Assembly Elections 2022: నేడు రెండో దశ సమరం
ఐదు రాష్ట్రాల ఎన్నికల సమరంలో భాగంగా రెండో విడత పోలింగ్ సోమవారం జరగనుంది. గోవా, ఉత్తరాఖండ్లలో ఒకే విడతలో పోలింగ్ పూర్తి కానుంది. యూపీలో రెండో దశ పోలింగులో భాగంగా మరికొన్ని స్థానాల్లో ఓటర్లు తీర్పునివ్వనున్నారు.అన్ని దశలకూ కలిపి ఓట్ల లెక్కింపును మార్చి 10న చేపట్టనున్న విషయం తెలిసిందే.
గోవా, ఉత్తరాఖండ్లలో ఒకే విడతలో పోలింగ్
యూపీలో 55 స్థానాల్లో ఓట్ల పండుగ
ఐదు రాష్ట్రాల ఎన్నికల సమరంలో భాగంగా రెండో విడత పోలింగ్ సోమవారం జరగనుంది. గోవా, ఉత్తరాఖండ్లలో ఒకే విడతలో పోలింగ్ పూర్తి కానుంది. యూపీలో రెండో దశ పోలింగులో భాగంగా మరికొన్ని స్థానాల్లో ఓటర్లు తీర్పునివ్వనున్నారు.
అన్ని దశలకూ కలిపి ఓట్ల లెక్కింపును మార్చి 10న చేపట్టనున్న విషయం తెలిసిందే.
యూపీలోముస్లింలే కీలకం
ఉత్తర్ప్రదేశ్లో ఈ దశలో 55 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో ఓటర్ల తీర్పును కోరుతున్న 586 మంది అభ్యర్థుల్లో సమాజ్వాదీ పార్టీ నేత మహమ్మద్ ఆజంఖాన్, పలువురు మంత్రులు ఉన్నారు. గతసారి ఈ 55 స్థానాల్లో 38 చోట్ల భాజపా అభ్యర్థులు గెలిచారు. రెండోదశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ముస్లిం ప్రాబల్య నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి. సంప్రదాయంగా ఇవి సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కంచుకోటలు.
గోవాలో ఓటర్లకు రాయితీలు
గోవాలో 40 సీట్లకు గానూ 301 మంది పోటీ పడుతున్నారు. ప్రతిసారీ రెండు పార్టీల మధ్య పోటీ నెలకొనే ఈ రాష్ట్రంలో ఈసారి బహుముఖ పోరు నెలకొంది. సిబ్బంది అంతా మహిళలే ఉండే 105 పోలింగ్ బూత్లను గోవాలో నెలకొల్పారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, విపక్ష నేత దిగంబర్ కామత్, మాజీ సీఎం లక్ష్మీకాంత్ పార్సేకర్ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో అర్హులైన ఓటర్లు 11 లక్షల మంది. సగటున ఒక బూత్లో 672 మంది ఓటర్లే ఉన్నారు. ఇది దేశంలోనే అతి తక్కువ. వాస్కో అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా 35,139 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ శాతాన్ని పెంచడానికి పలు దుకాణాలు ప్రత్యేక రాయితీలను ప్రకటించాయి. హాట్ఎయిర్ బెలూన్లో షికారుకు, బంగీ జంపింగ్కు రాయితీతో అవకాశం కల్పిస్తామని మరికొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. ఓటు వేసిన వచ్చిన జంటలకు ‘ప్రేమికుల దినోత్సవ’ ఆఫర్లు ఇస్తామని ఉత్తర గోవాలోని కొన్ని హోటళ్లు ఊదరగొడుతున్నాయి. గోవాలో ఎప్పుడూ విజేతల ఆధిక్యాలు స్వల్పంగానే ఉంటాయి. ఫిరాయింపులు ఎక్కువ. తీర్పు అస్పష్టంగా ఉంటుంది.
ఉత్తరాఖండ్ బరిలో 632 మంది
70 స్థానాలున్న ఉత్తరాఖండ్లో 632 మంది అభ్యర్థులు బరిలో దిగారు. దాదాపు 81.72 లక్షల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. వర్చువల్గా, భౌతికంగా ప్రచారాలతో పార్టీలు రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపాయి. రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న ఐదో అసెంబ్లీ ఎన్నిక ఇది. ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ, పలువురు మంత్రులు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మదన్ కౌశిక్ వంటివారు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం హరీశ్ రావత్ సహా పలువురు నేతలు పోటీ చేస్తున్నారు.
