఎలా మొదలైందంటే!
ట్విటర్లో తాజాగా వన్ వర్డ్ (ఒకే పదం)(One Word) ట్రెండ్ నడుస్తోంది. అంటే.. ఎవరైనా యూజర్ కేవలం ఒకే పదాన్ని ట్వీట్ చేయడం అన్నమాట. ప్రముఖ క్రికెటర్ సచిన్ తెందూల్కర్(Sachin Tendulkar) సైతం ఇందులో చేరిపోయారు...
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్(Twitter)’లో ఎప్పుడూ ఏదో ఒక అంశం ట్రెండింగ్(Trending)లో ఉంటుంది. సాధారణ నెటిజన్ల మొదలు ప్రముఖ సంస్థలు, సెలెబ్రిటీల వరకు ఇందులో భాగమవుతారు! ఈ క్రమంలోనే ట్విటర్లో తాజాగా వన్ వర్డ్(One Word) ట్రెండ్ నడుస్తోంది. అంటే.. ఎవరైనా యూజర్ కేవలం ఒకే పదాన్ని ట్వీట్ చేయడం అన్నమాట. ప్రముఖ క్రికెటర్ సచిన్ తెందూల్కర్(Sachin Tendulkar) సైతం ఇందులో చేరిపోయారు. శుక్రవారం ఆయన ‘క్రికెట్(Cricket)’ అనే పదాన్ని పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం ‘డెమోక్రసీ(ప్రజాస్వామ్యం)(Democracy)’ అనే పదాన్ని ట్వీట్ చేశారు.
అసలు ఎలా మొదలైంది..
అమెరికాలోని రైలు సేవల సంస్థ ‘ఆమ్ట్రాక్(Amtrak)’ సోషల్ మీడియా టీం.. తమ ట్విటర్ హ్యాండిల్లో గురువారం ‘ట్రైన్స్(Trains)’ అని ఒక పదాన్ని పోస్ట్ చేసింది. ఇది కాస్త నెట్టింట వైరల్గా మారింది. ఇక్కడినుంచే వన్ వర్డ్ ట్రెండింగ్(One Word Trending) మొదలైనట్లు నెటిజన్లు భావిస్తున్నారు. ఈ ట్వీట్కు ఇప్పటివరకు లక్షన్నరకుపైగా లైక్స్ రావడం గమనార్హం. క్రమంగా ప్రముఖ సంస్థలతోపాటు వ్యక్తులూ ఈ ట్రెండింగ్లో భాగస్వాములవుతున్నారు.
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా(NASA).. ‘యూనివర్స్(Universe)’ అని ట్వీట్ చేసింది. వాషింగ్టన్ పోస్ట్.. ‘న్యూస్(News)’ అని పోస్ట్ చేసింది. అయితే.. ‘ట్రైన్స్’ అనే ట్వీట్ను ఆమ్ట్రాక్ సోషల్ మీడియా టీమ్లోని ఓ ఇంటర్న్ చేసిన పొరపాటుగా చాలా మంది భావిస్తున్నారు. మరికొందరు మాత్రం.. సోషల్ మీడియా యూజర్ల దృష్టిని ఆకట్టుకునేందుకు ఉద్దేశపూర్వకంగా అమలు చేసిన వ్యూహమని నమ్ముతున్నారు. ఏదేమైనా.. ప్రస్తుతం ట్విటర్లో నయా ట్రెండింగ్ హవా సాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు