Red Cross: తదుపరి మహమ్మారికి సంసిద్ధత లేమి.. రెడ్క్రాస్ హెచ్చరిక!
తదుపరి మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు ఇప్పటికీ సిద్ధంగా లేవని రెడ్క్రాస్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా ఒక మేల్కొలుపు కావాలని పేర్కొంది.
జెనీవా: తదుపరి మహమ్మారి(Next Pandemic)ని ఎదుర్కొనే విషయంలో ప్రపంచ దేశాలు ఇప్పటికీ సిద్ధంగా లేవని రెడ్క్రాస్(Red Cross) సంస్థ సోమవారం హెచ్చరించింది. భవిష్యత్తులో ఏకకాలంలో ఆరోగ్య సంక్షోభాలు, వాతావరణ విపత్తులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. కరోనా కారణంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్నప్పటికీ.. అన్ని దేశాల్లోనూ బలమైన సంసిద్ధత వ్యవస్థలు లోపించాయని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్క్రాస్(IFRC) ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా(Covid 19)ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రజారోగ్య అత్యవసర స్థితిగా ప్రకటించి మూడేళ్లయిన సందర్భంగా.. కొవిడ్ స్థాయిలో భవిష్యత్తులో సంభవించే విషాదాలను తగ్గించడంపై సిఫార్సులు చేస్తూ రెడ్క్రాస్ రెండు నివేదికలు విడుదల చేసింది.
‘తదుపరి ఆరోగ్య సంక్షోభాన్ని దీటుగా ఎదుర్కొనేలా ఇప్పుడే సిద్ధమయ్యేందుకు.. కరోనా మహమ్మారి ఒక మేల్కొలుపు కావాలి’ అని ఐఎఫ్ఆర్సీ సెక్రటరీ జనరల్ జగన్ చాపాగైన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో విశ్వాస పెంపుదల, సమానత్వ చర్యలు, స్థానిక ఆరోగ్య నెట్వర్క్లను నిర్మించడం చాలా ముఖ్యమని ఐఎఫ్ఆర్సీ తెలిపింది. ఆరోగ్య, సామాజిక, ఆర్థికపరమైన లోపాలను పరిష్కరించాలని సిఫార్సు చేసింది. ప్రపంచ దేశాలు 2025 నాటికి.. దేశీయ ఆరోగ్య రంగానికి కేటాయింపులను స్థూల దేశీయోత్పత్తిలో ఒక శాతానికి పెంచాలని, గ్లోబల్ హెల్త్ ఫైనాన్స్ను ఏడాదికి కనీసం 15 బిలియన్ డాలర్లు పెంచాలని సూచించింది. కేవలం ఒకటి మాత్రమే కాకుండా వివిధ రకాల విపత్తులను ఏకకాలంలో ఎదుర్కొనేందుకు దేశాలు సంసిద్ధంగా ఉండాలని తెలిపింది.
కొనసాగుతోన్న కొవిడ్ ‘ప్రజారోగ్య అత్యవసర స్థితి’
ఇదిలా ఉండగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్ను ‘ప్రజారోగ్య అత్యవసర స్థితి’గా ప్రకటించి తాజాగా మూడేళ్లవుతోంది. ఇప్పటికీ అదే హెచ్చరికను కొనసాగిస్తున్నట్లు డబ్ల్యూహెచ్వో సోమవారం వెల్లడించింది. డబ్ల్యూహెచ్వో అధికారిక వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 75.2 కోట్లకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 68 లక్షలకుపైగా మరణాలు సంభవించాయి. అయితే, వాస్తవానికి ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఈ సంస్థ పలు సందర్భాల్లో తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం