UP Assembly Election Results 2022: డబుల్ ఇంజిన్.. డబుల్ సక్సెస్..
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో అధికార భాజపా మరోసారి తన సత్తా చాటింది. మోదీ-యోగి ద్వయం కరిష్మాతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేసింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ (డబుల్ ఇంజిన్) ప్రభుత్వం ఉండాలన్న ఆ
ఉత్తర్ప్రదేశ్లో కమలదళ అద్వితీయ విజయం
ఈనాడు, లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో అధికార భాజపా మరోసారి తన సత్తా చాటింది. మోదీ-యోగి ద్వయం కరిష్మాతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేసింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ (డబుల్ ఇంజిన్) ప్రభుత్వం ఉండాలన్న ఆ ఇద్దరు నేతల పిలుపు సత్ఫలితాలనిచ్చింది. ఎన్నికలకు ముందు ఓబీసీ నేతలు పార్టీకి దూరమైనా, రైతులు, నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదురైనా... అభివృద్ధి, సురక్ష నినాదాలతో ప్రతికూలతలన్నిటినీ అధిగమించింది. అధికారంలోకి వస్తామని ఆశించిన సమాజ్వాదీల అంచనాలను తలకిందులు చేసింది. గురువారం అర్థరాత్రి చివరి సమాచారం తెలిసే సమయానికి ...మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను భాజపా 251 స్థానాల్లో గెలుపొందగా మరో మూడు చోట్ల ఆధిక్యంలో ఉంది. దాని మిత్రపక్షాలు అప్నాదళ్(సోనెవాల్) 12 చోట్ల, నిషాద్ పార్టీ ఆరు స్థానాల్లో విజయం సాధించాయి. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ, దాని మిత్ర పక్షాలు 120 సీట్లకు పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జాతీయ పార్టీలైన బీఎస్పీ, కాంగ్రెస్ల ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలింది. ప్రస్తుత ఎన్నికల్లో బీఎస్పీ భారీగా నష్టపోయింది. కేవలం ఒకే ఒక స్థానంతో ఆ పార్టీ సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. 2017లో గెలుచుకున్న సీట్లలో 18ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో గెలుచుకున్న ఏడు సీట్లలో అయిదింటిని కోల్పోయి రెండు స్థానాలకే పరిమితం కానుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 321 సీట్లను గెలుచుకున్న భాజపా కూటమి బలం ఈ దఫా కాస్త తగ్గినప్పటికీ ప్రస్తుత ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంది. మొత్తం పోలైన ఓట్లలో భాజపాకి 41.4 శాతానికి పైగా వచ్చినట్లు తెలుస్తోంది. అప్నాదళ్(సోనెలాల్), నిషాద్పార్టీలతో కలిసి భాజపా ఉమ్మడిగా పోటీచేసింది. 370 స్థానాల్లో కమలం పార్టీ అభ్యర్థులు పోటీ చేయగా అనుప్రియ పటేల్ నేతృత్వంలోని అప్నాదళ్(సోనెలాల్) 17 స్థానాల్లో, నిషాద్ పార్టీ 16 స్థానాల్లో బరిలోకి దిగాయి. తమకు కేటాయించిన 16 సీట్లలో నిషాద్ పార్టీ గుర్తుపై 10 మంది, ఆరుగురు కమలం గుర్తుతో పోటీ చేశారు.
* సమాజ్వాదీ పార్టీకి పోలైన ఓట్లలో 32శాతం, ఆర్ఎల్డీకి 2.93శాతం, బీఎస్పీకి 12.9శాతం, కాంగ్రెస్కు 2.37 శాతం ఓట్లు వచ్చాయి. ఆప్, ఎంఐఎంలకు 0.5శాతం కన్నా తక్కువ ఓట్లు వచ్చినట్లు ఎన్నికల సంఘం గణాంకాలు తెలియజేస్తున్నాయి.
* గోరఖ్పుర్ అర్బన్ స్థానంలో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ తన సమీప ప్రత్యర్థి, ఎస్పీ అభ్యర్థి సుభావతి శుక్లపై లక్ష ఓట్లకు పైగా తేడాతో గెలిచారు.
* ఉపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య సిరాతు నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థిని పల్లవి పటేల్ చేతిలో 7,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
* ప్రముఖ ఓబీసీ నాయకుడు, ఎన్నికలకు ముందు ఆదిత్యనాథ్ కేబినెట్ నుంచి వైదొలగి ఎస్పీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య కుషీనగర్ జిల్లా ఫాజిల్నగర్లో 45వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
* విపక్ష ఎస్పీ కూటమిలోని రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ) 8 స్థానాలను, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఆరు స్థానాలను గెలుచుకున్నాయి.
