కరోనా మరణాలకు పరిహారం ఇవ్వాల్సిందే
కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ‘కనీస ప్రమాణాలు గల ఆర్థిక సహాయం’ ఇచ్చేందుకు తాజా మార్గదర్శకాలు జారీ చేయాలని బుధవారం
ఎంతివ్వాలో కేంద్రమే నిర్ణయించాలి
ఆరు వారాల్లో మార్గదర్శకాలు ఇవ్వాలి
ఆర్థిక సాయం సరికాదన్న వాదనల తిరస్కరణ
చట్టం అమలులో విఫలమయినట్టు వ్యాఖ్య
సుప్రీంకోర్టు తీర్పు
ఈనాడు - దిల్లీ
కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ‘కనీస ప్రమాణాలు గల ఆర్థిక సహాయం’ ఇచ్చేందుకు తాజా మార్గదర్శకాలు జారీ చేయాలని బుధవారం జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ-ఎన్డీఎంఏ)ను ఆదేశించింది. పరిహారం ఇవ్వాలని చట్టంలో విస్పష్టంగా ఉన్నందున దాన్ని అమలు చేసి తీరాలని తేల్చి చెప్పింది. కరోనా నివారణకు ఇతర రూపాల్లో సాయం చేస్తున్నామని, అందువల్ల నగదు కూడా ఇవ్వాలనడం సరికాదన్న కేంద్రం వాదనలను తిరస్కరించింది. నగదు రూపంలో పరిహారం ఇస్తే ఇతర కార్యక్రమాలకు నిధులు ఉండవన్నదాన్నీ అంగీకరించలేదు.
తాత్కాలిక సాయం (ఎక్స్గ్రేషియా) కింద ఎంత ఇవ్వాలన్నదానిపై తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, కేంద్ర ప్రభుత్వమే కనీస ప్రమాణాలుగల మొత్తాన్ని నిర్ధరించాలని న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం సూచించింది. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని దీనిపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ ఇద్దరు న్యాయవాదులు...రీపక్ కన్సల్, గౌరవ్ కుమార్ బన్సల్లు దాఖలు చేసిన రెండు వేరువేరు వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం పై తీర్పు ఇచ్చింది. పరిహారం చెల్లించడంతో పాటు, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో దేశవ్యాప్తంగా ఏకీకృత విధానం రూపొందించాలని తమ వ్యాజ్యాల్లో కోరారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాల తరఫున న్యాయవాది సుమీర్ సోధి నాలుగు మధ్యంతర దరఖాస్తులు సమర్పించారు. పరిహారం చెల్లింపులో వివక్ష ఉండకూడదని, అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే తరహా మొత్తం ఉండాలని కోరారు. ఒక రాష్ట్రం హెచ్చుగా, మరో రాష్ట్రం తక్కువగా పరిహారాన్ని నిర్ణయించకూడదని, అందువల్ల కేంద్ర ప్రభుత్వమే ఏకరూప విధానాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘పరిహారం నిర్ణయించడం వంటి వ్యవహారాల్లో సాధారణంగా కోర్టులు జోక్యం చేసుకోవు. అసాధారణత, ప్రభావం, విస్తృతి దృష్ట్యా రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించలేం’’ అని ధర్మాసనం పేర్కొంది.
