బాలిక అపహరణ కేసులో ఒకరి అరెస్టు
విజయవాడ రైల్వే స్టేషన్లో చిన్నారి హనీఫా(3)ని అపహరించింది గుడివాడకు చెందిన మహిళలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విజయవాడ పోలీసులు సేకరించిన సీసీ ఫుటేజీ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో సోమవారం...
నిందితులు గుడివాడ మహిళలు!
నిందితులుగా అనుమానిస్తున్న దొండపాటి పద్మజ , కోరుకొండ విజయలక్ష్మి
గుడివాడ గ్రామీణం, రైల్వేస్టేషన్(విజయవాడ), న్యూస్టుడే : విజయవాడ రైల్వే స్టేషన్లో చిన్నారి హనీఫా(3)ని అపహరించింది గుడివాడకు చెందిన మహిళలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విజయవాడ పోలీసులు సేకరించిన సీసీ ఫుటేజీ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో సోమవారం ఉదయం గుడివాడ కార్మికనగర్ వాసులు స్థానికంగా ఉన్న 413వ అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి కార్యకర్త డి.జయలక్ష్మిని నిలదీశారు. ఈ గొడవపై స్థానిక సచివాలయ మహిళా పోలీసు వన్టౌన్ పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చేసరికి నిందితులుగా అనుమానిస్తున్న అంగన్వాడీ కేంద్రం ఆయా దొండపాటి పద్మజ(చిన్నారి), అదే ప్రాంతానికి చెందిన మరో నిందితురాలైన తాపీ కార్మికురాలు కోరుకొండ విజయలక్ష్మి పరారయ్యారు. పోలీసులు వెంటనే పద్మజ కుమారుడు సందీప్ను అదుపులోకి తీసుకోగా వాస్తవాలు వెలుగులోకి రావడంతో విజయవాడ జీఆర్పీకి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో వారు విజయలక్ష్మిని కంచికచర్ల టోల్ గేట్ సమీపంలో అరెస్టు చేసినట్లు తెలిసింది. నిందితురాలు పద్మజ అంగన్వాడీ కేంద్రం కార్యకర్త జయలక్ష్మికి సొంత చెల్లెలు. స్థానికులు అంగన్వాడీ కేంద్రానికి వచ్చి అక్కను ఆరా తీస్తున్న విషయాన్ని ఆమె ద్వారా తెలుసుకొని పద్మజ పరారైనట్లు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా సదరు మహిళలు చిన్నారిని విక్రయించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఇందులో పిల్లల్ని విక్రయించే ముఠా హస్తం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా ఏలూరుకు చెందిన చిన్నారి తల్లి ముస్లిం మహిళ కాగా ప్రకాశం జిల్లాకు చెందిన ఆంజనేయులను రెండో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. ఆంజనేయులు విజయవాడలో కూలీ పనులు చేస్తుండగా భార్య చెత్తకాగితాలు ఏరుతుంది. ఇద్దరూ కలిసి తారాపేట రైల్వేస్టేషన్లో ఉంటున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకొని పాపను తల్లిదండ్రులకు అప్పగిస్తామని జీఆర్పీ పోలీసులు చెపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు