One Word Trend: ట్విటర్‌లో ‘వన్‌ వర్డ్‌’ ట్రెండ్‌.. ఎలా మొదలైందంటే!

ట్విటర్‌లో తాజాగా వన్‌ వర్డ్‌ (ఒకే పదం)(One Word) ట్రెండ్‌ నడుస్తోంది. అంటే.. ఎవరైనా యూజర్‌ కేవలం ఒకే పదాన్ని ట్వీట్‌ చేయడం అన్నమాట. ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌(Sachin Tendulkar) సైతం ఇందులో చేరిపోయారు...

Published : 03 Sep 2022 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్(Twitter)‌’లో ఎప్పుడూ ఏదో ఒక అంశం ట్రెండింగ్‌(Trending)లో ఉంటుంది. సాధారణ నెటిజన్ల మొదలు ప్రముఖ సంస్థలు, సెలెబ్రిటీల వరకు ఇందులో భాగమవుతారు! ఈ క్రమంలోనే ట్విటర్‌లో తాజాగా వన్‌ వర్డ్‌(One Word) ట్రెండ్‌ నడుస్తోంది. అంటే.. ఎవరైనా యూజర్‌ కేవలం ఒకే పదాన్ని ట్వీట్‌ చేయడం అన్నమాట. ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌(Sachin Tendulkar) సైతం ఇందులో చేరిపోయారు. శుక్రవారం ఆయన ‘క్రికెట్‌(Cricket)’ అనే పదాన్ని పోస్ట్‌ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సైతం ‘డెమోక్రసీ(ప్రజాస్వామ్యం)(Democracy)’ అనే పదాన్ని ట్వీట్‌ చేశారు.

అసలు ఎలా మొదలైంది..

అమెరికాలోని రైలు సేవల సంస్థ ‘ఆమ్‌ట్రాక్(Amtrak)‌’ సోషల్‌ మీడియా టీం.. తమ ట్విటర్‌ హ్యాండిల్‌లో గురువారం ‘ట్రైన్స్(Trains)‌’ అని ఒక పదాన్ని పోస్ట్‌ చేసింది. ఇది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక్కడినుంచే వన్‌ వర్డ్‌ ట్రెండింగ్‌(One Word Trending) మొదలైనట్లు నెటిజన్లు భావిస్తున్నారు. ఈ ట్వీట్‌కు ఇప్పటివరకు లక్షన్నరకుపైగా లైక్స్‌ రావడం గమనార్హం. క్రమంగా ప్రముఖ సంస్థలతోపాటు వ్యక్తులూ ఈ ట్రెండింగ్‌లో భాగస్వాములవుతున్నారు.

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా(NASA).. ‘యూనివర్స్‌(Universe)’ అని ట్వీట్‌ చేసింది. వాషింగ్టన్‌ పోస్ట్‌.. ‘న్యూస్(News)’ అని పోస్ట్‌ చేసింది. అయితే.. ‘ట్రైన్స్‌’ అనే ట్వీట్‌ను ఆమ్‌ట్రాక్ సోషల్ మీడియా టీమ్‌లోని ఓ ఇంటర్న్ చేసిన పొరపాటుగా చాలా మంది భావిస్తున్నారు. మరికొందరు మాత్రం.. సోషల్‌ మీడియా యూజర్ల దృష్టిని ఆకట్టుకునేందుకు ఉద్దేశపూర్వకంగా అమలు చేసిన వ్యూహమని నమ్ముతున్నారు. ఏదేమైనా.. ప్రస్తుతం ట్విటర్‌లో నయా ట్రెండింగ్‌ హవా సాగుతోంది.








Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని