News in Pics: చిత్రం చెప్పే సంగతులు -2 (18-03-2023)

Updated : 18 Mar 2023 20:33 IST
1/24
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు గెలిచిన సందర్భంగా చంద్రబాబు నాయుడు కేకు కోసి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తినిపించారు. ఈ సందర్భంగా నేతలంతా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు గెలిచిన సందర్భంగా చంద్రబాబు నాయుడు కేకు కోసి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తినిపించారు. ఈ సందర్భంగా నేతలంతా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
2/24
హైదరాబాద్‌ నగరంలో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. దీంతో సోమాజిగూడలో ఇలా ఆకాశంలో నీలి మేఘాలు కమ్ముకోగా.. అక్కడి పచ్చని ప్రకృతి మరింత అందంగా కనిపించింది. హైదరాబాద్‌ నగరంలో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. దీంతో సోమాజిగూడలో ఇలా ఆకాశంలో నీలి మేఘాలు కమ్ముకోగా.. అక్కడి పచ్చని ప్రకృతి మరింత అందంగా కనిపించింది.
3/24
4/24
సమంత, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాకుంతలం’. ఈ సినిమాలో అనన్య నాగళ్ల అనసూయగా, అదితి బాలన్‌.. ప్రియంవద పాత్ర పోషిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను విడుదల చేసింది. సమంత, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాకుంతలం’. ఈ సినిమాలో అనన్య నాగళ్ల అనసూయగా, అదితి బాలన్‌.. ప్రియంవద పాత్ర పోషిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను విడుదల చేసింది.
5/24
దిల్లీలో నేడు అంతర్జాతీయ తృణధాన్యాల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శతాధిక వృద్ధురాలు, ప్రకృతి సేద్య రైతు, పద్మశ్రీ గ్రహీత పాపమ్మాళ్‌.. ప్రధాని మోదీని ఆశీర్వదించారు. దిల్లీలో నేడు అంతర్జాతీయ తృణధాన్యాల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శతాధిక వృద్ధురాలు, ప్రకృతి సేద్య రైతు, పద్మశ్రీ గ్రహీత పాపమ్మాళ్‌.. ప్రధాని మోదీని ఆశీర్వదించారు.
6/24
భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం విశాఖలో రెండో వన్డే మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల క్రికెటర్లు విశాఖ చేరుకున్నారు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ ఓ మ్యాచ్‌ను గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది. భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం విశాఖలో రెండో వన్డే మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల క్రికెటర్లు విశాఖ చేరుకున్నారు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ ఓ మ్యాచ్‌ను గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది.
7/24
8/24
ఎన్టీఆర్‌, జాన్వీకపూర్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘ఎన్టీఆర్‌ 30’(వర్కింగ్‌ టైటిల్‌). మార్చి 23న  ఈ సినిమా చిత్రీకరణకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుపుతూ చిత్ర బృందం పోస్టర్‌ను విడుదల చేసింది. ఎన్టీఆర్‌, జాన్వీకపూర్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘ఎన్టీఆర్‌ 30’(వర్కింగ్‌ టైటిల్‌). మార్చి 23న ఈ సినిమా చిత్రీకరణకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుపుతూ చిత్ర బృందం పోస్టర్‌ను విడుదల చేసింది.
9/24
దత్తపీఠం పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి, ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి వేర్వేరుగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని ద‌ర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. సచ్చిదానంద స్వామికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దత్తపీఠం పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి, ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి వేర్వేరుగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని ద‌ర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. సచ్చిదానంద స్వామికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
10/24
తెలుగు రాష్ట్రాల యాత్రికుల కోసం ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసిన భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలు ఖమ్మం చేరుకుంది. ఈ సందర్భంగా అధికారులు ప్రయాణికులకు స్వాగతం పలికారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ఈ రైలు ఎనిమిది రోజుల పాటు పూరీ, కోణార్క్‌, గయా, కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ మీదుగా ప్రయాణించి తిరిగి 26న సికింద్రాబాద్‌ చేరుకోనుంది. తెలుగు రాష్ట్రాల యాత్రికుల కోసం ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసిన భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలు ఖమ్మం చేరుకుంది. ఈ సందర్భంగా అధికారులు ప్రయాణికులకు స్వాగతం పలికారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ఈ రైలు ఎనిమిది రోజుల పాటు పూరీ, కోణార్క్‌, గయా, కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ మీదుగా ప్రయాణించి తిరిగి 26న సికింద్రాబాద్‌ చేరుకోనుంది.
11/24
విశాఖ తీరప్రాంతం జోడుగుళ్లపాలెం సమీప కొండలపై అందమైన చిత్రాలను తీర్చిదిద్దుతున్నారు. ఇవి ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విశాఖ తీరప్రాంతం జోడుగుళ్లపాలెం సమీప కొండలపై అందమైన చిత్రాలను తీర్చిదిద్దుతున్నారు. ఇవి ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
12/24
ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న ఆదిత్య ఠాక్రే.. తలైవాకు ఆతిథ్యమివ్వడం తమ అదృష్టమని తెలుపుతూ పోస్టు పెట్టారు. ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న ఆదిత్య ఠాక్రే.. తలైవాకు ఆతిథ్యమివ్వడం తమ అదృష్టమని తెలుపుతూ పోస్టు పెట్టారు.
13/24
హైదరాబాద్‌లోని కొంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ కాఫీ షాప్‌, ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ను సినీనటి నేహాశెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి వివిధ రకాల కాఫీ, ఐస్‌క్రీమ్‌లను రుచి చూశారు. హైదరాబాద్‌లోని కొంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ కాఫీ షాప్‌, ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ను సినీనటి నేహాశెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి వివిధ రకాల కాఫీ, ఐస్‌క్రీమ్‌లను రుచి చూశారు.
14/24
కాఫీ షాప్‌, ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ను ప్రారంభిస్తున్న నేహాశెట్టి కాఫీ షాప్‌, ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ను ప్రారంభిస్తున్న నేహాశెట్టి
15/24
హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణాలో శనివారం సూత్ర ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో సినీనటి రాశీసింగ్‌ పాల్గొని నూతన డిజైన్ల దుస్తులు, ఆభరణాలతో ఫొటోలకు పోజులిచ్చారు. హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణాలో శనివారం సూత్ర ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో సినీనటి రాశీసింగ్‌ పాల్గొని నూతన డిజైన్ల దుస్తులు, ఆభరణాలతో ఫొటోలకు పోజులిచ్చారు.
16/24
పోర్ట్‌ బ్లెయిర్‌లో 12 నుంచి 70ఏళ్ల మధ్య వయసు గల వారికి ఓపెన్‌ సీ స్విమ్మింగ్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 200 మందికిపైగా వ్యక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోర్ట్‌ బ్లెయిర్‌లో 12 నుంచి 70ఏళ్ల మధ్య వయసు గల వారికి ఓపెన్‌ సీ స్విమ్మింగ్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 200 మందికిపైగా వ్యక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
17/24
నాని (Nani) హీరోగా దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌ తెరకెక్కించిన చిత్రం ‘దసరా’ (Dasara). కీర్తి సురేశ్‌ కథానాయిక. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ యూ/ఏ సర్టిఫికేట్‌ను ఇచ్చింది. నాని (Nani) హీరోగా దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌ తెరకెక్కించిన చిత్రం ‘దసరా’ (Dasara). కీర్తి సురేశ్‌ కథానాయిక. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ యూ/ఏ సర్టిఫికేట్‌ను ఇచ్చింది.
