Lok sabha Polls: సొంతూళ్లకు ఓటర్ల పయనం.. కిక్కిరిసిపోతున్న బస్సులు, రైళ్లు

ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చినవారు ఓటు హక్కు వినయోగించుకునేందుకు సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో పలు రైళ్లు, బస్సుల్లో రద్దీ నెలకొంటోంది.

Published : 28 Apr 2024 13:01 IST

దేశంలో ప్రస్తుతం ఓట్ల పండగ నడుస్తోంది. మెుత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి. ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లినవారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వగ్రామాలకు చేరుకుంటారు. దీంతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. వేసవి రద్దీతో పాటు ఎన్నికలకు వెళ్లేవారి కోసం స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.  

Tags :

మరిన్ని