- దిల్లీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
‘పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించారు. డిగ్రీ పరీక్షలు రాయనివ్వకుండా నా భవిష్యత్తును నాశనం చేశారు’ అని దళిత విద్యార్థి శశాంక్ వాపోయారు. -
గులకరాయి ఘటనను ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
గులకరాయి ఘటనను ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ సహా వైకాపా నేతలు వాడుకుంటున్నారనీ, దీనిని నిలువరించాలని కోరుతూ విజయవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు నమోదవుతోంది. వడగాలులు సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తలెత్తిన ఒక భూవివాదంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేరు తెరపైకి వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
పింఛను కుట్ర.. తీస్తోంది ప్రాణం
సీఎం గారూ.. పండుటాకులు ఎంత ఘోష అనుభవిస్తున్నారో కనిపిస్తోందా? అభాగ్యులు పడే వేదన వినిపిస్తోందా? పదవిలో ఉండి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా వికృత రాజకీయ క్రీడ నడుపుతూ పింఛనుదారులపై ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా? -
సీఈఓ మౌనం.. వైకాపాకు లాభం!
ఫుట్బాల్ క్రీడలో రిఫరీలా.. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు అమలు చేసే పాత్ర పోషిస్తూ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి ఆహ్వానం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. -
సీఎం జగన్ను ఓడించడమే మా లక్ష్యం
ఈ ఎన్నికల్లో సీఎం జగన్ను ఓడించడమే 35మాదిగ సంఘాల ఐక్యవేదిక లక్ష్యమని.. ఆ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. -
యువత పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది
‘ఓటేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి.. ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో.. వారినే ముఖ్యమంత్రిగా చేయండి’ అని సౌదీ అరేబియాలోని ఆరామ్కో సంస్థతో కలిసి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పేదల ఇళ్లపై దా‘గూడు’ మూతలు!
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి... అభివృద్ధి మరచి తెదేపాపై అక్కసుతో వ్యవహరించిన జగన్... పేదలకిచ్చే ఇళ్లలోనూ ఆ అవలక్షణాన్నే ప్రదర్శించారు. -
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
సీఎం జగన్ను ఓటమి భయం పట్టుకుందా? కొన్ని నెలల క్రితం ‘వైనాట్.. 175’ అంటూ ధీమా ప్రదర్శించిన ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? ఎందుకీ ఎదురుగాలి.. అని మదన పడుతున్నారా? -
వేసవిలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. -
‘ఉత్తర్వుల ఎత్తివేత’పై త్వరగా విచారించండి
మాజీ మంత్రి వివేకా హత్య విషయంలో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయెద్దంటూ వెలువరించిన ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్) కోరుతూ మృతుడి కుమార్తె నర్రెడ్డి సునీత, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై త్వరగా విచారణ చేసి, ఈ నెల 8లోపు నిర్ణయం వెల్లడించాలని కడప జిల్లా న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పింఛన్ పెంచలే.. కానుకకు కరుణించలే!
ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో దివ్యాంగులపై ఎనలేని వివక్ష చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులు 8.07 లక్షల మంది ఉన్నారు. -
అవినాష్రెడ్డి ముందస్తు బెయిలు రద్దుకు నిరాకరణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బెయిలును రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి గడువు పొడిగించాలి
పోలింగ్ ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి అనుమతించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సంఘం వేర్వేరు ప్రకటనల్లో ఎన్నికల సంఘాన్ని కోరాయి. -
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
సీఎం జగన్ ఎక్కడ సిద్ధం సభలు నిర్వహించినా... అక్కడ విధ్వంసం పరిపాటిగా మారింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం సిద్ధం సభ జరిగింది. -
‘అ’భివృద్ధి ‘నిల్’.. అవినీతి ఫుల్!
ఆయనో యువ ప్రజాప్రతినిధి.. బెట్టింగ్ అనగానే టక్కున గుర్తుకొస్తారు. జిల్లాలోని సహజ వనరులను సొంతవాటిలా భావించారు.. ఈ ఐదేళ్లలో యథేచ్ఛగా కొల్లగొట్టేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్