Vasundhara: ఆర్టీసీ బస్సులో ప్రయాణించి.. నందమూరి వసుంధర ఎన్నికల ప్రచారం

ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర శుక్రవారం శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 10 May 2024 13:12 IST

ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర శుక్రవారం శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మహిళలతో మాట్లాడారు. తెదేపా అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేదలకు ఆర్టీసీ ప్రయాణాన్ని దూరం చేశారని విమర్శించారు.

Tags :

మరిన్ని