18/24
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కన్యాకుమారిలోని వివేకానంద రాక్‌ మెమోరియల్‌ను సందర్శించారు. అక్కడి వివేకానంద విగ్రహానికి నివాళి అర్పించడంతో పాటు భరతమాత విగ్రహానికి నమస్కరించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కన్యాకుమారిలోని వివేకానంద రాక్‌ మెమోరియల్‌ను సందర్శించారు. అక్కడి వివేకానంద విగ్రహానికి నివాళి అర్పించడంతో పాటు భరతమాత విగ్రహానికి నమస్కరించారు.
19/24
మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా మహేశ్‌, త్రివిక్రమ్‌లతో కలిసి దిగిన ఫొటోను నటుడు జయరామ్‌ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా మహేశ్‌, త్రివిక్రమ్‌లతో కలిసి దిగిన ఫొటోను నటుడు జయరామ్‌ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.
20/24
అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్‌ జిల్లా మండలా పర్వత ప్రాంతంలో హెలికాప్టర్‌ ప్రమాద ఘటనలో మృతిచెందిన కర్నల్‌ వినయ్‌భాను రెడ్డి భౌతికకాయాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలోని స్వగృహానికి తీసుకువచ్చారు. ఆయన భౌతిక కాయానికి మంత్రి జగదీశ్‌ రెడ్డి నివాళి అర్పించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్‌ జిల్లా మండలా పర్వత ప్రాంతంలో హెలికాప్టర్‌ ప్రమాద ఘటనలో మృతిచెందిన కర్నల్‌ వినయ్‌భాను రెడ్డి భౌతికకాయాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలోని స్వగృహానికి తీసుకువచ్చారు. ఆయన భౌతిక కాయానికి మంత్రి జగదీశ్‌ రెడ్డి నివాళి అర్పించారు.
21/24
విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘దాస్‌ కా ధమ్కీ (Das Ka Dhamki)’. నివేదా పేతురాజ్‌ కథానాయిక (Nivetha Pethuraj). మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నివేదా పేతురాజ్‌ ఇలా మెరిశారు. విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘దాస్‌ కా ధమ్కీ (Das Ka Dhamki)’. నివేదా పేతురాజ్‌ కథానాయిక (Nivetha Pethuraj). మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నివేదా పేతురాజ్‌ ఇలా మెరిశారు.
22/24
23/24
ప్రపంచంలో అత్యంత పొట్టి బాడీబిల్డర్‌ ప్రతీక్‌ విఠల్‌ మోహితె ఓ ఇంటి వాడయ్యాడు. 3 అడుగుల 4 అంగుళాల పొడవున్న ఆయన 4 అడుగుల 2 అంగుళాల పొడవున్న జయను వివాహమాడాడు. మహారాష్ట్రకు చెందిన ప్రతీక్‌ 2021లో ప్రపంచంలో అత్యంత పొట్టి బాడీబిల్డర్‌గా గిన్నిస్‌ రికార్డు సాధించాడు. ప్రపంచంలో అత్యంత పొట్టి బాడీబిల్డర్‌ ప్రతీక్‌ విఠల్‌ మోహితె ఓ ఇంటి వాడయ్యాడు. 3 అడుగుల 4 అంగుళాల పొడవున్న ఆయన 4 అడుగుల 2 అంగుళాల పొడవున్న జయను వివాహమాడాడు. మహారాష్ట్రకు చెందిన ప్రతీక్‌ 2021లో ప్రపంచంలో అత్యంత పొట్టి బాడీబిల్డర్‌గా గిన్నిస్‌ రికార్డు సాధించాడు.
24/24
చిరంజీవి హీరోగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘భోళా శంకర్‌’. నేడు సుశాంత్‌ జన్మదినం పురస్కరించుకొని చిత్రబృందం ట్విటర్‌ వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ‘భోళా శంకర్‌’లో సుశాంత్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించింది. చిరంజీవి హీరోగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘భోళా శంకర్‌’. నేడు సుశాంత్‌ జన్మదినం పురస్కరించుకొని చిత్రబృందం ట్విటర్‌ వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ‘భోళా శంకర్‌’లో సుశాంత్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించింది.

మరిన్ని