News In Pics: చిత్రం చెప్పే సంగతులు-01 (19-04-2023)
Updated : 19 Apr 2023 12:20 IST
1/11
వృథా టైర్లే డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఆధారం అవుతున్నాయి. ఖమ్మం జిల్లా కామేపల్లి శివారులో ఓ రైతు తన చేనులో అమర్చిన పోల్లకు కొంత ఎత్తులో ఇలా టైర్లను డ్రాగన్ ఫ్రూట్కు హాని కలగకుండా, మచ్చలు పడకుండా అమర్చారు.
2/11
సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో ఓ మహిళా పారిశ్రామికవేత్త నెలకొల్పిన పరిశ్రమను మంగళవారం సినీ నటి కీర్తి సురేశ్ ప్రారంభించారు. అభిమానులు కీర్తిని చూసి మురిసిపోయారు.
3/11
ఉప్పల్ స్టేడియం వద్ద మంగళవారం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ను వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. క్రీడాకారులు వస్తున్న బస్సు వద్ద ఫొటోలు తీసుకుని సంబరపడ్డారు.
4/11
ఈ కూరగాయల కొనుగోలు సందడంతా కొంగరకలాన్లో ఉన్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని కూరగాయల విక్రయ కేంద్రంలోనిది. అధికారుల అనుమతితో రైతులు దీనిని ఏర్పాటు చేశారు. తక్కువ ధరలో తాజావి అందుబాటులో ఉండటంతో అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు.
5/11
వేసవిలో చిన్న చిన్న మొక్కలకు, లాన్లో పెంచే గడ్డికి ఒక్కరోజు నీరు పోయకపోయినా మరునాటికి వాడిపోతుంటాయి. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో పచ్చదనం తగ్గకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఇతర కాలాల్లోలాగే వేసవిలోనూ పచ్చదనంతో కనువిందు కలిగిస్తున్నాయి.
6/11
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పాత దిల్లీలోని బెంగాలీ మార్కెట్లో మంగళవారం పర్యటించారు. వ్యాపారులతో ముచ్చటించి ఆహార పదార్థాలను రుచి చూశారు.
7/11
ఏ కుటుంబంలోనైనా తాతా మనవళ్ల అనుబంధం ప్రత్యేకమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షురావు గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 12వ తరగతి పూర్తిచేయగా.. మంగళవారం గ్రాడ్యుయేషన్ పట్టా ప్రదానం చేశారు. మనవడు పట్టా తీసుకునే కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్, శోభ దంపతులు, మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, హిమాన్షు సోదరి అలేఖ్య, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
8/11
చదువైనా..ఆటలైనా..రాణించాలంటే వాటిపై ముందు ఆసక్తి రేకెత్తించాలి. అనురక్తి కలిగించాలి. అవకాశాలు అందుబాట్లోకి తీసుకురావాలి. సరిగ్గా ఆ ప్రయత్నమే ఇక్కడ జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనంపై విద్యార్థిని పుస్తకం చదువుతున్నట్లుగా వేసిన భారీ చిత్రం చూపరులను ఆకట్టుకుంటోంది. చదువుకోవాలనే ఆలోచన రేకెత్తిస్తోంది.
9/11
రామప్ప వేదికగా ప్రపంచ వారసత్వ దినోత్సవం మంగళవారం కనులపండువగా సాగింది. కార్యక్రమంలో చేసిన జానపద, సంప్రదాయ పేరిణి నృత్యాలు.. కమనీయమైన స్వరంతో గాయకుల గీతాలాపన.. అందరినీ ఆకట్టుకున్నాయి.
10/11
11/11
చారిత్రక మక్కా మసీదులో మంగళవారం రాత్రి రంజాన్ మాసం 26వ రోజున సంప్రదాయ షబ్-ఏ-ఖదర్ సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. చార్మినార్ సమీపంలోని రంజాన్ రాత్బజార్లో షాపింగ్కు వచ్చిన ముస్లింలు రాత్రి జాగరణ పాటించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. మక్కా మసీదులో జగ్నేకిరాత్ ఇషా, తరావి ప్రత్యేక ప్రార్థనలను మక్కా మసీదు ఇమామ్ మౌలానా అబ్దుల్ అలీ సిద్ధికి నిర్వహించారు.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!