కరోనా మరణాలకు పరిహారం ఇవ్వాల్సిందే
కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ‘కనీస ప్రమాణాలు గల ఆర్థిక సహాయం’ ఇచ్చేందుకు తాజా మార్గదర్శకాలు జారీ చేయాలని బుధవారం
ఎంతివ్వాలో కేంద్రమే నిర్ణయించాలి
ఆరు వారాల్లో మార్గదర్శకాలు ఇవ్వాలి
ఆర్థిక సాయం సరికాదన్న వాదనల తిరస్కరణ
చట్టం అమలులో విఫలమయినట్టు వ్యాఖ్య
సుప్రీంకోర్టు తీర్పు
ఈనాడు - దిల్లీ
కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ‘కనీస ప్రమాణాలు గల ఆర్థిక సహాయం’ ఇచ్చేందుకు తాజా మార్గదర్శకాలు జారీ చేయాలని బుధవారం జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ-ఎన్డీఎంఏ)ను ఆదేశించింది. పరిహారం ఇవ్వాలని చట్టంలో విస్పష్టంగా ఉన్నందున దాన్ని అమలు చేసి తీరాలని తేల్చి చెప్పింది. కరోనా నివారణకు ఇతర రూపాల్లో సాయం చేస్తున్నామని, అందువల్ల నగదు కూడా ఇవ్వాలనడం సరికాదన్న కేంద్రం వాదనలను తిరస్కరించింది. నగదు రూపంలో పరిహారం ఇస్తే ఇతర కార్యక్రమాలకు నిధులు ఉండవన్నదాన్నీ అంగీకరించలేదు.
తాత్కాలిక సాయం (ఎక్స్గ్రేషియా) కింద ఎంత ఇవ్వాలన్నదానిపై తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, కేంద్ర ప్రభుత్వమే కనీస ప్రమాణాలుగల మొత్తాన్ని నిర్ధరించాలని న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం సూచించింది. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని దీనిపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ ఇద్దరు న్యాయవాదులు...రీపక్ కన్సల్, గౌరవ్ కుమార్ బన్సల్లు దాఖలు చేసిన రెండు వేరువేరు వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం పై తీర్పు ఇచ్చింది. పరిహారం చెల్లించడంతో పాటు, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో దేశవ్యాప్తంగా ఏకీకృత విధానం రూపొందించాలని తమ వ్యాజ్యాల్లో కోరారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాల తరఫున న్యాయవాది సుమీర్ సోధి నాలుగు మధ్యంతర దరఖాస్తులు సమర్పించారు. పరిహారం చెల్లింపులో వివక్ష ఉండకూడదని, అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే తరహా మొత్తం ఉండాలని కోరారు. ఒక రాష్ట్రం హెచ్చుగా, మరో రాష్ట్రం తక్కువగా పరిహారాన్ని నిర్ణయించకూడదని, అందువల్ల కేంద్ర ప్రభుత్వమే ఏకరూప విధానాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘పరిహారం నిర్ణయించడం వంటి వ్యవహారాల్లో సాధారణంగా కోర్టులు జోక్యం చేసుకోవు. అసాధారణత, ప్రభావం, విస్తృతి దృష్ట్యా రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించలేం’’ అని ధర్మాసనం పేర్కొంది.
‘షల్’...‘మే’...పై స్పష్టత
ప్రకృతి వైపరీత్యాలకు ప్రభావితమైన వారికి పరిహారం అందించడానికి నేషనల్ అథారిటీ కచ్చితంగా మార్గదర్శకాలను సిఫార్సు చేయాలని ప్రకృతి వైపరీత్యాల చట్టం-2005లోని సెక్షన్ 12(3) విస్పష్టంగా చెబుతోంది. పరిహారం తప్పనిసరిగా చెల్లించాలన్న అర్థం వచ్చే రీతిలో ‘షల్’ అనే పదం ఉండగా, అవకాశం ఉంటే ఇవ్వవచ్చన్న అర్థంలో ‘మే’ అన్న పదాన్ని ఉపయోగించి ఈ సెక్షన్పై కేంద్రం వాదన వినిపించింది. ఆ సెక్షన్లోని ‘షల్’ అనే పదాన్ని ‘మే’గా చదవాలని, ఇక్కడ ‘షల్’ను తప్పనిసరి అన్న అర్థంలో పొందుపరచలేదని చెప్పింది. ఇది సరికాదు. ఆ సెక్షన్లో ‘షల్’ అన్న పదాన్ని రెండుసార్లు ఉపయోగించడాన్ని బట్టి దాని వెనకున్న ఉద్దేశం సుస్పష్టం. ఈ పరిహారం ‘ఉదారంగా’ ఇచ్చేదే తప్ప, ‘ఆదేశాలకు లోబడి ఇచ్చేది కాదు’ అన్న వాదన కూడా ఆమోదయోగ్యం కాదు.
సరళంగా మరణ ధ్రువీకరణ పత్రాలు
మరణానికి స్పష్టమైన కారణలను చెబుతూ మరణ ధ్రువపత్రాలు జారీచేసేందుకు ఎన్డీఎంఏ సరళమైన మార్గదర్శకాలు జారీచేయాలి. ఒకవేళ మరణం కొవిడ్ ద్వారా సంభవించి ఉంటే ‘కొవిడ్-19 మరణం’ అన్న స్పష్టమైన కారణం చెబుతూ ధ్రువపత్రం జారీచేయాల్సిన బాధ్యత అధికార వ్యవస్థదే. ఒకవేళ ఎవరైనా కొవిడ్-19 వల్లకానీ, కొవిడ్-19 సోకడంవల్ల తలెత్తిన సమస్యలవల్లకానీ మరణిస్తే ఆ విషయాన్ని ధ్రువపత్రంలో స్పష్టంగా పేర్కొనాలి. ఒకవేళ ఎవరైనా వ్యక్తి కొవిడ్ సోకిన రెండు, మూడు నెలల తర్వాత ఆసుపత్రిలోకానీ, ఇంట్లోకానీ మరణించినా, అతని మరణానికి కొవిడే కారణమైనప్పుడు కచ్చితంగా కొవిడ్-19 వల్లే మరణించారని ధ్రువపత్రంలో పేర్కొనాలి. అధికారులు జారీచేసిన మరణ ధ్రువీకరణ పత్రంపై కుటుంబసభ్యులకు అభ్యంతరాలు ఉంటే, అందులో మరణానికి నిజమైన, స్పష్టమైన కారణాలు చెప్పకపోయి ఉంటే వారి సమస్యకు కచ్చితమైన పరిష్కారం చూపాలి. సంబంధిత అధికారులను సంప్రదించి మరణ ధ్రువీకరణ పత్రాన్ని సరిచేయించుకొనే వెసులుబాటు ఇవ్వాలి.
పరిహారం అవసరం లేదని సర్కారు వాదన
తొలుత కేంద్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ ‘ఆర్థిక స్థోమత’ పెద్ద సమస్యకాకపోయినా, రూ.4లక్షల పరిహారం చెల్లింపు విషయమై ఇతర అంశాలనూ గమనించాల్సి ఉందని తెలిపింది. జాతి సంపద వినియోగంలో ‘హేతుబద్ధత, వివేకం, గరిష్ఠ ప్రయోజనం’ వంటి అంశాలను పరిశీలించాలని పేర్కొంది. అనంతరం అదనపు ప్రమాణ పత్రం సమర్పిస్తూ కరోనా వంటి విపత్తులు జీవితంలో ఒకేసారే వచ్చేవని, ఇది ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ప్రభావితం చూపిందని తెలిపింది. నిపుణుల సూచనల మేరకు వివిధ రూపాల్లో సహాయం అందిస్తున్నామని, అందువల్ల మళ్లీ నగదు రూపంలో చెల్లించడం ఎందుకని పేర్కొంది. ఏ రాష్ట్రమూ, కేంద్ర పాలిత ప్రాంతమూ ఇంతవరకు పరిహారం చెల్లించలేదని తెలిపింది.
విపత్తుల జాబితాలో కరోనా లేదు
విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం 2015-2020 సంవత్సరాల వరకు వర్తించే మార్గదర్శకాలను జారీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తన వాదనలో తెలిపింది. ఆర్థిక సహాయం అందజేతకు సంబంధించి 12 జాతీయ స్థాయి విపత్తులను గుర్తించిందని పేర్కొంది. దాని ప్రకారం... 1. తుపాన్లు, 2. కరవు, 3. భూకంపాలు, 4. అగ్నిప్రమాదాలు, 5. వరదలు, 6. సునామీ, 7. వడగండ్ల వాన, 8. కొండచరియలు కూలడం, 9. మంచు చరియల ముప్పు. 10. కుంభవృష్టి. 11. కీటక దాడులు, 12. శీతల గాలులు...వీటినే విపత్తులుగా గుర్తించారని, అందులో కరోనా లేదని తెలిపింది. అయినప్పటికీ దీన్ని ‘విపత్తు’గానే ప్రకటించినట్టు పేర్కొంది. కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం విపత్తుల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి ఇచ్చే సహాయం ‘కనీస ప్రమాణాల పరిహారం’గా ఉండాలని వివరించింది.
తీర్పులోని ప్రధానాంశాలు
* లభ్యమయ్యే వనరులు, నిధులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే హేతుబద్ధమైన మొత్తాన్ని నిర్ణయించాలి.
* ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఎన్ఎండీఏ ఆరు వారాల్లోగా తాజా మార్గదర్శకాలు ఇవ్వాలి.
* కరోనాతో చనిపోయిన వారి పేరున మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసే ప్రక్రియను సరళతరం చేస్తూ మార్గదర్శకాలు ఇవ్వాలి.
* ఎక్స్గ్రేషియా చెల్లింపునకు సంబంధించి జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 12(3)పై కేంద్ర ప్రభుత్వం చేసిన వాదన సరికాదు. పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదనడం తగదు. ఈ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదు.
* ఈ సెక్షన్ ప్రకారం పరిహారం చెల్లింపుపై మార్గదర్శకాలు ఇవ్వడంలో ఎన్డీఎంఏ విఫలమయింది. మార్గదర్శకాలు ఇవ్వకపోతే కోర్టే ఆ పని చేస్తుంది.
* విపత్తుల నిర్వహణకు సంబంధించి ఆర్థిక సంఘాలు చేసే సిఫార్సులు ఏవీ సెక్షన్ 12లోని ఆదేశాలను తోసిరాజనలేవు.
* ఆర్థిక సంఘం చేసిన ప్రతిపాదన మేరకు శ్మశాన వాటికల కార్మికుల కోసం బీమా పథకాన్ని రూపొందించడాన్ని కేంద్రం పరిశీలించాలి.
తప్పు సరిదిద్దుకోండి
‘తప్పును సరిదిద్దుకోవడానికి మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఓ అవకాశం ఇచ్చింది. కనీసం ఇప్పటికైనా తగిన మొత్తాన్ని పరిహారంగా నిర్ణయించి బాధితులకు ఉపశమనం కలిగించాలి. అలా చేస్తే సరయిన మార్గంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్టవుతుంది.’
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య