ZeroCovid: చైనా జీరో-కొవిడ్ వ్యూహం విఫలమేనా?.. లాక్డౌన్లోకి ప్రధాన నగరాలు
చైనాలో జీరో కొవిడ్ వ్యూహం విఫలం అవుతుండడంతో లక్షల జనాభా కలిగిన ప్రధాన నగరాలను సైతం లాక్డౌన్ ఆంక్షలతో బంధిస్తోంది.
చైనా వ్యాప్తంగా పెరుగుతోన్న కొవిడ్ ఉద్ధృతి
బీజింగ్: యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు కట్టడి వ్యూహాలు, వ్యాక్సిన్ పంపిణీతో ప్రపంచ దేశాలు తీవ్ర కృషి చేస్తూనే ఉన్నాయి. మరోవైపు భవిష్యత్తులో మరోసారి విజృంభిస్తే, వాటిని తట్టుకునేందుకు వైరస్తో కలిసి జీవించే విధానాన్ని కూడా అలవాటు చేసుకుంటున్నాయి. కానీ, కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా భావిస్తోన్న చైనా మాత్రం.. జీరో కొవిడ్ వ్యూహాన్నే కొనసాగిస్తోంది. ఈ క్రమంలో వైరస్ను కట్టడి చేయలేక నానా కష్టాలు పడుతున్నట్లు తెలుస్తోంది. చివరకు జీరో కొవిడ్ వ్యూహం విఫలం అవుతుండడంతో లక్షల జనాభా కలిగిన ప్రధాన నగరాలను సైతం లాక్డౌన్ ఆంక్షలతో బంధిస్తోంది.
రికార్డు స్థాయిలో కేసులు..
గతకొద్ది రోజులుగా చైనా ప్రధాన నగరాల్లో కొవిడ్ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఆదివారం నాడు 3400 కేసులు నమోదుకాగా, సోమవారం కొత్తగా మరో 2300 కేసులు బయటపడ్డాయి. గడిచిన రెండేళ్లలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ముఖ్యంగా వైరస్ విస్తృతి అధికంగా ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయట పడుతుండడంతో అప్రమత్తమైన చైనా.. పెద్ద నగరాల్లోనూ పూర్తి లాక్డౌన్ ఆంక్షలు విధిస్తోంది. తాజాగా కోటి 70 లక్షల మంది జనాభా కలిగిన చైనా టెక్హబ్గా పేరొందిన షేన్జేన్ నగరంలో నేటి నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్నారు. మరోవైపు షాంఘైవంటి అతిపెద్ద నగరాలతోపాటు పలు ప్రావిన్సుల్లోని నగరాల్లో స్థానికంగా లాక్డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నారు.
ప్రధాన నగరాల్లో కఠిన ఆంక్షలు..
కొవిడ్ తీవ్రత దృష్ట్యా చైనాలోనే అతిపెద్ద నగరమైన షాంఘైలో పూర్తి లాక్డౌన్ విధించనప్పటికీ పాఠశాలు, కార్యాలయాలు, నివాస సముదాయాలనూ అక్కడి అధికారులు మూసివేశారు. జిలిన్ ప్రావిన్సులో మార్చి నెలలోనే దాదాపు ఐదు నగరాల్లో లాక్డౌన్ విధించారు. 90లక్షల మంది జనాభా ఉన్న చాంగ్చున్లో మూడు రోజుల క్రితం నుంచే లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఉత్తర కొరియా సరిహద్దు నగరమైన యాంజిని పూర్తిగా దిగ్బంధంలో ఉంచారు. ఏడు లక్షల జనాభా ఉన్న ఈ నగరంలో ఇప్పటికే ఆరు రౌండ్ల నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇలా కొవిడ్ తీవ్రత ఉన్న ప్రాంతాల్లో జిల్లా స్థాయిలోనూ స్థానికంగా కట్టడి చర్యలు తీసుకుంటున్నారు.
వాణిజ్య కేంద్రాలపైనా ప్రభావం..
కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేస్తోన్న చైనా అధికారులు.. ప్రజలను ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలిస్తున్నారు. ఇలా చైనా అనుసరిస్తోన్న జీరో కొవిడ్ వ్యూహం తమకు తీవ్ర భారంగా మారుతున్నట్లు అక్కడి సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాణిజ్య, ఉత్పత్తి కేంద్రాలపైనా లాక్డౌన్ ఆంక్షలు తీవ్ర ప్రభావం చూపెడుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం హాంకాంగ్ స్టాక్ ఎక్ఛేంజీ ప్రారంభ సమయంలోనే స్టాక్స్ అన్నీ పతనమయ్యాయి. షేన్జేన్ నగరంలో లాక్డౌన్ కారణంగా ఐఫోన్ తయారీకి కీలక కేంద్రం కూడా కార్యకలాపాలు నిలిపివేసింది. మరోవైపు ఫాక్స్కాన్, హువావే, టెన్సెంట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళనలు మొదలయ్యాయి.
జీరో-కొవిడ్ వ్యూహం విఫలమైనా..?
కొవిడ్-19కు కారణమైన వైరస్ తొలిసారి బయటపడినప్పటి నుంచి కట్టడి చర్యలను చైనా సమర్థవంతంగానే చేపడుతోంది. ఒకటి, రెండు కేసులు బయటపడినా.. భారీస్థాయిలో కొవిడ్ పరీక్షలు, స్థానికంగా లాక్డౌన్, ప్రయాణాలపై ఆంక్షలను అమలు చేస్తోంది. ఇలా కొవిడ్ కేసులను సున్నాకు తీసుకువచ్చే (జీరో కొవిడ్) వ్యూహాన్ని అమలు చేస్తున్నప్పటికీ వైరస్ ఉద్ధృతి అన్ని నగరాలకు విస్తరిస్తూనే ఉంది. అయితే, ఒమిక్రాన్ ప్రమాదం తక్కువగా ఉన్పప్పటికీ.. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జీరో-కొవిడ్ వ్యూహాన్ని సడలించడం కష్టమేనని చైనాలో ప్రముఖ వైద్య నిపుణుడు జాంగ్ వెన్హాంగ్ పేర్కొన్నారు. అయితే, దీనర్థం భారీస్థాయిలో పరీక్షలు, లాక్డౌన్ వంటి వ్యూహాలను శాశ్వతంగా అమలు చేయడం కాదని అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం