UPSC Civils 2024: ‘సివిల్స్‌’ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా.. కొత్త డేట్‌ ఇదే..

అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా పడింది.

Updated : 19 Mar 2024 20:14 IST

UPSC CSE 2024 | దిల్లీ:  యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌, ఫారెస్ట్‌ సర్వీస్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక. అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష, ఫారెస్ట్‌ సర్వీస్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. గతంలో వేర్వేరుగా ప్రకటించిన రెండు నోటిఫికేషన్ల ప్రకారం.. ప్రిలిమినరీ పరీక్ష మే 26న జరగాల్సిఉంది. అయితే, లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ పరీక్షల్ని రీషెడ్యూల్‌ చేస్తూ యూపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. అలాగే, ఈ రెండు పరీక్షలను జూన్‌ 16న ఈ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు యూపీఎస్సీ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

సివిల్‌ సర్వీసెస్‌లో 1,056 ఉద్యోగాలు; ఫారెస్ట్‌ సర్వీసుల్లో 150 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 14న యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల గడువు మార్చి 6తో ముగిసింది. యూపీఎస్సీ మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన లక్షల మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని