ఐఐటీలో సమ్మర్‌ ఫెలోషిప్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)- బాంబే 2020కిగానూ ఫ్రీ/ లిబర్‌ అండ్‌ ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ (ఎఫ్‌ఓఎస్‌ఎస్‌ఈఈ) సమ్మర్‌ ఫెలోషిప్‌లను అందిస్తోంది. ఇది మానవ వనరుల అభివృద్ధి శాఖ కింది ప్రాజెక్టు. అన్ని విభాగాలవారూ, బ్యాచిలర్‌, మాస్టర్స్‌, పీహెచ్‌డీ మొదలైన పట్టాలున్నవారూ దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

Published : 11 Feb 2020 00:31 IST

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)- బాంబే 2020కిగానూ ఫ్రీ/ లిబర్‌ అండ్‌ ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ (ఎఫ్‌ఓఎస్‌ఎస్‌ఈఈ) సమ్మర్‌ ఫెలోషిప్‌లను అందిస్తోంది. ఇది మానవ వనరుల అభివృద్ధి శాఖ కింది ప్రాజెక్టు. అన్ని విభాగాలవారూ, బ్యాచిలర్‌, మాస్టర్స్‌, పీహెచ్‌డీ మొదలైన పట్టాలున్నవారూ దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఏమీలేదు. ఫెలోషిప్‌ను పొందడానికి అభ్యర్థులు దరఖాస్తుతోపాటుగా స్క్రీనింగ్‌ టాస్క్‌నూ పూర్తిచేయాల్సి ఉంటుంది. దీనిని పూర్తిచేయడానికి నెలకుపైగా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అంశాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
అభ్యర్థులు రెండు టాపిక్‌ల వరకూ ఎంచుకునే వీలుంది. టాస్క్‌ పూర్తిచేసిన తర్వాత గడువులోగా వెబ్‌సైట్‌లో సమర్పించాలి. వీటిని ఎఫ్‌ఓఎస్‌ఎస్‌ఈఈ బృందం పరిశీలిస్తుంది. ఉత్తమంగా చేసినవారిని ఎంపికచేసి, ఫెలోషిప్‌ అవకాశం కల్పిస్తారు. స్క్రీనింగ్‌ టాస్క్‌ పూర్తిచేసినవారికి సర్టిఫికెట్‌ అందజేస్తారు. ఇదివరకే సమ్మర్‌ ఫెలోషిప్‌లో పాల్గొన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
నమోదు చేసుకోవడానికి చివరితేదీ: ఫిబ్రవరి 25, 2020
దరఖాస్తు సమర్పించడానికి చివరితేదీ: మార్చి 07, 2020
ఫలితాలు ఏప్రిల్‌ 2020 చివర్లోగా వెలువడతాయి.
వెబ్‌సైట్‌: https://fossee.in/fellowship/2020


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని