దేవతలకూ దండన తప్పదు
క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృతాన్ని దేవతలకు పంచుతున్నాడు మోహిని అవతారంలో ఉన్న విష్ణువు. దాంతో రాహుకేతులనే రాక్షసులు అమృతం కోసం దేవతల వరుసలోకి మారారు. అది గమనించిన సూర్యచంద్రులు వాళ్లు దేవతలు కాదు, రాక్షసులంటూ మోహినికి సైగ చేసి చెప్పారు. కానీ వాళ్లు అప్పటికే అమృతం తాగేశారు. గొంతు వరకు దిగిన అమృతం వల్ల విష్ణుమూర్తి ప్రయోగించిన చక్రాయుధం రాహువును అమరుణ్ణి చేసింది. తోక భాగానికి అమృతం అందనందున అది అదృశ్య రూపం కలిగిన కేతువయ్యింది. అయితే సూర్యచంద్రులు చేసింది పర పీడనం. అందువల్ల ఆ తప్పుకు దండన తప్పలేదు. అందుకే గ్రహణ రూపంలో వాళ్లని మింగి విడవడం జరుగుతోంది. ‘తప్పు చేస్తే దేవతలు సైతం దండనార్హులే’ అని తెలియజేసే కథనమిది.
ఉమాబాల
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Vitapu-Botsa: విఠపు పరీక్షలో.. బొత్సకు 2 మార్కులే!
-
Ap-top-news News
AP Assembly: సభాపతి స్థానాన్ని అగౌరవపరిస్తే సస్పెండ్ అయినట్లే.. రూలింగ్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని
-
India News
Property: ఏనుగుల కోసం రూ.5 కోట్ల ఆస్తి
-
India News
మహిళలకు ప్రతీనెలా రూ.వెయ్యి పంపిణీ
-
India News
Lottery: సినీ నటి ఇంట్లో సహాయకుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు