Chandrababu: విశాఖలో చంద్రబాబు పర్యటన.. ఎండాడ వద్ద అడ్డుకున్న పోలీసులు
తెదేపా అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన కొనసాగుతోంది. ప్రస్తుతం విశాఖ నగరంలో పర్యటిస్తున్న ఆయన..
విశాఖపట్నం: తెదేపా అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన కొనసాగుతోంది. ప్రస్తుతం విశాఖ నగరంలో పర్యటిస్తున్న ఆయన.. రుషికొండ వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అనుమతి నిరాకరించారు. రుషికొండలోని హరిత రిసార్ట్స్ పరిశీలనకు బయల్దేరగా ఎండాడ జంక్షన్ వద్ద చంద్రబాబు బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై తెదేపా అధినేత వాహన శ్రేణిని నిలిపేశారు.
రుషికొండ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంపై తెదేపా శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసులతో పలువురు నేతలు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. కొంతమంది తెదేపా నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు కాన్వాయ్ను పోలీసులు అడ్డుకోవడంతో ఎండాడ నుంచి డైరీఫామ్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. అక్కడికి కాసేపటికి తర్వాత చంద్రబాబు తాళ్లవలస వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మద్దతిస్తాం
హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్సింగ్ హుడా చర్యలు చేపడితే తమ పార్టీ మద్దతిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు దుశ్యంత్ చౌటాలా తెలిపారు. -
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. -
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్రెడ్డి
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి బరిలో నిలవనున్నారు. -
కాంగ్రెస్లోకి పద్మశ్రీ గ్రహీత గజం గోవర్ధన్
పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు అఖిలభారత పద్మశాలి అన్నసత్రం భద్రాచలం అధ్యక్షుడు గోశిక యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి నారా నరసింహా, ఆప్కో మాజీ డైరెక్టర్ గోశిక పాండులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.