News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (06-06-2023)

Updated : 06 Jun 2023 12:19 IST
1/3
‘ఖుషి’ సినిమా షూట్‌ కోసం తుర్కియే వెళ్లిన సామ్‌ విరామ సమయంలో సరదాగా గడిపేస్తున్నారు. ప్రకృతి అందాలను వీక్షిస్తూ.. సరికొత్త రుచులను ఆస్వాదిస్తున్నారు. బెస్ట్‌ డేస్ అంటూ ఇన్‌స్టాలో పలు చిత్రాలను షేర్ చేశారు. ‘ఖుషి’ సినిమా షూట్‌ కోసం తుర్కియే వెళ్లిన సామ్‌ విరామ సమయంలో సరదాగా గడిపేస్తున్నారు. ప్రకృతి అందాలను వీక్షిస్తూ.. సరికొత్త రుచులను ఆస్వాదిస్తున్నారు. బెస్ట్‌ డేస్ అంటూ ఇన్‌స్టాలో పలు చిత్రాలను షేర్ చేశారు.
2/3
క్రికెటర్‌ ధోనీ కుటుంబాన్ని కలిసిన ఫొటోను మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు.  ‘ ధోని గొప్ప వ్యక్తి. ఆయన కుటుంబసభ్యులను అనుకోకుండా విమానాశ్రయంలో కలవడం చాలా ఆనందంగా ఉంది. వచ్చే సీజన్‌లో కలుద్దాం ఛాంపియన్‌’ అని కైఫ్‌ పేర్కొన్నాడు. క్రికెటర్‌ ధోనీ కుటుంబాన్ని కలిసిన ఫొటోను మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. ‘ ధోని గొప్ప వ్యక్తి. ఆయన కుటుంబసభ్యులను అనుకోకుండా విమానాశ్రయంలో కలవడం చాలా ఆనందంగా ఉంది. వచ్చే సీజన్‌లో కలుద్దాం ఛాంపియన్‌’ అని కైఫ్‌ పేర్కొన్నాడు.
3/3
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీనటుడు ప్రభాస్‌ దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున ‘ఆదిపురుష్‌’ చిత్ర బృందంతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన.. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ప్రభాస్‌కు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీనటుడు ప్రభాస్‌ దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున ‘ఆదిపురుష్‌’ చిత్ర బృందంతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన.. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ప్రభాస్‌కు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
Tags :

మరిన్ని