News In Pics: చిత్రం చెప్పే సంగతులు-02 (19-04-2023)

Updated : 19 Apr 2023 20:22 IST
1/24
బుధవారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి కాశీకి ప్రత్యేక రైలును ప్రారంభించారు. రైలు బయలుదేరే ముందు లోకోపైలట్ ఇలా నమస్కరించి రైలు ఎక్కారు. బుధవారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి కాశీకి ప్రత్యేక రైలును ప్రారంభించారు. రైలు బయలుదేరే ముందు లోకోపైలట్ ఇలా నమస్కరించి రైలు ఎక్కారు.
2/24
విశాఖపట్నంలోని ఓ ఫర్నీచర్‌ దుకాణంలో వినూత్నంగా తయారు చేసిన వస్తువులను విక్రయిస్తునారు. పాత కారు ఇంజిన్‌లో కూర్చొనే విధంగా సీట్లు, బైక్‌తో తయారు చేసిన టేబుల్ తదితరాలను ఇక్కడ ఉంచారు. వీటితో పాటు వినియోగదారులు ఆర్డర్‌ చేసిన విధంగా సామగ్రిని తయారుచేసి ఆకట్టుకుంటున్నారు. విశాఖపట్నంలోని ఓ ఫర్నీచర్‌ దుకాణంలో వినూత్నంగా తయారు చేసిన వస్తువులను విక్రయిస్తునారు. పాత కారు ఇంజిన్‌లో కూర్చొనే విధంగా సీట్లు, బైక్‌తో తయారు చేసిన టేబుల్ తదితరాలను ఇక్కడ ఉంచారు. వీటితో పాటు వినియోగదారులు ఆర్డర్‌ చేసిన విధంగా సామగ్రిని తయారుచేసి ఆకట్టుకుంటున్నారు.
3/24
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వైతెపా ఆధ్వర్యంలో లోటస్‌పాండ్‌లో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వైతెపా ఆధ్వర్యంలో లోటస్‌పాండ్‌లో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
4/24
భారతదేశ పర్యటనలో ఉన్న యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. భారతదేశ భవిష్యత్తుకు సాంకేతికత ఏ విధంగా ఉపయోగపడనుంది అనే అంశంపై వారు  చర్చించుకున్నారు. భారతదేశ పర్యటనలో ఉన్న యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. భారతదేశ భవిష్యత్తుకు సాంకేతికత ఏ విధంగా ఉపయోగపడనుంది అనే అంశంపై వారు చర్చించుకున్నారు.
5/24
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నూతన హంగులతో పునరుద్ధరించిన నగల దుకాణాన్ని ప్రారంభించనున్నారు. బుధవారం దీనికి సంబంధించిన డేట్‌ అనౌన్స్‌మెంట్‌ చేశారు. కార్యక్రమంలో సినీనటి వాన్య అగర్వాల్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నూతన హంగులతో పునరుద్ధరించిన నగల దుకాణాన్ని ప్రారంభించనున్నారు. బుధవారం దీనికి సంబంధించిన డేట్‌ అనౌన్స్‌మెంట్‌ చేశారు. కార్యక్రమంలో సినీనటి వాన్య అగర్వాల్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
6/24
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ‘టాలెంట్‌ ఫెస్ట్‌ 2023’ను ఘనంగా నిర్వహించారు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. సంస్కృత భాష విశిష్ఠతను తెలుపుతూ ర్యాలీ తీశారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ‘టాలెంట్‌ ఫెస్ట్‌ 2023’ను ఘనంగా నిర్వహించారు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. సంస్కృత భాష విశిష్ఠతను తెలుపుతూ ర్యాలీ తీశారు.
7/24
కూకట్‌పల్లిలోని పాపారాయుడునగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ రెస్టారెంట్‌కు ‘బీటెక్ బాబు స్పైసీ హౌస్‌’ అని పేరు పెట్టారు. పేరు వినూత్నంగా ఉండటంతో పలువురు నగరవాసులు ఇక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. కూకట్‌పల్లిలోని పాపారాయుడునగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ రెస్టారెంట్‌కు ‘బీటెక్ బాబు స్పైసీ హౌస్‌’ అని పేరు పెట్టారు. పేరు వినూత్నంగా ఉండటంతో పలువురు నగరవాసులు ఇక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.
8/24
కూకట్‌పల్లి నుంచి హైటెక్‌సిటీకి ఐటీ, ఇతర ఉద్యోగులు ఉదయం సమయంలో పెద్దఎత్తున వెళ్తుంటారు. కానీ సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఉదయం బస్సు సమయానికి రాకపోవడంతో ఉద్యోగులు జేఎన్టీయూ రెండో గేటు నుంచి మొదటి గేటు వరకు రోడ్డుపై ఎదురుచూస్తూ కనిపించారు. చివరికి వచ్చిన ఒక్క బస్సులో మహిళలు తోసుకుంటూ ఎక్కి ఇబ్బందులు పడ్డారు. కూకట్‌పల్లి నుంచి హైటెక్‌సిటీకి ఐటీ, ఇతర ఉద్యోగులు ఉదయం సమయంలో పెద్దఎత్తున వెళ్తుంటారు. కానీ సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఉదయం బస్సు సమయానికి రాకపోవడంతో ఉద్యోగులు జేఎన్టీయూ రెండో గేటు నుంచి మొదటి గేటు వరకు రోడ్డుపై ఎదురుచూస్తూ కనిపించారు. చివరికి వచ్చిన ఒక్క బస్సులో మహిళలు తోసుకుంటూ ఎక్కి ఇబ్బందులు పడ్డారు.
9/24
సినీనటి ఈషా రెబ్బా పుట్టిన రోజు సందర్భంగా పలువురు ట్విటర్‌ వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫ్యాన్స్‌ ఆమె ఫొటోలకు లైక్‌లు, కామెంట్లు పెడుతూ సంబరపడుతున్నారు. సినీనటి ఈషా రెబ్బా పుట్టిన రోజు సందర్భంగా పలువురు ట్విటర్‌ వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫ్యాన్స్‌ ఆమె ఫొటోలకు లైక్‌లు, కామెంట్లు పెడుతూ సంబరపడుతున్నారు.
10/24
యాపిల్‌ సీఈవో టిమ్ కుక్‌ దిల్లీలోని నేషనల్ క్రాఫ్ట్స్‌ మ్యూజియమ్‌, హస్తకళా అకాడమీని సందర్శించారు. ఇక్కడి కలపతో చేసిన కళాఖండాలు భారతీయుల సంస్కృతిని, కళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆయన తెలిపారు. మరోవైపు లోఢి ఆర్ట్‌ డిస్ట్రిక్ట్‌లో గోడలపై తీర్చిదిద్దిన పెయింటింగ్స్‌ను ఆయన తిలకించారు. యాపిల్‌ సీఈవో టిమ్ కుక్‌ దిల్లీలోని నేషనల్ క్రాఫ్ట్స్‌ మ్యూజియమ్‌, హస్తకళా అకాడమీని సందర్శించారు. ఇక్కడి కలపతో చేసిన కళాఖండాలు భారతీయుల సంస్కృతిని, కళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆయన తెలిపారు. మరోవైపు లోఢి ఆర్ట్‌ డిస్ట్రిక్ట్‌లో గోడలపై తీర్చిదిద్దిన పెయింటింగ్స్‌ను ఆయన తిలకించారు.
11/24
సినీ దర్శకుడు హను రాఘవపూడి పుట్టిన రోజు సందర్భంగా నటుడు బ్రహ్మాజీ ట్విటర్‌ వేదికగా బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. స్నేహితులందరూ కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ ‘ హ్యాపీ బర్త్‌డే హనూ డియర్‌’ అని విష్‌ చేశారు. సినీ దర్శకుడు హను రాఘవపూడి పుట్టిన రోజు సందర్భంగా నటుడు బ్రహ్మాజీ ట్విటర్‌ వేదికగా బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. స్నేహితులందరూ కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ ‘ హ్యాపీ బర్త్‌డే హనూ డియర్‌’ అని విష్‌ చేశారు.