* నోయిడాలో భాజపా అభ్యర్థి పంకజ్సింగ్ చరిత్ర సృష్టించారు. ఆయన లక్షా 79వేల ఓట్లతో గెలుపొంది రికార్డు సృష్టించారు.
* కుషీనగర్ జిల్లాలోని తమ్కుహిరాజ్ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్కుమార్ లల్లూ ఓటమి పాలయ్యారు.
* యూపీలోని బుందేల్ఖండ్లో భాజపా మరోసారి అతిపెద్ద రాజకీయ శక్తిగా అవతరించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బుందేల్ఖండ్లోని మొత్తం 19 స్థానాల్లో భాజపా విజయం సాధించగా, ఓట్ల లెక్కింపుపై చివరి సమాచారం అందే సమయానికి ఈసారి 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
‘పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించారు. డిగ్రీ పరీక్షలు రాయనివ్వకుండా నా భవిష్యత్తును నాశనం చేశారు’ అని దళిత విద్యార్థి శశాంక్ వాపోయారు. -
గులకరాయి ఘటనను ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
గులకరాయి ఘటనను ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ సహా వైకాపా నేతలు వాడుకుంటున్నారనీ, దీనిని నిలువరించాలని కోరుతూ విజయవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు నమోదవుతోంది. వడగాలులు సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తలెత్తిన ఒక భూవివాదంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేరు తెరపైకి వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
పింఛను కుట్ర.. తీస్తోంది ప్రాణం
సీఎం గారూ.. పండుటాకులు ఎంత ఘోష అనుభవిస్తున్నారో కనిపిస్తోందా? అభాగ్యులు పడే వేదన వినిపిస్తోందా? పదవిలో ఉండి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా వికృత రాజకీయ క్రీడ నడుపుతూ పింఛనుదారులపై ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా? -
సీఈఓ మౌనం.. వైకాపాకు లాభం!
ఫుట్బాల్ క్రీడలో రిఫరీలా.. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు అమలు చేసే పాత్ర పోషిస్తూ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి ఆహ్వానం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. -
సీఎం జగన్ను ఓడించడమే మా లక్ష్యం
ఈ ఎన్నికల్లో సీఎం జగన్ను ఓడించడమే 35మాదిగ సంఘాల ఐక్యవేదిక లక్ష్యమని.. ఆ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. -
యువత పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది
‘ఓటేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి.. ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో.. వారినే ముఖ్యమంత్రిగా చేయండి’ అని సౌదీ అరేబియాలోని ఆరామ్కో సంస్థతో కలిసి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పేదల ఇళ్లపై దా‘గూడు’ మూతలు!
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి... అభివృద్ధి మరచి తెదేపాపై అక్కసుతో వ్యవహరించిన జగన్... పేదలకిచ్చే ఇళ్లలోనూ ఆ అవలక్షణాన్నే ప్రదర్శించారు. -
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
సీఎం జగన్ను ఓటమి భయం పట్టుకుందా? కొన్ని నెలల క్రితం ‘వైనాట్.. 175’ అంటూ ధీమా ప్రదర్శించిన ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? ఎందుకీ ఎదురుగాలి.. అని మదన పడుతున్నారా? -
వేసవిలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. -
‘ఉత్తర్వుల ఎత్తివేత’పై త్వరగా విచారించండి
మాజీ మంత్రి వివేకా హత్య విషయంలో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయెద్దంటూ వెలువరించిన ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్) కోరుతూ మృతుడి కుమార్తె నర్రెడ్డి సునీత, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై త్వరగా విచారణ చేసి, ఈ నెల 8లోపు నిర్ణయం వెల్లడించాలని కడప జిల్లా న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పింఛన్ పెంచలే.. కానుకకు కరుణించలే!
ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో దివ్యాంగులపై ఎనలేని వివక్ష చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులు 8.07 లక్షల మంది ఉన్నారు. -
అవినాష్రెడ్డి ముందస్తు బెయిలు రద్దుకు నిరాకరణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బెయిలును రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి గడువు పొడిగించాలి
పోలింగ్ ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి అనుమతించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సంఘం వేర్వేరు ప్రకటనల్లో ఎన్నికల సంఘాన్ని కోరాయి. -
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
సీఎం జగన్ ఎక్కడ సిద్ధం సభలు నిర్వహించినా... అక్కడ విధ్వంసం పరిపాటిగా మారింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం సిద్ధం సభ జరిగింది. -
‘అ’భివృద్ధి ‘నిల్’.. అవినీతి ఫుల్!
ఆయనో యువ ప్రజాప్రతినిధి.. బెట్టింగ్ అనగానే టక్కున గుర్తుకొస్తారు. జిల్లాలోని సహజ వనరులను సొంతవాటిలా భావించారు.. ఈ ఐదేళ్లలో యథేచ్ఛగా కొల్లగొట్టేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్