బ్రేకింగ్

breaking
30 Apr 2024 | 23:23 IST

ముంబయిపై లఖ్‌నవూ విజయం

లఖ్‌నవూ: ఐపీఎల్‌-2024లో లఖ్‌నవూ ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 145 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ పూర్తి చేసింది. లఖ్‌నవూ బ్యాటర్లలో మార్కస్‌ స్టాయినిస్‌ (62) అర్ధశతకం, కేఎల్‌ రాహుల్ (28) రాణించారు. ముంబయి బౌలర్లలో హార్దిక్‌ పాండ్య 2, తుషారా 1, నబి 1, గెరాల్డ్‌ 1 వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ముంబయి 7 వికెట్లకు 144 పరుగులు చేసింది. నేహాల్‌ (46), టిమ్‌ డేవిడ్‌ (35*), ఇషాన్‌ కిషన్ (32) రాణించారు. లఖ్‌నవూ బౌలర్లలో మోసిన్‌ 2, స్టాయినిస్‌, నవీనుల్‌, మయాంక్‌, బిష్ణోయ్‌ తలో వికెట్‌ తీశారు.

మరిన్ని

తాజా వార్తలు