12/24
‘స్పైడర్‌మ్యాన్‌’గా పేరు సంపాదించిన ఫ్రెంచ్‌ అర్బన్‌ క్లైంబర్‌ అలైన్‌ రాబర్ట్‌ బుధవారం పారిస్‌లోని ఆల్టో టవర్‌ను అవలీలగా ఎక్కి సంబరాలు చేసుకున్నాడు. ‘స్పైడర్‌మ్యాన్‌’గా పేరు సంపాదించిన ఫ్రెంచ్‌ అర్బన్‌ క్లైంబర్‌ అలైన్‌ రాబర్ట్‌ బుధవారం పారిస్‌లోని ఆల్టో టవర్‌ను అవలీలగా ఎక్కి సంబరాలు చేసుకున్నాడు.
13/24
గోపీచంద్‌ కథానాయకుడిగా శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రామబాణం’. డింపుల్‌ హయాతి కథానాయిక. ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను ఏప్రిల్‌ 20న సాయంత్రం 5గంటలకు రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. గోపీచంద్‌ కథానాయకుడిగా శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రామబాణం’. డింపుల్‌ హయాతి కథానాయిక. ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను ఏప్రిల్‌ 20న సాయంత్రం 5గంటలకు రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
14/24
సీఎం జగన్మోహన్‌ రెడ్డి తన తల్లి విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. విజయమ్మతో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేసిన ఆయన.. ‘హ్యాపీ బర్త్‌డే అమ్మ’ అంటూ రాసుకొచ్చారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి తన తల్లి విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. విజయమ్మతో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేసిన ఆయన.. ‘హ్యాపీ బర్త్‌డే అమ్మ’ అంటూ రాసుకొచ్చారు.
15/24
ఈ ఫొటోలో కనిపిస్తోంది ట్రినిటీ అనే పేరు గల టైరనోసారస్‌ రెక్స్‌ జాతి డైనోసర్‌ పుర్రె. దీన్ని స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌లో వేలానికి ఉంచారు. దీని ఎముకలను సేకరించి పునర్నిర్మించారు. ఇది జీవించి ఉన్నప్పుడు 38 అడుగుల పొడవు, 12.8అడుగుల ఎత్తు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ పుర్రె వేలంలో 5.6 నుంచి 8.9 మిలియన్‌ డాలర్లు ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తోంది ట్రినిటీ అనే పేరు గల టైరనోసారస్‌ రెక్స్‌ జాతి డైనోసర్‌ పుర్రె. దీన్ని స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌లో వేలానికి ఉంచారు. దీని ఎముకలను సేకరించి పునర్నిర్మించారు. ఇది జీవించి ఉన్నప్పుడు 38 అడుగుల పొడవు, 12.8అడుగుల ఎత్తు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ పుర్రె వేలంలో 5.6 నుంచి 8.9 మిలియన్‌ డాలర్లు ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు.
16/24
న్యూయార్క్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో పార్కింగ్‌ గ్యారేజ్‌ కూలిపోవడంతో కార్లు ఇలా ఒకదానిపై ఒకటి పడిపోయాయి. న్యూయార్క్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో పార్కింగ్‌ గ్యారేజ్‌ కూలిపోవడంతో కార్లు ఇలా ఒకదానిపై ఒకటి పడిపోయాయి.
17/24
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేశ్‌ రైతుల పంట పొలాలను పరిశీలించి వారి బాగోగులు తెలుసుకున్నారు. నాగలితో దుక్కి దున్ని పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేశ్‌ రైతుల పంట పొలాలను పరిశీలించి వారి బాగోగులు తెలుసుకున్నారు. నాగలితో దుక్కి దున్ని పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపారు.
18/24
సినీనటి త్రిష తన తాజా ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. గులాబీ రంగు దుస్తుల్లో మెరిసిన ఈ ఫొటోలకు ఆమె ఫ్యాన్స్‌ ముగ్ధులవుతున్నారు. త్రిష, కార్తి, విక్రమ్‌, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి, ఐశ్వర్యరాయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘పొన్నియిన్ సెల్వన్‌ 2’ ఈ నెల 28న థియేటర్లలో విడుదల కానుంది. సినీనటి త్రిష తన తాజా ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. గులాబీ రంగు దుస్తుల్లో మెరిసిన ఈ ఫొటోలకు ఆమె ఫ్యాన్స్‌ ముగ్ధులవుతున్నారు. త్రిష, కార్తి, విక్రమ్‌, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి, ఐశ్వర్యరాయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘పొన్నియిన్ సెల్వన్‌ 2’ ఈ నెల 28న థియేటర్లలో విడుదల కానుంది.
19/24
పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఓజీ’(వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమాలో ప్రియాంక మోహన్‌ కథానాయికగా నటిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ‘ఓజీ’ మెదటి షెడ్యూల్‌ షూటింగ్ ముంబయిలో సాగుతోంది. పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఓజీ’(వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమాలో ప్రియాంక మోహన్‌ కథానాయికగా నటిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ‘ఓజీ’ మెదటి షెడ్యూల్‌ షూటింగ్ ముంబయిలో సాగుతోంది.
20/24
సంగీత్‌ శోభన్‌, శాన్వీ మేఘన జంటగా సంతోష్‌ కట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రేమ విమానం’ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం ట్విటర్‌ వేదికగా విడుదల చేసింది. సంగీత్‌ శోభన్‌, శాన్వీ మేఘన జంటగా సంతోష్‌ కట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రేమ విమానం’ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం ట్విటర్‌ వేదికగా విడుదల చేసింది.
21/24
ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌’. ఈ సిరీస్‌ ప్రీమియర్‌ను మంగళవారం లండన్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రియాంక, నిక్‌ జోనాస్‌ దంపతులు, సమంత పాల్గొని సందడి చేశారు. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌’. ఈ సిరీస్‌ ప్రీమియర్‌ను మంగళవారం లండన్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రియాంక, నిక్‌ జోనాస్‌ దంపతులు, సమంత పాల్గొని సందడి చేశారు.
22/24
‘సిటడెల్’ ప్రీమియర్‌లో పాల్గొన్న సమంత ‘సిటడెల్’ ప్రీమియర్‌లో పాల్గొన్న సమంత
23/24
కొండా విజయ్‌ కుమార్ దర్శకత్వంలో నితిన్‌, నిత్యా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గుండెజారి గల్లంతయ్యిందే’. ఈ చిత్రం విడుదలై 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో హీరో నితిన్‌ ట్విటర్‌ వేదికగా సినిమా పోస్టర్‌ను పోస్టు చేస్తూ ‘ గుండెజారి గల్లంతయ్యిందే సినిమా విడుదలై పదేళ్లైనా నిన్న విడుదలైనట్టే అభిమానులు ఆదరిస్తున్నారు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చారు. కొండా విజయ్‌ కుమార్ దర్శకత్వంలో నితిన్‌, నిత్యా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గుండెజారి గల్లంతయ్యిందే’. ఈ చిత్రం విడుదలై 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో హీరో నితిన్‌ ట్విటర్‌ వేదికగా సినిమా పోస్టర్‌ను పోస్టు చేస్తూ ‘ గుండెజారి గల్లంతయ్యిందే సినిమా విడుదలై పదేళ్లైనా నిన్న విడుదలైనట్టే అభిమానులు ఆదరిస్తున్నారు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చారు.
24/24
గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నేచురల్‌ స్టార్‌ నాని ప్రధాన పాత్రలో 2019లో తెరకెక్కిన సినిమా ‘జెర్సీ’. క్రికెట్‌ నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రాన్ని అభిమానులు ఎంతో ఆదరించారు. విడుదలై 4ఏళ్లు పూర్తైన సందర్భంగా నాని ట్విటర్‌ వేదికగా జెర్సీ సినిమాలోని ఓ ఫొటోను పోస్టు చేశారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నేచురల్‌ స్టార్‌ నాని ప్రధాన పాత్రలో 2019లో తెరకెక్కిన సినిమా ‘జెర్సీ’. క్రికెట్‌ నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రాన్ని అభిమానులు ఎంతో ఆదరించారు. విడుదలై 4ఏళ్లు పూర్తైన సందర్భంగా నాని ట్విటర్‌ వేదికగా జెర్సీ సినిమాలోని ఓ ఫొటోను పోస్టు చేశారు.

మరిన్ని