Andhra News: ప్లాట్లపై పన్ను పోటు
పట్టణాల్లో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పేరుతో రుసుములు చెల్లించాలని పేదలకు ఇప్పటికే తాఖీదులిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. లేఅవుట్లలో ఎప్పుడో స్థలాలు (ప్లాట్లు) కొన్నవారికి వ్యవసాయేతర భూమి (నాలా) పన్ను కట్టాలని ప్రస్తుతం నోటీసులిస్తోంది. అప్పులు చేసి ప్లాట్లు కొన్న కుటుంబాలు లక్షలాది రూపాయిలు చెల్లించాలంటే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లేఅవుట్లకు అనుమతులిచ్చినప్పుడే వ్యాపారులు (డెవలపర్లు) నాలా పన్ను చెల్లించారా? లేదా? పరిశీలించకుండా, అనేక ఏళ్ల తర్వాత కొనుగోలుదారులను బాధ్యులను చేయడంపై ఆవేదన చెందుతున్నారు. పన్ను చెల్లించని ప్లాట్ల క్రయవిక్రయాలపై రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం ఆదేశించడం మరింత కలవరపెడుతోంది.
రూ.500 కోట్ల నాలాపన్ను లక్ష్యం
వసూళ్లకు రంగంలోకి రెవెన్యూశాఖ
లేఅవుట్లలో స్థలాల కొనుగోలుదారులకు తాఖీదులు
అధికారుల తప్పిదానికి ప్రజలు బాధ్యులా?
అనుమతులిచ్చినప్పుడే ఎందుకు పట్టించుకోలేదు?
ఈనాడు - అమరావతి
పట్టణాల్లో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పేరుతో రుసుములు చెల్లించాలని పేదలకు ఇప్పటికే తాఖీదులిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. లేఅవుట్లలో ఎప్పుడో స్థలాలు (ప్లాట్లు) కొన్నవారికి వ్యవసాయేతర భూమి (నాలా) పన్ను కట్టాలని ప్రస్తుతం నోటీసులిస్తోంది. అప్పులు చేసి ప్లాట్లు కొన్న కుటుంబాలు లక్షలాది రూపాయిలు చెల్లించాలంటే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లేఅవుట్లకు అనుమతులిచ్చినప్పుడే వ్యాపారులు (డెవలపర్లు) నాలా పన్ను చెల్లించారా? లేదా? పరిశీలించకుండా, అనేక ఏళ్ల తర్వాత కొనుగోలుదారులను బాధ్యులను చేయడంపై ఆవేదన చెందుతున్నారు. పన్ను చెల్లించని ప్లాట్ల క్రయవిక్రయాలపై రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం ఆదేశించడం మరింత కలవరపెడుతోంది. విజయవాడలో వందకుపైగా లేఅవుట్ల నుంచి నాలా పన్ను వసూలు చేయడానికి రెవెన్యూ శాఖ సిద్ధమైంది. మిగతా నగరాల్లోనూ ఇదే విధంగా నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో రూ.500 కోట్లకుపైగా పన్ను వసూలు చేయాలన్నది లక్ష్యంగా తెలుస్తోంది.
అప్పుడు ఏమయ్యారు?
పట్టణాభివృద్ధి సంస్థలు ప్రైవేట్ లేఅవుట్లకు ప్లాన్లు (ఎల్పీ నంబరు) ఇచ్చాయంటే వీటిలో ఎలాంటి లొసుగులు ఉండవన్న నమ్మకంతో ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేస్తుంటారు. అన్ని రకాల ఫీజులు చెల్లించాకే పట్టణాభివృద్ధి సంస్థలు అనుమతులిస్తాయన్నది భరోసా. అనుమతులిచ్చేటప్పుడే సంబంధిత వ్యాపారి రెవెన్యూ శాఖకు నాలా పన్ను చెల్లించారా, లేదా అన్నది పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు మొదట పరిశీలిస్తారు.