‘షల్’...‘మే’...పై స్పష్టత
ప్రకృతి వైపరీత్యాలకు ప్రభావితమైన వారికి పరిహారం అందించడానికి నేషనల్ అథారిటీ కచ్చితంగా మార్గదర్శకాలను సిఫార్సు చేయాలని ప్రకృతి వైపరీత్యాల చట్టం-2005లోని సెక్షన్ 12(3) విస్పష్టంగా చెబుతోంది. పరిహారం తప్పనిసరిగా చెల్లించాలన్న అర్థం వచ్చే రీతిలో ‘షల్’ అనే పదం ఉండగా, అవకాశం ఉంటే ఇవ్వవచ్చన్న అర్థంలో ‘మే’ అన్న పదాన్ని ఉపయోగించి ఈ సెక్షన్పై కేంద్రం వాదన వినిపించింది. ఆ సెక్షన్లోని ‘షల్’ అనే పదాన్ని ‘మే’గా చదవాలని, ఇక్కడ ‘షల్’ను తప్పనిసరి అన్న అర్థంలో పొందుపరచలేదని చెప్పింది. ఇది సరికాదు. ఆ సెక్షన్లో ‘షల్’ అన్న పదాన్ని రెండుసార్లు ఉపయోగించడాన్ని బట్టి దాని వెనకున్న ఉద్దేశం సుస్పష్టం. ఈ పరిహారం ‘ఉదారంగా’ ఇచ్చేదే తప్ప, ‘ఆదేశాలకు లోబడి ఇచ్చేది కాదు’ అన్న వాదన కూడా ఆమోదయోగ్యం కాదు.
సరళంగా మరణ ధ్రువీకరణ పత్రాలు
మరణానికి స్పష్టమైన కారణలను చెబుతూ మరణ ధ్రువపత్రాలు జారీచేసేందుకు ఎన్డీఎంఏ సరళమైన మార్గదర్శకాలు జారీచేయాలి. ఒకవేళ మరణం కొవిడ్ ద్వారా సంభవించి ఉంటే ‘కొవిడ్-19 మరణం’ అన్న స్పష్టమైన కారణం చెబుతూ ధ్రువపత్రం జారీచేయాల్సిన బాధ్యత అధికార వ్యవస్థదే. ఒకవేళ ఎవరైనా కొవిడ్-19 వల్లకానీ, కొవిడ్-19 సోకడంవల్ల తలెత్తిన సమస్యలవల్లకానీ మరణిస్తే ఆ విషయాన్ని ధ్రువపత్రంలో స్పష్టంగా పేర్కొనాలి. ఒకవేళ ఎవరైనా వ్యక్తి కొవిడ్ సోకిన రెండు, మూడు నెలల తర్వాత ఆసుపత్రిలోకానీ, ఇంట్లోకానీ మరణించినా, అతని మరణానికి కొవిడే కారణమైనప్పుడు కచ్చితంగా కొవిడ్-19 వల్లే మరణించారని ధ్రువపత్రంలో పేర్కొనాలి. అధికారులు జారీచేసిన మరణ ధ్రువీకరణ పత్రంపై కుటుంబసభ్యులకు అభ్యంతరాలు ఉంటే, అందులో మరణానికి నిజమైన, స్పష్టమైన కారణాలు చెప్పకపోయి ఉంటే వారి సమస్యకు కచ్చితమైన పరిష్కారం చూపాలి. సంబంధిత అధికారులను సంప్రదించి మరణ ధ్రువీకరణ పత్రాన్ని సరిచేయించుకొనే వెసులుబాటు ఇవ్వాలి.
పరిహారం అవసరం లేదని సర్కారు వాదన
తొలుత కేంద్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ ‘ఆర్థిక స్థోమత’ పెద్ద సమస్యకాకపోయినా, రూ.4లక్షల పరిహారం చెల్లింపు విషయమై ఇతర అంశాలనూ గమనించాల్సి ఉందని తెలిపింది. జాతి సంపద వినియోగంలో ‘హేతుబద్ధత, వివేకం, గరిష్ఠ ప్రయోజనం’ వంటి అంశాలను పరిశీలించాలని పేర్కొంది. అనంతరం అదనపు ప్రమాణ పత్రం సమర్పిస్తూ కరోనా వంటి విపత్తులు జీవితంలో ఒకేసారే వచ్చేవని, ఇది ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ప్రభావితం చూపిందని తెలిపింది. నిపుణుల సూచనల మేరకు వివిధ రూపాల్లో సహాయం అందిస్తున్నామని, అందువల్ల మళ్లీ నగదు రూపంలో చెల్లించడం ఎందుకని పేర్కొంది. ఏ రాష్ట్రమూ, కేంద్ర పాలిత ప్రాంతమూ ఇంతవరకు పరిహారం చెల్లించలేదని తెలిపింది.
విపత్తుల జాబితాలో కరోనా లేదు
విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం 2015-2020 సంవత్సరాల వరకు వర్తించే మార్గదర్శకాలను జారీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తన వాదనలో తెలిపింది. ఆర్థిక సహాయం అందజేతకు సంబంధించి 12 జాతీయ స్థాయి విపత్తులను గుర్తించిందని పేర్కొంది. దాని ప్రకారం... 1. తుపాన్లు, 2. కరవు, 3. భూకంపాలు, 4. అగ్నిప్రమాదాలు, 5. వరదలు, 6. సునామీ, 7. వడగండ్ల వాన, 8. కొండచరియలు కూలడం, 9. మంచు చరియల ముప్పు. 10. కుంభవృష్టి. 11. కీటక దాడులు, 12. శీతల గాలులు...వీటినే విపత్తులుగా గుర్తించారని, అందులో కరోనా లేదని తెలిపింది. అయినప్పటికీ దీన్ని ‘విపత్తు’గానే ప్రకటించినట్టు పేర్కొంది. కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం విపత్తుల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి ఇచ్చే సహాయం ‘కనీస ప్రమాణాల పరిహారం’గా ఉండాలని వివరించింది.
తీర్పులోని ప్రధానాంశాలు
* లభ్యమయ్యే వనరులు, నిధులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే హేతుబద్ధమైన మొత్తాన్ని నిర్ణయించాలి.
* ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఎన్ఎండీఏ ఆరు వారాల్లోగా తాజా మార్గదర్శకాలు ఇవ్వాలి.
* కరోనాతో చనిపోయిన వారి పేరున మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసే ప్రక్రియను సరళతరం చేస్తూ మార్గదర్శకాలు ఇవ్వాలి.
* ఎక్స్గ్రేషియా చెల్లింపునకు సంబంధించి జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 12(3)పై కేంద్ర ప్రభుత్వం చేసిన వాదన సరికాదు. పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదనడం తగదు. ఈ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదు.
* ఈ సెక్షన్ ప్రకారం పరిహారం చెల్లింపుపై మార్గదర్శకాలు ఇవ్వడంలో ఎన్డీఎంఏ విఫలమయింది. మార్గదర్శకాలు ఇవ్వకపోతే కోర్టే ఆ పని చేస్తుంది.
* విపత్తుల నిర్వహణకు సంబంధించి ఆర్థిక సంఘాలు చేసే సిఫార్సులు ఏవీ సెక్షన్ 12లోని ఆదేశాలను తోసిరాజనలేవు.
* ఆర్థిక సంఘం చేసిన ప్రతిపాదన మేరకు శ్మశాన వాటికల కార్మికుల కోసం బీమా పథకాన్ని రూపొందించడాన్ని కేంద్రం పరిశీలించాలి.
తప్పు సరిదిద్దుకోండి
‘తప్పును సరిదిద్దుకోవడానికి మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఓ అవకాశం ఇచ్చింది. కనీసం ఇప్పటికైనా తగిన మొత్తాన్ని పరిహారంగా నిర్ణయించి బాధితులకు ఉపశమనం కలిగించాలి. అలా చేస్తే సరయిన మార్గంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్టవుతుంది.’
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది. -
ఐదేళ్ల ‘విద్వేషం.. విధ్వంసం’
జగన్ను 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించి... సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఇలాంటి అవకాశం వస్తే ఇంకెవరైనా సరే ప్రజారంజక పాలన అందించి, తన మార్కు చిరకాలం గుర్తుండిపోయేలా శ్రమిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