మిలన్లో ఫ్యాషన్ల మిలమిల
సొగసుల రాజధాని మిలన్లో ఏటా జరిగే ఫ్యాషన్ వీక్కి ఎంతో క్రేజ్. కాలేజీ కుర్రాళ్ల నుంచి ప్రఖ్యాత డిజైనర్ల దాకా అందరి చూపూ అక్కడే ఉంటుంది.
సొగసుల రాజధాని మిలన్లో ఏటా జరిగే ఫ్యాషన్ వీక్కి ఎంతో క్రేజ్. కాలేజీ కుర్రాళ్ల నుంచి ప్రఖ్యాత డిజైనర్ల దాకా అందరి చూపూ అక్కడే ఉంటుంది. ఈ షోలో మోడళ్లు ధరించే ఔట్ఫిట్లే నయా ఫ్యాషన్ ట్రెండ్లా మారిపోయి ప్రపంచమంతా చుట్టేస్తాయి. ఇక్కడ డిజైన్ హిట్ కొడితే డిజైనర్ రాత్రికి రాత్రే పాపులర్ అయిపోతాడు. ప్రపంచం దృష్టిలో పడిపోతాడు. అందుకే ప్రముఖ బ్రాండ్లు, పేరు మోసిన డిజైనర్లు ఈ షోలో తమ డిజైన్లు ప్రదర్శితం కావడం గౌరవంగా భావిస్తారు. నైపుణ్యం చూపించాలనుకుంటారు. లాక్డౌన్ గ్యాప్ తర్వాత షో నిర్వహించడంతో ఈసారి ఫ్యాషన్ వీక్ని మరింత ప్రతిష్ఠాత్మకంగా భావించారు. దానికి తగ్గట్టే ఫెండీ, డాల్ష్ అండ్ గబానా, ప్రాడా, ఎర్డెమ్, ఎట్రో, జార్జియో ఆర్మానీలాంటి ప్రఖ్యాత బ్రాండ్ల డిజైన్లు ధరించి మోడళ్లు ర్యాంప్పై నడిచారు. మోనోక్రోమాటిక్ డిజైన్లు, బాంబర్ జాకెట్లు, మిక్స్డ్ అండ్ మ్యాచ్డ్ ప్యాటర్న్లు, టింటెడ్ సన్గ్లాస్లు, ఓపెన్ టోడ్ శాండిల్స్, మైక్రో షార్ట్స్, ఓవర్ సైజ్డ్ షోల్డర్ జాకెట్లు, డిస్కో బాల్ సూట్లు.. బాగా ఆకట్టుకున్నాయి. అన్నట్టు ఇది మేల్ సెగ్మెంట్ మాత్రమే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత