Andhra News: వారి వివరాలు సేకరించాం.. తగిన మూల్యం చెల్లించక తప్పదు: అచ్చెన్నాయుడు
మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మహానాడుకు ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకుంటూ చలానా కడితే ఇప్పుడు బస్సులు ఇవ్వమని అడ్డు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మహానాడుకు ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకుంటూ చలానా కడితే ఇప్పుడు బస్సులు ఇవ్వమని అడ్డు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవి రద్దీ అంటూ సాకులు చెప్తున్నారని ఆక్షేపించారు. మహానాడుకు వాహనాలు ఇస్తే వాటిని సీజ్ చేస్తామని ప్రైవేటు వాహనాల యజమానులను ఆర్టీవోలు భయపెడుతున్నారని తెలిపారు. అలా బెదిరించిన అధికారుల వివరాలు సేకరించామని.. వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అచ్చెన్న హెచ్చరించారు. గత 40ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పెద్ద ఎత్తున మహానాడుకు శ్రేణులు సమాయత్తమవుతున్నారని పేర్కొన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా చీమలదండులా తెదేపా కార్యకర్తలు మహానాడుకు పోటెత్తడం ఖాయమన్నారు. మూడేళ్ల ప్రభుత్వ అరాచక పాలనపై తిరుగుబాటుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అందుకే మహానాడు విజయవంతం కాకుండా కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
-
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం