CPI: బీసీవై పార్టీ అధ్యక్షుడిపై దాడి.. వైకాపా దురాగతాలకు పరాకాష్ట: సీపీఐ రామకృష్ణ

బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్‌పై వైకాపా మూకల దాడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలోనే వైకాపా మూకలు దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు. 

Published : 30 Apr 2024 15:58 IST

బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్‌పై వైకాపా మూకల దాడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలోనే వైకాపా మూకలు దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు. సదుం పోలీస్ స్టేషన్ ఎదుటే బీసీవై ప్రచార వాహనాలను ధ్వంసం చేసి, తగలబెట్టడం వైకాపా దురాగతాలకు పరాకాష్ట అని విమర్శించారు. పుంగనూరు పెద్దిరెడ్డి జాగీరా? అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకుని కఠిన చర్యలు చేపట్టాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. 

Tags :

మరిన్ని