Simhachalam: వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. పోటెత్తిన భక్తజనం

వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేకువజామున ఒంటి గంటకు సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి ప్రత్యేక పూజలు చేశారు.

Updated : 10 May 2024 12:51 IST

వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేకువజామున ఒంటి గంటకు సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి దేహంపై ఉన్న చందనాన్ని తొలగించి నిజరూపంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత వేకువజామున 2.30 గంటల నుంచి సాధారణ భక్తులకు అవకాశం కల్పించారు. వేకువజాము నుంచే సింహగిరిపై భక్తులు బారులు తీరారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు