Vivek Ramaswamy: నా పాపులారిటీని తట్టుకోలేకపోతున్నారు.. అనుభవం లేదంటున్నారు..!
Vivek Ramaswamy: అమెరికా(USA) అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన అభిప్రాయాలను పక్కాగా స్పష్టం చేస్తున్నారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ నేత, భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి(Vivek Ramaswamy).. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. తనకు పెరుగుతున్న పాపులారిటీని వారు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అమెరికా(USA) అధ్యక్షుడు అయ్యేంత అనుభవం తనకు లేదని వారు భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.
‘ఇటీవల చర్చా కార్యక్రమంలో నేను మెరుగైన ప్రదర్శన చూపినప్పటి నుంచి విమర్శలు ఎక్కువయ్యాయి. ఇదంతా ఎన్నికల ప్రక్రియలో భాగం. వాస్తవమేంటంటే.. ప్రత్యర్థులు నా ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారు. 38 ఏళ్ల చిన్న వయసు వ్యక్తికి అధ్యక్ష పదవిని నిర్వహించే అనుభవం ఉండదని వారు భావిస్తున్నారు. స్వాతంత్య్రం గురించి యూఎస్ డిక్లరేషన్ను రాసినప్పుడు థామస్ జెఫర్సన్ వయసు 33 ఏళ్లే. అలాంటి స్ఫూర్తిని తిరిగి తీసుకురావాల్సి ఉంది’ అని వివేక్ అన్నారు. అలాగే మున్ముందు అమెరికాకు మంచి రోజులు ఉన్నాయని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
నేనొస్తే.. హెచ్-1బీ లాటరీ విధానాన్ని తొలగిస్తా: వివేక్ రామస్వామి
‘ప్రస్తుత పాలనపై విమర్శలు చేయడానికి చాలా అంశాలు ఉన్నాయి. కానీ నా విజన్ ఏంటనేది ప్రజలకు తెలియజేయడమే ఇక్కడ ముఖ్యం. ఈ దేశాన్ని ఏకం చేసే అంశాలపై దృష్టిపెట్టే ఏకైక వ్యక్తిని కాబట్టే.. నేను ఈ ఎన్నికల రేసులో ఉన్నాను. నేను ఇక్కడ ఎవరికి వ్యతిరేకంగా ముందుకు వెళ్లడం లేదు. ఈ దేశం కోసం మాత్రమే నేను పోటీలో ఉన్నాను’ అని అన్నారు. అలాగే బహిరంగ చర్చకు తాను సిద్ధమేనంటూ ప్రత్యర్థులకు సవాలు విసిరారు.
ఇదిలాఉంటే, ఇటీవల జరిగిన ప్రైమరీ పోటీల్లో పలు కీలక ప్రతిపాదనలతో వివేక్ రామస్వామి అనేక మంది మద్దతును చూరగొన్నారు. తర్వాత నిర్వహించిన పోల్లో 504 మంది స్పందన తెలియజేయగా.. అందులో 28శాతం మంది రామస్వామిని ఉత్తమంగా పేర్కొన్నారు. ఫ్లోరిడా గవర్నర్ డీసాంటిస్ (27శాతం), మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్(13శాతం), భారత సంతతి వ్యక్తి నిక్కీ హేలీ (7శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోదసిలోకి తెలుగుతేజం
తెలుగు తేజం గోపీచంద్ తోటకూర ఆదివారం దిగ్విజయంగా రోదసియాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. -
అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది! ఆయన సురక్షితంగా ఉన్నదీ లేనిదీ అంతుచిక్కకపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. -
ఆకాశంలో రాకాసి ఉల్క
స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ భారీ ఉల్క భూమిపై పడింది. భూవాతావరణాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే క్రమంలో అది రాపిడికి లోనై నీలివర్ణపు వెలుగులను వెదజల్లింది. -
గాజాపై గగనతల దాడిలో 27 మంది మృతి
ఇజ్రాయెల్ జరిపిన గగనతల దాడిలో గాజాలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. నుసీరత్లో పాలస్తీనా శరణార్థి శిబిరంపై చోటుచేసుకున్న ఈ ఘటన మృతుల్లో 10 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. -
బ్రిటన్ రాజు చార్లెస్-3 ఆస్తుల కంటే రిషి సునాక్ దంపతుల సంపదే ఎక్కువ
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతామూర్తిల ఆస్తులు ఇటీవల గణనీయంగా పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. -
కాంగోలో తిరుగుబాటుకు విఫలయత్నం
దేశంలో తిరుగుబాటుకు జరిగిన ప్రయత్నాన్ని వమ్ము చేసినట్లు కాంగో సైన్యం ఆదివారం ప్రకటించింది. దీనికి సంబంధించి పలువురిని అరెస్టు చేసినట్లు తెలిపింది. -
విషమంగానే స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో ఆరోగ్యం
స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59) ఆరోగ్యం ఆదివారమూ విషమంగానే ఉంది. దేశ రాజధాని బ్రటిస్లావాకు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలోని హాండ్లోవా పట్టణంలో ఫికోపై ఓ దుండగుడు బుధవారం కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. -
అఫ్గాన్లో కొనసాగుతున్న కుండపోత వర్షాలు
అధిక వర్షాలు అఫ్గానిస్థాన్ను అల్లకల్లోలానికి గురిచేస్తున్నాయి. కుండపోత వానలకు వరదలు తోడు కావడంతో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. -
ఆ ఘటనతోనే భారత్తో వాణిజ్య బంధానికి తెర : పాక్
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ దిగుమతులపై భారత్ అధిక సుంకాలు విధించడం ప్రారంభించిందని ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ అన్నారు. -
రష్యా, ఉక్రెయిన్ పరస్పర దాడులు
రష్యా, ఉక్రెయిన్లు పరస్పరం డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. దీనివల్ల పలుచోట్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. తమ దేశంలోకి వచ్చిన 57 డ్రోన్లు, పలు క్షిపణులను కూల్చేశామని రష్యా ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
-
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
-
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు