WHO: మహమ్మారి మధ్యలోనే ఉన్నాం.. ముప్పు తొలగిపోలేదు!
ఒమిక్రాన్ కొత్త వేరియంట్ల తీవ్రతపై పర్యవేక్షిస్తోన్న డబ్ల్యూహెచ్ఓ.. ఇప్పటివరకు ఉన్న ఒమిక్రాన్ ఉపరకాల కంటే ఇవి భిన్నంగా ఏమీ లేవని తెలిపింది.
కొత్త వేరియంట్ల తీవ్రత ప్రస్తుతానికి తక్కువేనన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోన్న వేళ కొత్త వేరియంట్లు కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల వెలుగు చూసిన ఒమిక్రాన్లో రెండు సబ్ వేరియంట్ల (BA.4, BA.5)పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దృష్టి సారించింది. కొత్త వేరియంట్ల తీవ్రతపై పర్యవేక్షిస్తోన్న డబ్ల్యూహెచ్ఓ.. ఇప్పటివరకు ఉన్న ఒమిక్రాన్ ఉపరకాల కంటే ఇవి భిన్నంగా ఏమీ లేవని తెలిపింది. అయినప్పటికీ.. ఈ వేరియంట్లు కచ్చితంగా మార్పు చెందుతాయని స్పష్టం చేసింది. ఇక కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదన్న డబ్ల్యూహెచ్ఓ.. మహమ్మారి మధ్యలోనే ఉన్నామంటూ అప్రమత్తం చేసింది.
‘ఒమిక్రాన్కు సంబంధించి రెండు ఉపరకాలను ఇప్పటికే గుర్తించాం. మునుపటి రకాలతో పోలిస్తే తీవ్రతలో ఎటువంటి మార్పులను గుర్తించలేదు. కానీ, ఇది మార్పు చెందే అవకాశం ఉంది. అందుకే ఈ వేరియంట్ వాస్తవ పరిస్థితులపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులతో కలిసి పనిచేస్తున్నాం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మారియా వాన్ కెర్ఖోవ్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ విజృంభణ తక్కువగానే ఉన్నప్పటికీ ఇది ప్రజారోగ్య ముప్పుగానే కొనసాగిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ కమిటీ పేర్కొన్న తరుణంలో కొత్త వేరియంట్లపైనా మరోసారి అప్రమత్తం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నప్పటికీ ఒమిక్రాన్ బీఏ.2 ఉపరకం కారణంగా పలు ప్రాంతాల్లో వైరస్ ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ వారాంతపు నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో మనం మహమ్మారి ముగింపు దశకు చేరుకోలేదని.. ఇంకా మధ్యలోనే ఉన్నామని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్ స్వల్పంగా ఉన్న దేశాలకు మరింత ముప్పు పొంచివుందని ఉద్ఘాటించారు. ఇదే సమయంలో ఒమిక్రాన్ నుంచి బీఏ.4, బీఏ.5 అనే రెండు ఉపరకాలు గుర్తించినట్లు దక్షిణాఫ్రికా వెల్లడించింది. ఈ రకం కేసులు ఇప్పటికే బోట్స్వానా, బెల్జియం, జర్మనీ, డెన్మార్క్తోపాటు బ్రిటన్లో వెలుగు చూసినట్లు డబ్ల్యూహెచ్ఓ కూడా ప్రకటించింది. గడిచిన 30 రోజుల్లో పరీక్షించిన నమూనాలను చూస్తే 99.2శాతం ఒమిక్రాన్ వేరియంట్ ప్రాబల్యం ఉండగా.. కేవలం 0.1శాతం కంటే తక్కువ మాత్రమే డెల్టా ప్రభావం ఉన్నట్లు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారం
వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్, జెఫ్రీ హాటిన్లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. -
బోయింగ్ 737 విమానంలో మంటలు.. రన్వేపై జారి 10 మందికి గాయాలు
ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగి రన్వేపై జారిపోయింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్నకుమారుడి రాజకీయ రంగప్రవేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. -
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి
తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
రష్యాలో ఘనంగా విక్టరీ డే సంబరాలు
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకొనే ‘విక్టరీ డే’ వేడుకలను రష్యాలో గురువారం ఘనంగా నిర్వహించారు. -
రఫాపై దాడి చేస్తే ఆయుధాలివ్వం
రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. గాజాలోని ఈ నగరంపై దాడిచేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్కు తెలిపింది. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తాజాగా తోసిపుచ్చింది. -
పాక్లో ఉగ్రదాడి.. ఏడుగురు కార్మికుల మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలను తమతో పంచుకోలేదని భారత్ స్పష్టం చేసింది. -
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
పర్యటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాయల్ థాయ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
-
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
-
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
-
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు