News In Pics: చిత్రం చెప్పే సంగతులు
Updated : 22 Jun 2022 22:05 IST
1/25
రొమేనియాలో ప్రభుత్వం అక్కడి ఇంటెలిజెన్స్ సర్వీస్కు అధికారాలను పెంచుతూ చట్టాలను మార్చేందుకు నిర్ణయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఆందోళనకారులు బుచారెస్ట్లోని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట భారీ కళ్లను పోలిన మాస్కులు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు.
2/25
3/25
రిటైర్డ్ ఐపీఎస్ డా.ఎం.మాలకొండయ్య, సీనియర్ ఐఏఎస్ డా.పూనం మాలకొండయ్య దంపతుల కుమార్తె వివాహ రిసెప్షన్కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరిగిన వేడుకలో ఆయన పాల్గొని వధూవరులు పల్లవి, కృష్ణతేజలను ఆశీర్వదించారు.
4/25
5/25
గుజరాత్లోని అహ్మదాబాద్లో జులై 1న జగన్నాథుడి రథయాత్ర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రదర్శన కోసం పలువురు యువకులు ద్విచక్రవాహనంతో విన్యాసాలను సాధన చేస్తూ కనిపించారు.
6/25
బంగ్లాదేశ్లో భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. దీంతో సిలిహట్ నగరంలో స్థానికులు ఇళ్లలోని సామగ్రిని పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
7/25
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ మంగళవారం మాస్కులు, టీకాతో పాటు భౌతికదూరం తప్పనిసరి పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్
గన్పౌండ్రిలోని మహబూబియా పాఠశాలలో విద్యార్థులందరు మాస్కులు ధరించి తరగతులు వింటూ కనిపించారు.
8/25
లండన్లోని సోతిబే ఆక్షన్ హౌస్లో ‘స్టడీ ఫర్ పోర్ట్రేట్ ఆఫ్ లూసేన్ ఫ్రెడ్’ అనే చిత్రాన్ని పదర్శనకు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 29న జరగనున్న వేలంలో ఈ చిత్రం సుమారు 35మిలియన్ పౌండ్లకు అమ్ముడుపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
9/25
పేరూరులో నిర్వహిస్తున్న వకుళామాత ఆలయ మహా సంప్రోక్షణకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని అందరికీ మంచి జరగాలని కోరుకున్నారు.
10/25
11/25
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఎంపీ సంతోశ్కుమార్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు. ఈ ఫొటోలను ఎంపీ సంతోశ్కుమార్ ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాలుపంచుకున్నందుకు సల్మాన్ఖాన్కు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టు పెట్టారు. పచ్చదనం పెంపునకు సల్మాన్ చేసిన కృషి ఆయన అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
12/25
13/25
జనగామ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాస్గౌడ్ అక్కడి ఖిలాషాపూర్ గ్రామంలోని బీఆర్ అంబేడ్కర్, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్, బాబూ జగ్జీవన్రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆ విగ్రహాల వద్ద ఉన్న చెత్త, మట్టికుప్పలను ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్థులకు సూచించారు.
14/25
15/25
భారతీయ బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ను కలిశారు. ఈ ఫొటోను ట్విటర్ ఖాతాలో పంచుకున్న మాల్యా.. తన స్నేహితుడు, యూనివర్సల్ బాస్ను కలుసుకోవడం ఆనందంగా ఉందని తెలుపుతూ పోస్టు పెట్టారు.
16/25
1998 డీఎస్సీ అభ్యర్థులు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. 24ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించారని హర్షం వ్యక్తం చేస్తూ సీఎంను శాలువాతో సత్కరించారు.
17/25
ఆత్మకూరు శాసనసభ స్థానం ఉపఎన్నికను గురువారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఆత్మకూరు ఏఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ప్రత్యేక ఆకృతిలో కూర్చొని అవగాహన కల్పించారు. మేకపాటి గౌతమ్ మృతి చెందడంతో ఈ అసెంబ్లీ స్థానంలో ఉపఎన్నిక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
18/25
ఎంపీ సంతోశ్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించింది. ప్రముఖ పోలార్ ఎక్స్ప్లోరర్ రాబర్ట్ స్వాన్ ఈ కార్యక్రమం గొప్పతనాన్ని గుర్తించి దక్షిణ ధ్రువం అంటార్కిటికాలో దీనికి సంబంధించిన పతాకాన్ని ఎగురవేశారు. ఈ ఫొటోలను తన ట్విటర్ ఖాతాలో పంచుకున్న ఎంపీ సంతోశ్కుమార్.. రాబర్ట్ స్వాన్కు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టు పెట్టారు.
19/25
20/25
అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 255మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అక్కడి పక్తిక ప్రావిన్స్లోని గయాన్ జిల్లాలో క్షతగాత్రులను ప్రభుత్వ హెలికాప్టర్లో హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు.
21/25
రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో ప్యాలస్ స్క్వేర్ వద్ద మాతృభూమి స్మారకం తరహాలో దీపాలు వెలిగించారు. రెండో ప్రపంచ యుద్ధ
సమయంలో నాజీ దండయాత్రకు గుర్తుగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
22/25
23/25
ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపదీ ముర్మూ ఈ రోజు తన స్వరాష్ట్రం ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు చెందిన
రాయ్రంగ్పుర్లోని శివాలయానికి వెళ్లారు. గుడిలో నేరుగా దేవుడి దర్శనానికి వెళ్లకుండా.. ఆలయ ప్రాంగణాన్ని చీపురుతో శుభ్రపరిచారు. ఆ
తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు.
24/25
తెలంగాణ రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి కార్పొరేషన్(రెడ్ కో) ఛైర్మన్గా నియమితులైన వై.సతీశ్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర
ఫిలిం, టెలివిజన్&థియేటర్ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్గా నియమితులైన అనిల్ కుర్మాచలం తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి
కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమను నూతన పదవులకు ఎంపిక చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
25/25
సాధారణంగా ఇంటి నంబర్లు గేటు, గోడలపై కనిపిస్తుంటాయి. అలా ఉంటే తన ప్రత్యేకత ఏముంటుందని భావించాడో యజమాని. ఇలా
వినూత్నంగా ఓ రాయిపై తన ఇంటి పేరు, నంబరు చెక్కించి వైవిధ్యాన్ని చాటుకున్నాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోనిదీ చిత్రం.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక