Ukraine Crisis: పుతిన్ ప్రకటన కంటే 30 నిమిషాల ముందే ఆక్రమణ మొదలు..!
సరిగ్గా నెల రోజుల క్రితం ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించింది. ఆ దేశంపై సైనిక చర్యకు ఆదేశించినట్లు ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రకటించారు
ఇంటర్నెట్డెస్క్: సరిగ్గా నెల రోజుల క్రితం ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించింది. ఆ దేశంపై సైనిక చర్యకు ఆదేశించినట్లు ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రకటించారు. అయితే, పుతిన్ ప్రకటన కంటే ముందే రష్యా సేనలు ఉక్రెయిన్పై దురాక్రమణకు దిగినట్లు తాజాగా అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పుతిన్ సైనిక చర్యను ప్రకటించడం కంటే 30 నిమిషాల ముందే ఓ రష్యన్ సైనికుడు తుపాకీతో క్రిమియా సరిహద్దును దాటినట్లు సీసీటీవీ కెమెరాల్లో కన్పించింది. అంటే.. సైనిక చర్య మొదలైన తర్వాత దీనిపై పుతిన్ బహిరంగ ప్రకటన చేసినట్లు ఆ కథనాలు పేర్కొంటున్నాయి.
35 లక్షల మంది వలస..
ఫిబ్రవరి 24న మొదలైన రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. తొలుత ఉక్రెయిన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ప్రకటించిన క్రెమ్లిన్.. ఆ తర్వాత పౌర నివాసాలపైనా విరుచుకుపడుతోంది. పెద్ద పెద్ద నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. తొలి నాళ్లలో రాజధాని కీవ్పై పట్టు సాధించాలని రష్యా సేనలు భీకరంగా ప్రయత్నించాయి. అది కుదరకపోవడంతో ఇప్పుడు మేరియుపోల్పై దృష్టిపెట్టాయి. ఆ నగరంలో దాదాపు 90శాతం భవనాలను ధ్వంసం చేశాయి. దీంతో ప్రజలు ప్రాణ భయంతో దేశం విడిచి పారిపోతున్నారు. ఇప్పటి వరకు 35లక్షలకు పైగా ఉక్రెయిన్ వాసులు పొరుగు దేశాలకు శరణార్థులుగా వలస వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. వీరిలో అత్యధికంగా పోలండ్కు వెళ్లినవారే. ఉక్రెయిన్ నుంచి 20లక్షల మందికి పైగా పోలండ్ ఆశ్రయం పొందారు.
15వేల మంది రష్యా సైనికులు హతం..
మరోవైపు రష్యా దాడులను ఉక్రెయిన్ కూడా గట్టిగా ప్రతిఘటిస్తోంది. ఈ క్రమంలోనే వేలాది మంది రష్య సైనికులను చంపేసినట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. ఈ యుద్ధంలో 7 వేల నుంచి 15 వేల మంది రష్యన్ సైనికులు మరణించి ఉండొచ్చని నాటో అంచనా వేస్తోంది. అయితే, క్రెమ్లిన్ మాత్రం ఈ మరణాలపై ప్రకటన చేయకపోవడం గమనార్హం.
వీధుల్లోకి రండి..
తమ దేశంపై రష్యా దురాక్రమణ ఆపేలా ఒత్తిడి తీసుకురావాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నారు. తాజాగా మరోసారి ప్రసంగించిన ఆయన.. రష్యాకు వ్యతిరేకంగా యావత్ ప్రజలు తమ దేశాల్లో వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టాలని అభ్యర్థించారు. ‘‘నెల రోజులు గడిచిపోయింది. ఈ యుద్ధం నాతో పాటు ప్రతి ఒక్కరి హృదయాల్ని కలచివేస్తోంది. అందుకే, ఈ యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడాలని, ఉక్రెయిన్కు మద్దతుగా నిలవాలని యావత్ ప్రపంచాన్ని కోరుతున్నా. రష్యాను అడ్డుకోవాలని అభ్యర్థిస్తున్నా’’ అని జెలెన్స్కీ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.