ఆ తర్వాత డెవలప్మెంట్ ఛార్జీలు, భూ వినియోగ మార్పిడి రుసుములు వసూలు చేస్తారు. 2006 తరువాత వేసిన ప్రతి లేఅవుట్కు నాలాపన్ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అయినప్పటికీ 2007, 2008, 2009లో వేసిన లేఅవుట్లల్లో కొనుగోలు చేసిన ప్లాట్లకు నాలాపన్ను చెల్లించాలని తాజాగా రెవెన్యూ శాఖ నోటీసులిస్తోంది. అంటే నాలాపన్ను చెల్లించకపోయినా పట్టణాభివృద్ధి సంస్థలు లేఅవుట్లకు అనుమతులిచ్చాయా?, ఇచ్చినా రెవెన్యూ శాఖ ఇప్పటిదాకా పట్టించుకోలేదా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రాథమిక దశలోనే లోపాలు గుర్తించి నోటీసులిస్తే లేఅవుట్ వేసిన వ్యాపారి పన్ను చెల్లించేవారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం వంటి నగరాల్లో లేఅవుట్లు వేసిన వ్యాపారులు ఇప్పుడెక్కడున్నారో తెలియదు. పేరొందిన స్థిరాస్తి వ్యాపార సంస్థలైతే సులువుగా గుర్తించవచ్చు. చిన్నాచితక సంస్థలు, వ్యాపారుల చిరునామా తెలుసుకొని, వారిని ప్రశ్నించడం సాధ్యమయ్యే పని కాదు.
5% పన్ను.. మరో 5% అపరాధ రుసుము: ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్దేశించిన విలువపై 5% చొప్పున నాలా పన్ను, మరో 5% అపరాధ రుసుము చెల్లించాలంటే కొనుగోలుదారులకు తడిసిమోపెడవుతుంది. విజయవాడ నగర శివారులో ఒక వ్యక్తి 2007లో గజం రూ.15 వేల ధరకు 200 గజాల విస్తీర్ణం గల ప్లాట్ని రూ.30 లక్షలకు కొన్నారు. అదే గజం స్థలం ధర ప్రస్తుతం రూ.30 వేలు ఉంది. అంటే ప్లాట్ విలువ రూ.60 లక్షలు. దీనిపై 5% నాలా పన్ను రూ.3 లక్షలు, 5% అపరాధ రుసుము కింద మరో రూ.3 లక్షలు కలిపి మొత్తం రూ.6 లక్షలు కట్టాలి. సీఆర్డీఏ, వుడా, తుడా వంటి పట్టణాభివృద్ధి సంస్థల్లో స్థలాల విలువ ఎక్కువ అయినందున ఇప్పుడు వారు భారీగా చెల్లించాల్సి ఉంటుంది. లేఅవుట్లలో ప్లాట్లు కొన్నవారిలో 60% వరకు మధ్య తరగతి కుటుంబాలు ఉంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు బ్యాంకుల్లో అప్పులు చేసి కొనుగోలు చేస్తుంటారు. ప్లాట్ కొన్నందుకు చేసిన అప్పులు తీరకముందే.. నాలాపన్ను ఏంటని విజయవాడకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి ఒకరు వాపోయారు.
4నగరాల్లో 450 లేఅవుట్లు రూ. 500 కోట్లు
విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో నాలా పన్ను చెల్లించని దాదాపు 450 లేఅవుట్లను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అత్యధికంగా విశాఖలో 150 లేఅవుట్లు ఉన్నాయి. శాటిలైట్ ఇమేజ్ల ద్వారా వీటిని గుర్తించి నోటీసులు సిద్ధం చేస్తున్నారు. విజయవాడలో ఇప్పటికే కొన్ని నోటీసులు జారీ చేశారు. మిగతా నగరాల్లోనూ త్వరలో ఇవ్వనున్నారు. నాలుగు నగరాల్లో రూ.500 కోట్లకుపైగా పన్ను వసూలు చేయాలన్నది ప్రణాళికగా తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..