Assembly Elections 2022: నేడు రెండో దశ సమరం
ఐదు రాష్ట్రాల ఎన్నికల సమరంలో భాగంగా రెండో విడత పోలింగ్ సోమవారం జరగనుంది. గోవా, ఉత్తరాఖండ్లలో ఒకే విడతలో పోలింగ్ పూర్తి కానుంది. యూపీలో రెండో దశ పోలింగులో భాగంగా మరికొన్ని స్థానాల్లో ఓటర్లు తీర్పునివ్వనున్నారు.అన్ని దశలకూ కలిపి ఓట్ల లెక్కింపును మార్చి 10న చేపట్టనున్న విషయం తెలిసిందే.
గోవా, ఉత్తరాఖండ్లలో ఒకే విడతలో పోలింగ్
యూపీలో 55 స్థానాల్లో ఓట్ల పండుగ
ఐదు రాష్ట్రాల ఎన్నికల సమరంలో భాగంగా రెండో విడత పోలింగ్ సోమవారం జరగనుంది. గోవా, ఉత్తరాఖండ్లలో ఒకే విడతలో పోలింగ్ పూర్తి కానుంది. యూపీలో రెండో దశ పోలింగులో భాగంగా మరికొన్ని స్థానాల్లో ఓటర్లు తీర్పునివ్వనున్నారు.
అన్ని దశలకూ కలిపి ఓట్ల లెక్కింపును మార్చి 10న చేపట్టనున్న విషయం తెలిసిందే.
యూపీలోముస్లింలే కీలకం
ఉత్తర్ప్రదేశ్లో ఈ దశలో 55 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో ఓటర్ల తీర్పును కోరుతున్న 586 మంది అభ్యర్థుల్లో సమాజ్వాదీ పార్టీ నేత మహమ్మద్ ఆజంఖాన్, పలువురు మంత్రులు ఉన్నారు. గతసారి ఈ 55 స్థానాల్లో 38 చోట్ల భాజపా అభ్యర్థులు గెలిచారు. రెండోదశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ముస్లిం ప్రాబల్య నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి. సంప్రదాయంగా ఇవి సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కంచుకోటలు.
గోవాలో ఓటర్లకు రాయితీలు
గోవాలో 40 సీట్లకు గానూ 301 మంది పోటీ పడుతున్నారు. ప్రతిసారీ రెండు పార్టీల మధ్య పోటీ నెలకొనే ఈ రాష్ట్రంలో ఈసారి బహుముఖ పోరు నెలకొంది. సిబ్బంది అంతా మహిళలే ఉండే 105 పోలింగ్ బూత్లను గోవాలో నెలకొల్పారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, విపక్ష నేత దిగంబర్ కామత్, మాజీ సీఎం లక్ష్మీకాంత్ పార్సేకర్ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో అర్హులైన ఓటర్లు 11 లక్షల మంది. సగటున ఒక బూత్లో 672 మంది ఓటర్లే ఉన్నారు. ఇది దేశంలోనే అతి తక్కువ. వాస్కో అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా 35,139 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ శాతాన్ని పెంచడానికి పలు దుకాణాలు ప్రత్యేక రాయితీలను ప్రకటించాయి. హాట్ఎయిర్ బెలూన్లో షికారుకు, బంగీ జంపింగ్కు రాయితీతో అవకాశం కల్పిస్తామని మరికొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. ఓటు వేసిన వచ్చిన జంటలకు ‘ప్రేమికుల దినోత్సవ’ ఆఫర్లు ఇస్తామని ఉత్తర గోవాలోని కొన్ని హోటళ్లు ఊదరగొడుతున్నాయి. గోవాలో ఎప్పుడూ విజేతల ఆధిక్యాలు స్వల్పంగానే ఉంటాయి. ఫిరాయింపులు ఎక్కువ. తీర్పు అస్పష్టంగా ఉంటుంది.
ఉత్తరాఖండ్ బరిలో 632 మంది
70 స్థానాలున్న ఉత్తరాఖండ్లో 632 మంది అభ్యర్థులు బరిలో దిగారు. దాదాపు 81.72 లక్షల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. వర్చువల్గా, భౌతికంగా ప్రచారాలతో పార్టీలు రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపాయి. రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న ఐదో అసెంబ్లీ ఎన్నిక ఇది. ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ, పలువురు మంత్రులు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మదన్ కౌశిక్ వంటివారు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం హరీశ్ రావత్ సహా పలువురు నేతలు పోటీ చేస్తున్నారు.
- దిల్లీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
పుతిన్, జిన్పింగ్ ఆలింగనంపై.. వైట్హౌస్ జోకులు
-
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం